A place where you need to follow for what happening in world cup

24 గంటల కరెంటు ఉత్తమాటేనా…

0

బీజేపీ నాయకుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి:పెద్దపల్లి
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఉత్తమాటేనా అని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టి ముక్కుల సురేష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ సరఫరా ఉత్తమాటగా మిగిలి పోయిందన్నారు. జిల్లాలో త్రిఫేజ్‌ విద్యుత్ సరఫరా అంతరాయంపై సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్, రైతుబంధు పథకాల అమలు చేస్తామని అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారని ప్రభుత్వం చెప్పుతున్న దానికి చేసేదానికి పొంతన లేకుండా పోయింద న్నారు. అన్నదాతలు ఆర్ధిక సమస్యల తో ఒక పక్క ఆత్మ హత్యలు చేసుకుంటే, ఫామ్ హౌస్ లో పడుకోని దొర కలలు కంటున్నారని ఏద్దేవా చేశారు.

కరెంట్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలపై ఏసీడి పేరుతో అదనపు భారం మోపారన్నారు. ఇంత జరుగు తున్నా ఎమ్మెల్యే అన్నదాతల సమస్యను పట్టించుకున్న పాపాన పొలేదన్నారు. వేసవి ప్రారంభానికి ముందే పరిస్థితులు ఇలా ఉంటే వేసవిలో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు త్రిఫేజ్‌ కరెంట్‌ కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అధికారులు విద్యుత్ సరఫరాపై కచ్చితమైన షెడ్యుల్‌ను ప్రకటించక పోవడంతో అన్నదాతలు అయోమయా నికి గురవుతున్నారని, అసలు అధికారులకే విద్యుత్‌ సరఫరాపై స్పష్టత లేనట్లు కనిపిస్తుందిని విమర్షించారు. ప్రభుత్వం 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చెబుతున్నా, ఎమ్మెల్యే, అధికారులు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలంటూ ప్రశ్నించారు.

విద్యుత్ కోతలపై ఇప్పటికైనా ఎమ్మెల్యే అన్నదాతలు, ప్రతి పక్షాలు రోడెక్కి ఆందళోనలు చేపట్టక ముందే త్రీఫేస్ విద్యుత్ సరఫరా జరిగేలా చొరవ చూపాల ని, సమస్య జటిలం కాకుముందే చర్యలు చేపట్టాలని లేదంటే ఆందోళనలు తప్పవని సురేష్ రెడ్డి హెచ్చరించారు. అలాగే పెద్దపల్లి మున్సిపాలిటీలో సరైన త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కమాన్ నుండి నిర్మిస్తున్న నూతన రోడ్డులో పైపులు పలిగి రొడ్లపైకి నీరొచ్చినా పట్టించుకొనె నాధుడే లేడని, ఏమ్మెల్యే అభివృద్ధి సోయి లేకుండా తన స్వంత పనులను చక్కబెట్టుకొంటున్నాడని ఇకనైనా పద్దతి మార్చుకో వాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కట్కూరి సత్యనారాయణ రెడ్డి, మోలుగురి రాజవీరు, మోర మనోహర్, లింగంపల్లి కరుణాకర్, సయ్యద్ ఫయాజ్, వునుకొండ భూమయ్య,ఐద తిరుపతి, గంగుల సతీష్, మొసంపల్లి శ్రీధర్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.