మింగుడు పడని పవన్ వ్యవహారం

Pawan Kalyan

మింగుడు పడని పవన్ వ్యవహారం   నెల్లూరు, డిసెంబర్ 5, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఎలా జరిగినా గత ఎన్నికల్లో మాత్రం గ్రాండ్ వెల్ కమ్ జరిగిందనే చెప్పాాలి. జనసేన పార్టీ వంద శాత స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ గెలిచింది. అయితే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించాలనుకుంటున్నారు. తన,మన అనేది లేకుండా అవినీతికి తావివ్వని పాలన అందివ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. ప్రత్యర్థులను ఒకవైపు కట్టడి చేస్తూనే కూటమి పార్టీలలో జరుగుతున్న తీరును కూడా ఎండగట్టేందుకు ఆయన ఏమాత్రం వెనకాడటం లేదు. కానీ పవన్ కల్యాణ్ చర్యలు కొందరు కూటమి నేతలకే రుచించడం లేదు. ప్రధానంగా టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ ఇలా వ్యవహరిస్తే తమ…

Read More

AP | న్యూ ఇయర్ హామీలకు లైన్ క్లియర్

chandrababu

AP | న్యూ ఇయర్ హామీలకు లైన్ క్లియర్   విజయవాడ, డిసెంబర్ 5, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి కేవలం అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టడం లేదు. సంక్షేమాన్ని కూడా సమపాళ్లలో జరపాలన్న నిర్ణయానికి వచ్చారు. నిధులు పెద్దగా అందుబాటులో లేకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా వ్యవహరించడం, మద్దతుగా నిలుస్తుండం చంద్రబాబు ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా చూడాలి. రుణాల విషయంలోనూ, నిధుల మంజూరులోనూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎక్కువగా రాష్ట్రానికి విడుదల చేయడంలోనూ ఢిల్లీ పెద్దలసు సహకరిస్తుండటంతో చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నాలుగు వేల రూపాయలు నెలకు పింఛను ఇస్తున్నారు. దివ్యాంగులకు ఆరువేల రూపాయల పింఛను నెలకు…

Read More

YS Jagan | మళ్లీ జనంలోకి జగన్

YS Jaganmohan Reddy

YS Jagan | మళ్లీ జనంలోకి జగన్   విజయవాడ, డిసెంబర్ 5, (న్యూస్ పల్స్) కూటమి ప్రభుత్వానికి రివర్స్ అటాక్ ఇవ్వడంలో, ఏమాత్రం ఆలస్యం చేయవద్దని అనుకున్నారో ఏమో కానీ, ఈసారి పెద్ద ప్లాన్ తో మీడియా సమావేశం నిర్వహించారు జగన్. ఈ సమావేశంలో ఉద్యమ బాట పట్టనున్నట్లు, తమ కార్యకర్తలపై నమోదైన కేసులపై న్యాయ పోరాటం సాగించనున్నట్లు జగన్ తెలిపారు.ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఊహించని షాక్ తిన్న మాజీ సీఎం జగన్ ఇప్పుడిప్పుడే ఉద్యమబాటకు శ్రీకారం చుట్టారు. కేవలం 11 సీట్లు వైసీపీకి పరిమితం కాగా, క్యాడర్ కొంత ఆందోళన చెందింది. దీనితో పలు దఫాలుగా ఆయా జిల్లాల నాయకులతో జగన్ సమావేశాన్ని సైతం నిర్వహించారు. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్న తరుణంలో, ఇటీవల మీడియా ముఖంగా జగన్…

Read More

Free Power schme in Andhra Pradesh ఏపీలో ఉచిత విద్యుత్ స్కీమ్..

free power scheme in ap

Free Power schme in Andhra Pradesh ఏపీలో ఉచిత విద్యుత్ స్కీమ్..   విజయవాడ, డిసెంబర్ 4, (న్యూస్ పల్స్) ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్దమైంది. తాజాగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకాన్ని తొలగించినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ప్రభుత్వం తెలిపింది. వెంటనే పలు మార్గదర్శకాలను పాటిస్తే, ఉచిత విద్యుత్ పథకంతో లబ్ది పొందవచ్చని విద్యుత్ శాఖ కూడా ప్రకటించింది. గత వైసీపీ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు లబ్ది చేకూర్చింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, పథకాన్ని రద్దు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని, లబ్దిదారులు కంగారు…

Read More

TDP  3వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్ట్… రెడీ

TDP will come to power in Telangana soon

TDP 3వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్ట్… రెడీ     విజయవాడ, డిసెంబర్ 4, (న్యూస్ పల్స్) మూడో విడత నామినేటెడ్ పోస్టుల జాబితాపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..చ‌ర్చించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘంగా భేటీ అయిన ఇద్దరు నేతలు అనేక అంశాల‌పై చ‌ర్చించారు. దీనిలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. రెండు జాబితాల్లో జ‌న‌సేన‌, బీజేపీల‌ కంటే..టీడీపీ నేత‌ల‌కే ఎక్కువగా ప‌ద‌వులు ద‌క్కాయి. అయితే టీడీపీ నుంచి ఇంకా న్యాయం జ‌ర‌గ‌లేదంటూ..మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న, నాగుల్ మీరా స‌హా..దేవినేని ఉమా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వంటివారు అసంతృప్తిలో ఉన్నారట. వీరికితోడు నెల్లూరు జిల్లాకు చెందిన మేక‌పాటి చంద్రశేఖ‌ర్‌రెడ్డి కూడా..నామినేటెడ్ పోస్ట్ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఇక‌ అనంతపురం జిల్లాకు చెందిన యామినీ బాల…

Read More

 YSRCP | ఫ్యాన్ కింద ఉక్కపోత…

ysrcp

 YSRCP | ఫ్యాన్ కింద ఉక్కపోత… ఏలూరు, డిసెంబర్ 4, (న్యూస్ పల్స్) వైసీపీ క్రమంగా ఖాళీ అవుతోందా? సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఫ్యాన్‌కు గుడ్ బై చెప్పే పనిలో పడ్డారా? రేపో మాపో మాజీ మంత్రి ఒకరు సైకిల్ ఎక్కుబోతున్నారా? టీడీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా మెలిగిన కీలక నేతలు ఆ పార్టీకి రాం రాం చెప్పేస్తున్నారు. ఇప్పటికే మోపిదేవి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి నేతలు గుడ్ బై చెప్పే తమ దారి చూసుకుంటున్నారు. మోపిదేవి సైకిల్ ఎక్కేశారు. బాలినేని జనసేన పంచన చేరిపోయారు. మిగతా నేతలు సైతం తలోదారి చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు.నేతలు వెళ్లిపోవడాన్ని ముందుగానే గమనించారు మాజీ సీఎం జగన్. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం…

Read More

Pawan Kalyan పవన్ టార్గెట్ కాకినాడ…రీజనేంటీ

Pawan Kalyan

Pawan Kalyan పవన్ టార్గెట్ కాకినాడ…రీజనేంటీ   విజయవాడ, డిసెంబర్ 2, (న్యూస్ పల్స్) ప్రస్తుతం ఏపీలో కాకినాడ పోర్టు ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కాకినాడ పర్యటన తర్వాత.. పోర్టు వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడ పోర్టు నుంచి వేల కోట్ల రూపాయల దందా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. పవన్ పోర్టుపై ఎందుకు ఫోకస్ పెట్టాలో మంత్రి నాదెండ్ల వివరించారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటనతో స్మగ్లింగ్ గుట్టు బయటపడిందని.. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు ముప్పు కలిగేలా స్మగ్లింగ్ కొనసాగుతోందన్నారు. గత ఐదేళ్లుగా అక్రమంగా బియ్యం రవాణా చేశారన్న మనోహర్, కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామని వివరించారు. కాకినాడ పోర్టులోకి ఎవరూ రాకుండా కుట్ర చేశారని.. గత…

Read More

Pawan Kalyan | కాకినాడ పోర్టు లో పవన్ తనిఖీలు | Eeroju news

Pawan Kalyan

కాకినాడ పోర్టు లో పవన్ తనిఖీలు అధికారులు నాకు సహకరించడం లేదు- పవన్ కళ్యాణ్ కాకినాడ, నవంబర్ 29, (న్యూస్ Pawan Kalyan గంజాయికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని, కాకినాడ పోర్టులోకి వెళ్లి స్టెల్లా అనే ఓడను పరిశీలించేందుకు వెళ్తే తనకు అధికారులు సహకరించలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదురుగా షిప్ లో చిన్న చిన్న షిప్ నుంచి సరుకులు దింపుతూ ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు. పోర్టులో ఎగుమతి ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారని అడిగితే తమకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉందని చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.ఏపీకి 975 కిలోమీటర్ల తీరం కలిగి ఉంది. తీర ప్రాంతం మనకు ఎంత బలమో, అంత బలహీనత. గతంలో విశాఖపట్నానికి ఘాజీ అనే పాకిస్తాన్ సబ్ మెరైన్ రావడానికి నిదర్శనం. విదేశాల…

Read More

Pawan Kalyan | జనసేనాని పాన్ ఇండియా పొలిటిషియనా…? | Eeroju news

Pawan Kalyan

జనసేనాని పాన్ ఇండియా పొలిటిషియనా…? కాకినాడ, విజయవాడ, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Pawan Kalyan జనసేనాని పవన్ కల్యాణ్ తన టార్గెట్ పెంచారు. రాష్ట్ర స్థాయినేత నుంచి జాతీయస్థాయి పొలిటిషయన్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 20 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తానని పాలిటిక్స్‌లో అడుగు పెట్టిన పవన్ పదేళ్లలోపే ఒక రాష్ట్రనికి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. 2014 నుంచి జన సేనతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ మొదట్లో ఎదురు దెబ్బలే తిన్నారు. 2019లో తొలిసారి పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు. ఆయన్ని వైసిపి నేతలు గత ఐదేళ్లు విపరీతంగా ట్రోల్ చేశారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం పవన్‌కు హ్యాండ్ ఇచ్చేశారు. పాలిటిక్స్‌లో…

Read More

Jagan – Sharmila | జగన్ ఫ్యామిలీలో ఆదానీ రచ్చ టార్గెట్ చేసిన షర్మిళ.. | Eeroju news

Jagan - Sharmila

జగన్ ఫ్యామిలీలో ఆదానీ రచ్చ టార్గెట్ చేసిన షర్మిళ.. విజయవాడ, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Jagan – Sharmila కి పవర్ అగ్రిమెంట్స్‌ లొల్లి రోజురోజుకు కాక రేపుతోంది. వారం రోజులుగా దేశంలో హాట్ టాపిక్‌ ఇష్యూగా కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఓ వైపు పార్లమెంట్‌ సమావేశాలను కుదిపేస్తుండగానే..మరోవైపు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. సెకి ఫైల్‌కు ఆగమేఘాల మీద ఆమోదం తెలిపారని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం.. అవసరమైతే జగన్‌ మీద కేసు పెట్టేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుందట. ఇంతలోనే అటు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కామెంట్స్..ఇటు మాజీమంత్రి బాలినేని కౌంటర్‌ కొత్త రచ్చకు దారి తీస్తున్నాయి.ఇది చాలదన్నట్లుగా వైఎస్ షర్మిల సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా అవుతోంది. సెకి ఒప్పంద విషయంలో బాలినేని మీద అటాక్ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి…

Read More