Y.V. Subbareddy : టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సిట్‌ నోటీసులు – 12 గంటల సుదీర్ఘ విచారణ

వైవీ సుబ్బారెడ్డి

Y.V. Subbareddy : సిట్ దర్యాప్తుతో హాట్ టాపిక్‌ అయిన వైవీ సుబ్బారెడ్డి – 12 గంటల పాటు జరిగిన విచారణ

టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు. తిరుమల శ్రీవారికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిట్ అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని, అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి తెలిపారు.

Y.V. Subbareddy :

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ అడిగిన ప్రతీ ప్రశ్నకు సమగ్రంగా సమాధానం ఇచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించానని స్పష్టంచేశారు. కల్తీ నెయ్యి అంశంపై నిజానిజాలు బయల్పడాలనే ఉద్దేశంతో తానే సుప్రీం కోర్టును ఆశ్రయించానని గుర్తుచేశారు.

“నాపై అవినీతి ఆరోపణలు చేయడం దురుద్దేశపూరితం. కోట్ల రూపాయల ప్రాజెక్టులు పక్కనబెడితే… నెయ్యి వంటి విషయంలో ఎందుకు అవినీతి చేస్తాను?” అని ఆయన ప్రశ్నించారు. 2024 జూన్‌లో సరఫరా చేసిన నాలుగు నెయ్యి ట్యాంకుల్లో జంతువుల కొవ్వు లేదా ఇతర నూనెల మిశ్రమం ఉందా అంటూ కోర్టు స్పష్టత కోరిందని వివరించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని, బాధ్యతాయుతంగా పనిచేశానని పేర్కొన్నారు.

ఈ కేసులో చర్చనీయాంశంగా ఉన్న అప్పన్న అనే వ్యక్తి 2018 నుంచే తన వద్ద పీఏగా పనిచేయడం లేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ నెయ్యి సరఫరాదారుల నుంచి అతని ఖాతాలోకి డబ్బులు వెళ్లి ఉంటే, అతడితో పాటు సంబంధిత అధికారులపైనా విచారణ జరపాలని కోరారు. అలాగే, 2014 నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని నెయ్యి సరఫరాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలంటూ సిట్‌కు డిమాండ్‌ చేసినట్లు వెల్లడించారు.

Read : YV Subbareddy Comments on Jagan – Sharmila Issue| షర్మిల – జగన్ ఆస్తుల పై ..బాబాయ్ హాట్ కామెంట్స్..!

Related posts

Leave a Comment