JagadishReddy : రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు: జగదీశ్ రెడ్డి

Revanth Reddy Unfit to Continue as CM, Alleges Jagadish Reddy

JagadishReddy : రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు: జగదీశ్ రెడ్డి:తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని డిమాండ్ చేశారు.

ఢిల్లీ రహస్య ఒప్పందాలపై జగదీశ్ రెడ్డి ప్రశ్నలు

తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని డిమాండ్ చేశారు. గోదావరి నదిని రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హక్కును ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేస్తోందని, తెలంగాణవాదులు భయపడిందే నిజం అవుతోందని జగదీశ్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ నీళ్ల కోసం పోరాడారో, ఆ నీళ్లను రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. మన నదులు మనకు కాకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ నుంచి ఒక ఫోన్ కాల్ రాగానే రేవంత్ రెడ్డి భయపడి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారని, అక్కడ హోటల్‌లో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు అధికారం ఇచ్చింది చీకటి ఒప్పందాలు కుదుర్చుకోవడానికా అని ప్రశ్నించారు. గోదావరి-బనకచర్ల విషయంలో రెండు రాష్ట్రాల్లో వేర్వేరు వార్తలు వస్తున్నాయని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి తన పదవి కోసం కోట్లాది తెలంగాణ ప్రజల హక్కులను బలిపెడతారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి తెలంగాణవాదుల రక్తం మరుగుతోందని అన్నారు. రేవంత్ రెడ్డి తన గురువులైన మోదీ, చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారని, చంద్రబాబు సహాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి మూటలు పంపినా తమకు అభ్యంతరం లేదని, కానీ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Read also:Tirumala : సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు: తిరుమలలో భద్రతపై ప్రశ్నలు

 

Related posts

Leave a Comment