YSSharmila : అన్నదాతకు అన్యాయం: చంద్రబాబుపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

YS Sharmila Slams Chandrababu, Alleges Injustice to Farmers

YSSharmila : అన్నదాతకు అన్యాయం: చంద్రబాబుపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు:ఏపీలో కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదని, అన్నదాత దుఃఖీభవ అని ఆమె విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు అందరికీ కాదని, కొందరికేనని ఆరోపించారు.

చంద్రబాబుపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

ఏపీలో కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదని, అన్నదాత దుఃఖీభవ అని ఆమె విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు అందరికీ కాదని, కొందరికేనని ఆరోపించారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే, చంద్రబాబు ప్రభుత్వం కేవలం 47 లక్షల మందిని మాత్రమే ఎంపిక చేసిందని షర్మిల వెల్లడించారు. ఈ ‘వడపోత’ పేరుతో 30 లక్షల మంది రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు.

“ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు సగం మందికే ఇస్తున్నారు. ‘తల్లికి వందనం’ పథకంలో 20 లక్షల మంది పిల్లలను కోత పెట్టారు. ఇప్పుడు ‘సుఖీభవ’ పేరుతో రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ. 20,000 ఇస్తుందని ఊదరగొట్టారు. కానీ గెలిచాక మాట మార్చి, కేంద్రం ఇచ్చే రూ. 6,000తో ముడిపెట్టారు.

కేంద్రం ఇచ్చే రూ. 6,000 పక్కనపెడితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం రూ. 14,000 మాత్రమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పిన మీరు, కేంద్ర పథకంతో రాష్ట్రానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. కేంద్రం నేరుగా రైతుల ఖాతాల్లో వేసినప్పుడు మీరు ఇచ్చినట్టు ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. రెండూ కలపడం అసాధ్యం అన్నారు.

అప్పుడు అన్ని మాటలు చెప్పిన మీరు ఇప్పుడు కేంద్రం నిధులతో ఎందుకు కలిపారు? మీరు ఇస్తామన్న రూ. 20,000లో కేంద్రం వాటాను ఎందుకు చేర్చారు? హామీలు ఇచ్చేటప్పుడు కేంద్రం వాటాతో కలిపి అని ఎందుకు చెప్పలేదు? కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకం దేశంలోని రైతులకు అందరికీ వర్తిస్తుంది, కేవలం ఏపీకి మాత్రమే కాదు. దీనికి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నేరుగా రైతుకు రూ. 20,000 ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం” అని షర్మిల స్పష్టం చేశారు.

Read also:Karnataka : ప్రభుత్వ ఉద్యోగి అక్రమాస్తులు: ₹30 కోట్ల సంపాదన!

Related posts

Leave a Comment