-
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం
-
అవార్డును ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ఎకనమిక్ టైమ్స్ సంస్థ
-
ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించిన మంత్రి నారా లోకేశ్
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ప్రముఖ వాణిజ్య పత్రిక ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఆయనను ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
ఈ గౌరవం లభించిన సందర్భంగా లోకేశ్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తమ కుటుంబానికి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన క్షణం అని పేర్కొన్నారు. భారతదేశంలో సంస్కరణల ప్రయాణాన్ని స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో ముందుకు నడిపించిన నాయకులు చాలా అరుదని ఆయన తన పోస్టులో వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సంస్కరణలు, వేగవంతమైన పాలనపై ఉన్న నమ్మకానికి ఈ అవార్డు నిదర్శనమని లోకేశ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు దార్శనికతకు, ఆయన అమలు చేసిన విధాన సంస్కరణలకు జాతీయ స్థాయిలో లభించిన కీలక గుర్తింపుగా ఈ పురస్కారాన్ని పలువురు అభివర్ణిస్తున్నారు.
Read : Chandrababu: గత ప్రభుత్వ అప్పులను రీ-షెడ్యూల్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు నాయుడు
