వందేభారత్ ఎక్స్ప్రెస్.. 14 బోగీల్లో…10 బోగీలు ఖాళీ విశాఖపట్టణం, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Vande Bharat Express వందేభారత్ ఎక్స్ప్రెస్.. చాలా రూట్లలో బాగా డిమాండ్ ఉంది. కానీ.. విశాఖపట్నం- దుర్గ్ మధ్య నడిచే ట్రైన్కు డిమాండ్ నామమాత్రంగా కూడా లేదు. దీంతో ఈ రైలు నిత్యం ఖాళీగా దర్శనమిస్తోంది. దీంతో డిమాండ్ లేని రూట్లో ఎందుకు.. వేరే మార్గంలో నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.చాలావరకు వందేభారత్ రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. టికెట్లు లభించడం కష్టంగా ఉంది. కానీ.. విశాఖపట్నం- దుర్గ్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ పరిస్థితి దారుణంగా. ప్రయాణికుల నుంచి ఆదరణ లభించడం లేదు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్కు వెళ్తున్న వందేభారత్ రైళ్లకు భారీగా డిమాండ్ ఉంటోంది. విశాఖపట్నం- దుర్గ్ వందేభారత్లో మాత్రం బోగీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ ట్రైన్లో మొత్తం 14…
Read MoreCategory: ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh
Revenue Sadassulu in AP | డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు | Eeroju news
డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు విజయవాడ, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Revenue Sadassulu in AP భూముల రీసర్వే సమస్యల పరిష్కారానికి ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామ సభల్లో స్వీకరించిన ఫిర్యాదులను 45 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది.వైసీపీ హయాంలో ఏపీలో భూముల రీసర్వే జరిగింది. దీంతో పాత సమస్యలతో పాటు కొన్ని కొత్త సమస్యలు తలెత్తాయి. భూరికార్డుల ప్రక్షాళన పేరిట చేపట్టిన రీసర్వే ఇంకా పూర్తికాలేదు. ఇంతలో ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో భూముల రీసర్వే దాదాపుగా నిలిచిపోయింది. భూసమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.భూముల సమస్యల పరిష్కారించేందుకు డిసెంబర్ 1వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో గ్రామ,…
Read MoreBalineni vs Chevireddy… | విద్యుత్ ఒప్పందాల లంచం వ్యవహారంలో బాలినేని వర్సెస్ చెవిరెడ్డి | Eeroju news
విద్యుత్ ఒప్పందాల లంచం వ్యవహారంలో బాలినేని వర్సెస్ చెవిరెడ్డి ఒంగోలు, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Balineni vs Chevireddy… విద్యుత్ ఒప్పందాల లంచం వ్యవహారం బాలినేని వర్సెస్ చెవిరెడ్డిగా మారింది. అర్ధరాత్రి నిద్ర లేపి విద్యుత్ ఒప్పందాలపై సంతకాలు చేయమన్నారని మాజీ మంత్రి బాలినేని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ పదవి కోసం జగన్ పై అభాండాలు వేస్తున్నారని బాలినేనిపై చెవిరెడ్డి ఫైర్ అయ్యారు.పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసింది. విద్యుత్ ఒప్పందాలకు అదానీ ప్రభుత్వాధినేతలకు లంచాలు ఇచ్చారని ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం జగన్ పేరు బయటకు వచ్చింది. వైసీపీ హయాంలో ఏపీ ప్రభుత్వం, అదానీతో విద్యుత్ ఒప్పందాలకు..వైఎస్ జగన్ కు లంచం ఇచ్చారనే వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జగన్ ప్రభుత్వంలో విద్యుత్…
Read MoreCable war in AP…| బెజవాడలో కేబుల్ వార్… | Eeroju news
బెజవాడలో కేబుల్ వార్… విజయవాడ, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Cable war in AP పీలో కేబుల్ వార్ నడుస్తోంది. కేబుల్ వ్యాపారంలో గుత్తాధిపత్యం కొనసాగిస్తున్న సంస్థలు కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే కేబుల్ వ్యాపారాన్ని దక్కించుకునేందుకు కొందరు పావులు కదిపారు. కోట్లు కురిపించే కేబుల్ వ్యాపారంలో కొందరికి మాత్రమే లాభాలు దక్కుతున్నాయని, కళ్లు చెదిరే ఆదాయం కేబుల్ వ్యాపారంలో లభిస్తోందని గుర్తించిన రాజకీయ నేతలు తమ పరిధిలో కేబుల్ వ్యాపారాన్ని దక్కించుకోడానికి పావులు కదిపారు. ఈ క్రమంలో కొందరు రాజకీయ నాయకులకు ముఖ్యనాయకుల ఆశీస్సులు లభించడంతో విజయవాడలో కేబుల్ వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవడం సులువైంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న టీవీ ఛానళ్ల ప్రసారాలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ సానుభూతిపరులు…
Read MorePawan Kalyan | పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్ | Eeroju news
పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్ విజయవాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Pawan Kalyan మహారాష్ట్ర ఎన్నికల్లో మహా యూటీ కూటమి ఘనవిజయం సాధించింది. బిజెపి నేతృత్వంలోని ఆ కూటమి 230 సీట్లు సాధించి రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. బిజెపి సొంతంగా 132 సీట్లు గెలుచుకోగా..శివసేన 57 స్థానాలు..ఎన్సీపీ 41 సీట్లు సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం చవిచూసింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన 20 చోట్ల, కాంగ్రెస్ 16 చోట్ల, శరద్ పవర్ నేతృత్వంలోని ఎన్సిపి పది చోట్ల విజయం సాధించాయి. అయితే ఈ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కేకే సర్వే అంచనాలు నిజమయ్యాయి. ఆ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా నిలిచాయి. ఈ సంస్థ అధినేత కిరణ్ కొండేటి ఆసక్తికర విషయాలను…
Read MoreTaramandal Technologies in AP | ఫోర్బ్స్ జాబితా చేసిన AP ఆధారిత స్టార్టప్ తారామండల్ టెక్నాలజీస్ | Eeroju news
ఫోర్బ్స్ జాబితా చేసిన AP ఆధారిత స్టార్టప్ తారామండల్ టెక్నాలజీస్ లోకల్ టూ గ్లోబల్ అంటున్న విశాఖ కుర్రాళ్లు… విశాఖపట్టణం, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Taramandal Technologies in AP విశాఖకు చెందిన తారమండల్ టెక్నాలజీస్ స్పెస్ టెక్ రంగంలో ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తుందని ఫోర్బ్స్ ఇండియా గుర్తించింది. తాజాగా రిలీజ్ చేసిన డి గ్లోబలిస్ట్ లిస్టులో టాప్ 200 స్టార్టప్ జాబితాలో తారమండల్ టెక్నాలజీస్కు చోటు కల్పించింది. గ్లోబల్ బిజినెస్ పొటెన్షియల్, ఇన్నోవేషన్, విస్తరణ ప్రణాళికలను గుర్తించి జాబితాలో చోటు కల్పించింది. ఫోర్బ్స్ ఇండియా ఎలైట్ గ్లోబలిస్ట్ జాబితాలో చోటు అంత సామాన్యంగా దక్కదు. కొన్ని వేల స్టార్టప్లు తమ ప్రణాళక్ని ఆశయాలను..స్టార్టప్ పురోగతిని వివరిస్తూ నామినేషన్లు పంపిస్తారు. అందులోనుంచి కొన్నింటిని ఎంపిక చేస్తారు. అలా ఫోర్బ్స్ కు వచ్చిన కొన్ని వేల…
Read MoreAndhra Pradesh | యువరైతుల పెళ్లి కోసం బండి యాత్ర | Eeroju news
యువరైతుల పెళ్లి కోసం బండి యాత్ర అనంతపురం, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Andhra Pradesh స్వలాభం కోసమో… పార్టీల మైలేజ్ కోసమో… రాజకీయ నాయకులు చేసే పాదయాత్రలు.. బస్సు యాత్రలు ఇప్పటివరకు మనం చూసాం… కొందరుతమ అభిమాన తారలను కలిసేందుకు చేసే సైకిల్ యాత్ర… బైక్ యాత్రలు కూడా చూశాం. కానీ ఎద్దుల బండిపై యాత్ర మీరు ఎప్పుడైనా చూసారా… శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన యువ రైతు నవీన్ ఎద్దుల బండిపై యాత్ర చేపట్టాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసేందుకు యువరైతు నవీన్ హిందూపురం నుంచి అమరావతికి ఎద్దుల బండిపై యాత్ర మొదలుపెట్టాడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు… మహిళలపై జరుగుతున్న అకృత్యాలు… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించేందుకు యాత్ర చేపడుతున్నట్లు నవీన్ చెబుతున్నాడు. అన్నింటికంటే ముఖ్యమైనది……
Read MoreSocial war in AP | మళ్లీ మొదలైన సోషల్ మీడియా వార్ | Eeroju news
మళ్లీ మొదలైన సోషల్ మీడియా వార్ విజయవాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Social war in AP నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టివస్తుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా యుగం ప్రారంభమయింది. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానున్న కాలంలో మరింత వేడెక్కనున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఎవరూ ఎవరికీ తగ్గని పరిస్థితుల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా ద్వారా రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలను ఇప్పటికే ఏపీలో ప్రారంభించాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ ఏ అంశం పై సోషల్ మీడియాలో పోస్టు చేస్తారో? ఎవరిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడతారన్నది రాజకీయ నేతలకు…
Read MoreAmaravati | అమరావతి రైతుల కోసం 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలు | Eeroju news
అమరావతి రైతుల కోసం 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలు విజయవాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Amaravati అమరావతి నిర్మాణం కోసం చాలామంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇది శుభ పరిణామమని ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ మల్లారపు నవీన్ వ్యాఖ్యానించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు శుభవార్త చెప్పారు. వారికి కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్కు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నవీన్ వెల్లడించారు.తాజాగా.. గవర్నర్పేటలోని సీఆర్డీఏ కార్యాలయంలో గతంలో రిటర్నబుల్ ప్లాట్లు అందుకోని రైతులకు.. లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. లాటరీలో ప్లాట్లు పొంది ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందుకున్న రైతులు వారం లోపు సంబంధిత కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లాటరీకి…
Read MorePriyanka Gandhi | రాహుల్ రికార్డ్ చేసిన ప్రియాంక | Eeroju news
రాహుల్ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రియాంక తిరువనంతపురం, నవంబర్ 23, (న్యూస్ పల్స్) Priyanka Gandhi తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. కేరళ వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ నేత, సమీప అభ్యర్థి నవ్య హరిదాస్పై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేసి రికార్డు సృష్టించారు. రెండో స్థానంలో కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి నిలిచారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 10 వేల ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.వయనాడ్లో 2019 లోక్సభ ఎన్నికల్లో సీపీఐ నేత…
Read More