ఇది పేద ప్రజలకు చంద్రన్న ఇచ్చే హామీ టీడీపీనేత పందికోన ఈరన్న ఎమ్మిగనూరు; మన బీవీ మన ఎమ్మిగనూరు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక న్యూ ఇందిరానగర్ కాలనీ ప్రజలకు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో పాటు డబల్ ఇంజన్ సర్కార్ ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రజలకు వివరించడం జరిగింది. దీంతోపాటు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం జరిగింది. ఈ వైకాపా ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు రాక చాలామంది నిరుపేదలు అవస్థలు పడుతున్నారు అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు రేషన్ కార్డులో పిల్లల్ని చేర్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వందల మంది నిరుపేద ప్రజల రేషన్ కార్డులను తొలగించాడు. చౌక దుకాణాలలో కూడా సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదు. కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని బాబు గారు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కాబట్టి పేదవాడు గుర్తింపు కార్డు ఆయన రేషన్ కార్డు ను ఇచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి న్యూ ఇందిరానగర్ ఓటర్ మహాశయులారా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన. ఈ కార్యక్రమంలో 90వ. బూత్ గృహ సారధులు పాల్గొన్నారు.