Jannaram : మంచిర్యాల జిల్లా జన్నారంలో పులి సంచారం:మంచిర్యాల జిల్లాలో పులి సంచారం స్థానికులలో భయాందోళనలు సృష్టించింది. జన్నారం మండలంలోని సింగరాయపేట- దొంగపెళ్లి రహదారిపై ఈ రోజు ఉదయం ఒక పులి కనిపించింది. రహదారి పక్కన ఉన్న కల్వర్టుపై అది కూర్చుని గాండ్రిస్తూ కనిపించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మంచిర్యాల జిల్లా జన్నారంలో పులి సంచారం
మంచిర్యాల జిల్లాలో పులి సంచారం స్థానికులలో భయాందోళనలు సృష్టించింది. జన్నారం మండలంలోని సింగరాయపేట- దొంగపెళ్లి రహదారిపై ఈ రోజు ఉదయం ఒక పులి కనిపించింది. రహదారి పక్కన ఉన్న కల్వర్టుపై అది కూర్చుని గాండ్రిస్తూ కనిపించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి.
పులిని చూసిన వాహనదారులు దాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించారు. కాసేపటికి పులి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ఈ ఘటనపై అటవీ అధికారులు స్పందిస్తూ, పులి సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
Read also : Samantha : సమంత 15 ఏళ్ల సినీ కెరీర్: స్టార్డమ్పై ఆసక్తికర వ్యాఖ్యలు
