Who will listen to the sarpanch’s cry… | సర్పంచ్ ల మొర వినేదెవరు… | Eeroju news

Who will listen to the sarpanch's cry..

సర్పంచ్ ల మొర వినేదెవరు… కరీంనగర్, జూన్ 25, (న్యూస్ పల్స్) Who will listen to the sarpanch’s cry.. కరీంనగర్ జిల్లా గ్రామ పంచాయితీలో బిల్లులు పేరుకుపోయాయి. పెండింగ్ బిల్లుల కారణంగా.. మాజీ సర్పంచ్‎లు ఆందోళన చెందుతున్నారు. సరిగా బిల్లులు రాకపోవడంతో.. అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పలువురు మాజీ సర్పంచ్‎లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా.. సర్పంచ్‎ల పదవీకాలం ముగిసి ఆరు నెలలు గడుస్తోంది. దీంతో పెండింగ్ బిల్లులు మంజూరుకాక చాలా ఇబ్బందులు పడుతున్నారు లోకల్ నాయకులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ బిల్లులు పెండింగ్‎లో ఉన్నాయి. స్థానికంగా నిధులు లేనప్పటికీ.. గతంలో సర్పంచ్‎లు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటికి సంబంధించిన నిధులు సక్రమంగా సమయానికి రావడం లేదు. దీంతో కనీసం సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు.…

Read More

Greater to Lady Lion | గ్రేటర్ కు లేడీ సింగం | Eeroju news

Greater to Lady Lion

గ్రేటర్ కు లేడీ సింగం హైదరాబాద్, జూన్ 25, (న్యూస్ పల్స్) Greater to Lady Lion తెలంగాణ ప్రభుత్వం వారం వ్యవధిలోనే మరోమారు ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. గత వారం 18 జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌(జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా అమ్రపాలిని నియమించింది. ప్రస్తుత కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌ను ట్రాన్స్‌కో కమిషనర్‌గా బదిలీ చేసింది. తెలంగాణ సర్కార్‌ తాజాగా తీసుకన్న నిర్ణయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.  తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు సీనియర్ అధికారుల కన్నా ఎక్కువ పవర్ ఫుల్‌గా ఉన్న ఆఫీసర్ కాట అమ్రపాలి. తాజా బదిలీల్లో ఆమెను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా కూడా నియమించారు. ఇప్పటికే ఆమె  జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్,  మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్,…

Read More

The speaker inspected the primary health center at Patlur | పట్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పీకర్ | Eeroju news

The speaker inspected the primary health center at Patlur

పట్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పీకర్ వికారాబాద్ The speaker inspected the primary health center at Patlur వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ పట్లూర్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసారు.  సమయానికి ఆస్పత్రిలో   డాక్టర్ లేకపోవడంతో  మండిపడ్డారు.  జిల్లా అదికారి డిఎండ్ఎచ్ ఒ పాల్వకుమార్ పోన్ తీయకపోవడంతో వికారాబాద్ జిల్లా  కలెక్టర్ కు ఫోన్ చేసి ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల అలసత్వం చూపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరో సారి ఇలాంటివి పునరావృతం కాకుండా చేసుకోవాలని తెలిపారు.     మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం…? | No-confidence motion against Gutta in the council…? | Eeroju news    

Read More

For Mahbub Nagar and Rangareddy Districts Zero electricity bill will be implemented from last March | మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలకు గత మార్చి నుంచి జీరో విద్యుత్ బిల్లు అమలు చేస్తాం | Eeroju news

Zero electricity bill

మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలకు గత మార్చి నుంచి జీరో విద్యుత్ బిల్లు అమలు చేస్తాం మహబూబ్ నగర్ For Mahbub Nagar and Rangareddy Districts Zero electricity bill will be implemented from last March కరెంట్ షాక్ తో మరణించిన వారికి సంబంధించి విధాన నిర్ణయం తీసుకుంటాం సబ్ స్టేషన్ ల స్థాయిలో కమిటీలు వేసి విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం నాగర్ కర్నూల్ లో విద్యుత్ శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఎన్నికల కోడ్ మూలంగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా వాసులు 2500 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకుంటే జీరో బిల్లు సౌకర్యాన్ని పొందలేకపోయారు, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసింది ఆ రెండు ఉమ్మడి జిల్లాల వాసులకు గత మార్చి…

Read More

Same…Sean… | సేమ్…సీన్… | Eeroju news

Same...Sean...

సేమ్…సీన్… పార్టీలు మార్పు అంతే హైదరాబాద్, జూన్ 25, (న్యూస్ పల్స్) Same…Sean… తెలంగాణలో బొటాబోటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ స్థిరంగా ఉండేందుకు చేరికలను ప్రోత్సహిస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో విపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది. దీంతో తాము బలపడతామని, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను బలహీనపరుస్తున్నామని హస్తం నేతలు భావిస్తున్నారు. కానీ, ఈ విషయంలో గతంలో కేసీఆర్‌ చేసిన తప్పే ఇప్పుడు సీంఎ రేవంత్‌రెడ్డి చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇబ్బందులను కోరి తెచ్చుకుంటున్నామని మర్చిపోతున్నారు.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా వారిపై ఎన్నికల్లో పోటీచేసి ఓడి పోయినవారిపై ప్రభావం పడుతోంది. ఎమ్మెల్యేల చేరికతో వారి అనుచరులు కూడా అధికార పార్టీలోకి వస్తారు. దీంతో గతంలో కాంగ్రెస్‌ ఓడిపోవడానికి పనిచేసిన వారే ఇప్పుడు జై కాంగ్రెస్‌ అనాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారికి, కొత్తగా…

Read More

Politics revolving around coal | బొగ్గు చుట్టూ తిరుగుతున్న రాజకీయం | Eeroju news

Politics revolving around coal

బొగ్గు చుట్టూ తిరుగుతున్న రాజకీయం హైదరాబాద్, జూన్ 24, (న్యూస్ పల్స్) Politics revolving around coal : తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు బొగ్గు చుట్టూ తిరుగుతోంది. తెలంగాణలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించకుండా కేంద్రం వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొన్నది. అందుకే బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తమ హయాంలో బొగ్గు బ్లాకుల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించామని సింగరేణిని కూడా వేలంలో పాల్గొనడానికి అంగీకరించలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ భిన్నంగా స్పందిస్తోంది. వేలంలో పాల్గొనకుండా సింగరేణికి నష్టం చేశారని కోల్ బ్లాకులు బీఆర్ఎస్ నేతల సన్నిహితులుక చెందడానికే ఇలా చేశారంటున్నారు. సింగరేణికి ప్రస్తుతం ఉన్న బొగ్గు గనులు మరో…

Read More

Saru… Car… Bazaru.. | సారు…కారు… బేజారు.. | Eeroju news

Saru... Car... Bazaru..

సారు…కారు… బేజారు.. హైదరాబాద్, జూన్ 24, (న్యూస్ పల్స్) Saru… Car… Bazaru.. అందితే జుట్టు.. లేదంటే కాళ్లు.. ఈ సామెత పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది. మాజీ సీఎం, ప్రస్తుత బీఆర్ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే ఇప్పుడు ఆయన చేసే చర్యలు అలా ఉన్నాయి కాబట్టి మొన్న మొన్నటి వరకు.. అంటే అధికారం పోయేంత వరకు ఏ రోజైనా పార్టీ నేతలతో భేటీ అయ్యారా? కనీసం ఎమ్మెల్యేలతో అయినా మాట్లాడరా? లేదు. కానీ కాలం మహాచెడ్డది కదా.. ఎన్నికల ముందు వరకు వీనిలాకాశంలో విహరిస్తున్న కేసీఆర్‌ను తమ ఓటుతో నేలకు దించారు ప్రజలు.దీంతో ఇప్పుడు అందరూ కనిపిస్తున్నారు.. అందరితో ముచ్చటించేందుకు ప్రయత్నిస్తున్నారు.. కాని అస్సలు కుదరడం లేదంట. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఏం నడుస్తోంది? ఇది ప్రశ్న.. ఎప్పుడూ ఖాళీ అవుతుందో అస్సలు…

Read More

Hastam Gutiki is another MLA | హస్తం గూటికి మరో ఎమ్మెల్యే | Eeroju news

Hastam Gutiki is another MLA

హస్తం గూటికి మరో ఎమ్మెల్యే హైదరాబాద్, జూన్ 24, (న్యూస్ పల్స్) Hastam Gutiki is another MLA : ప్రతిపక్ష BRS పార్టీకి మరో షాక్ తగిలింది. జగిత్యాల బీఆరెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కండువా కప్పి సంజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి BRS ను వీడి కాంగ్రెస్ లో చేరడం తెలిసిందే.తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ భావజాలంతో కలిసి పనిచేసే వారిని అందర్నీ కలుపుకుని వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు ఉండటంతో కొన్ని నెలలపాటు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ స్థానాలు నెగ్గడంపై ఫోకస్ చేసింది. సార్వత్రిక…

Read More

Pujas for Warangal rains | వరంగల్ వర్షాల కోసం పూజలు | Eeroju news

Pujas for Warangal rains

వరంగల్ వర్షాల కోసం పూజలు వరంగల్, జూన్ 24, (న్యూస్ పల్స్) Pujas for Warangal rains : తెలంగాణలో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు కురిసినా కొన్ని వరంగల్‌.. సిద్ధిపేట జిల్లాలో వర్షాలు కురవలేదు.వర్షాభావ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో వర్షాలు కురవాలని వరంగల్ జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హనుమకొండలోని పద్మాక్షి కాలనీలో పోచమ్మతల్లి, కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు చేశారు మహిళలు. విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు జలకళ సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని మహిళలు నీళ్ల బిందెలు ఎత్తుకొని ఆలయాలకు చేరుకుని విగ్రహాలకు జలాభిషేకాలు చేశారు. పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు.పౌర్ణమి రోజున పోచమ్మకు ప్రత్యేక పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. గతంలోనూ ఇలాంటి పూజ చేయడం వల్ల తమ…

Read More

Nest of irregularities… | అక్రమాల గూడెం… | Eeroju news

Nest of irregularities

అక్రమాల గూడెం… హైదరాబాద్, జూన్ 24, (న్యూస్ పల్స్) Nest of irregularities… మోదీ వస్తే ఈడీ వస్తుంది.. ఎన్నికల సమయంలోనే ఈడీ దాడులు చేస్తుంది.. విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుంది.. ఇదీ ఆరునెలల క్రితం వరకు బీఆర్‌ఎస్‌ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐపై, కేంద్రంపై చేసిన ఆరోపణలు. కానీ ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. మోదీ రాష్ట్రానికి రాలేదు.. కానీ ఈడీ వచ్చింది. కారణం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి మైనింగ్‌ పేరుతో చేసిన అక్రమాల గుట్టు తేల్చబోతోంది. అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వానికి రూ.39 కోట్ల నష్టం నష్టం కలిగించారు. ఈ లెక్క తేల్చేందుకు ఈడీ మహిపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డితోపాటు బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసింది. ఇక మొదట రూ.39 కోట్ల అక్రమాలు జరిగాయని ఈడీ…

Read More