HighCourt : ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ: పులివెందుల, ఒంటిమిట్ట రీపోలింగ్ పిటిషన్ కొట్టివేత:పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయంతో దిగ్భ్రాంతికి లోనైన వైసీపీకి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో ఎదురుదెబ్బ తగిలింది.
పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల రీపోలింగ్పై వైసీపీ పిటిషన్ తిరస్కరణ
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయంతో దిగ్భ్రాంతికి లోనైన వైసీపీకి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ, పులివెందుల నియోజకవర్గంలోని 15 పోలింగ్ కేంద్రాల్లోనూ, ఒంటిమిట్టలోని 30 పోలింగ్ కేంద్రాల్లోనూ తిరిగి పోలింగ్ నిర్వహించాలని లేదా ఎన్నికల ప్రక్రియపై స్టే విధించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రీపోలింగ్కు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్దేనని కూడా తేల్చి చెప్పింది. మరోపక్క, హైకోర్టు ఈ పిటిషన్ను పరిశీలించే సమయానికి పులివెందుల ఎన్నికల ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. అలాగే, పులివెందుల నియోజకవర్గంలో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.
Read also:IndiaPakistan : 1947 దేశ విభజన: రాడ్క్లిఫ్ గీసిన విషాద రేఖ
