KCR | జనవరి నుంచి జనాల్లోకి కేసీఆర్ | Eeroju news

జనవరి నుంచి జనాల్లోకి కేసీఆర్

జనవరి నుంచి జనాల్లోకి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 12, (న్యూస్ పల్స్) KCR భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ మరోసారి ఫీల్డ్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంముగిసిన తర్వాత ఆయన పార్టీ నేతల్ని కలవడం మానేశారు. పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఎవరైనా పుట్టినరోజు సందర్భంగా వస్తే అశీర్వదించడం తప్ప రాజకీయాలు మాట్లాడి చాలా కాలం అయింది. అయితే హఠాత్తుగా ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు సమయం ఇచ్చారు. రాజకీయ అంశాలు మాట్లాడారు. దాంతో కేసీఆర్ .. మళ్లీ ట్రాక్‌లోకి వస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.భూపాలపల్లిజిల్లాలో ఇటీవల ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. రేవంత్ ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని త్వరలో వారింటికి వెళ్లి పరామర్శించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వరంగల్ జిల్లా పార్టీ నేతలకు…

Read More

Real Estate | హైదరాబాద్ లో రియల్ ఆఫర్లు… | Eeroju news

హైదరాబాద్ లో రియల్ ఆఫర్లు...

హైదరాబాద్ లో రియల్ ఆఫర్లు… హైదరాబాద్, నవంబర్ 12, (న్యూస్ పల్స్) Real Estate హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఒకరకంగా ఇబ్బందులు పడుతుంది. కొనేవారు లేక అనేక ఫ్లాట్లు మిగిలిపోతున్నాయి. దీంతో బిల్డర్లు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. నిర్మాణాలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో పాటు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా తగ్గింది. దీనికి అనేక కారణాలున్నాయి. ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగిరం జరుగుతుండటంతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కొంత రియల్ ఎస్టేట్ ఏపీ వైపు మళ్లిందని చెబుతున్నారు. ప్రధానంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కొంత రియల్ రంగం ఊపందుకుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లో కొంత పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య తగ్గింది.ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు కూడా ప్రస్తుతం హైదరాబాద్ వైపు…

Read More

Social media | వామ్మో… ఏం పిచ్చి రీల్స్ కోసం రూ.15 కోట్లా | Eeroju news

వామ్మో... ఏం పిచ్చి రీల్స్ కోసం రూ.15 కోట్లా

వామ్మో… ఏం పిచ్చి రీల్స్ కోసం రూ.15 కోట్లా హైదరాబాద్, నవంబర్ 12, (న్యూస్ పల్స్) Social media ప్రభుత్వ భూములను అమ్మటం.. అలా వచ్చిన డబ్బుతో దీర్ఘకాలిక పనులు చేయకుండా.. ఏదో ఒక పథకానికి కొంతమేర ఖర్చుచేసి.. మిగతావన్నీ రకరకాల పేర్లతో దండుకోవడం సర్వసాధారణంగా మారింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉదంతం కళ్ళ ముందు కనిపిస్తోంది. హర్యాన ఆర్థిక ఇబ్బందులు సజీవ సాక్షాత్కారం లాగా నిలుస్తోంది. అయినప్పటికీ మిగతా రాష్ట్రాల నేతలు మారడం లేదు. అందువల్లే మన దేశం ఆర్థికంగా ఎదలేక పోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 2023-24 కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఒక జీవో సంచలనం సృష్టిస్తోంది.. అందులో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన వివరాలు కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ప్రచారం కోసం…

Read More

KCR survey results | కేసీఆర్ సర్వే రిజల్ట్స్ ఎక్కడ… | Eeroju news

కేసీఆర్ సర్వే రిజల్ట్స్ ఎక్కడ...

కేసీఆర్ సర్వే రిజల్ట్స్ ఎక్కడ… వరంగల్, నవంబర్ 11, (న్యూస్ పల్స్) KCR survey results ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పేరిట తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. కులాలవారీగా.. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి స్థితిగతులపై ఈ సర్వేలో సమాచారాన్ని సేకరించనుంది. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. అయితే, అందుకు కేంద్రం సుముఖంగా లేకపోవడంతో.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ నేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పౌరులకు సంబంధించి కులాలవారీగా సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం, వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరచడమే కులగణన ముఖ్య…

Read More

KCR & Revanth Reddy | రేవంత్‌కు సవాల్ విసరబోతున్న కేసీఆర్.. | Eeroju news

రేవంత్‌కు సవాల్ విసరబోతున్న కేసీఆర్..

రేవంత్‌కు సవాల్ విసరబోతున్న కేసీఆర్.. హైదరాబాద్, నవంబర్ 11, (న్యూస్ పల్స్) KCR & Revanth Reddy కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను ఫీల్డులోకి వస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. భూపాలపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు తప్పకుండా వస్తానని వారికి హామీ ఇచ్చారు.చాలా కాలం తరువాత కేసీఆర్ ఫొటో పేపర్లలో కనిపించింది. కేసీఆర్ మాటలు మీడియాలో వినిపించాయి. కేసీఆర్ వ్యాఖ్యలు పేపర్లలో ప్రచురితమయ్యాయి. కొన్ని నెలల తరువాత కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడుతున్నట్లు వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో ఆయన అభిమానుల్లో సంతోషం కనిపించింది. నిన్న పాలకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే.. ఒకప్పుడు సింహంలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే కేసీఆర్‌ను నిన్న చాటుమాటుగా వీడియో తీస్తూ పోస్ట్ చేశారు. అయితే.. ఎవరో…

Read More

Telangana | 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష తేదీల షెడ్యూల్ విడుద‌ల‌.. | Eeroju news

10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష తేదీల షెడ్యూల్ విడుద‌ల‌..

10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష తేదీల షెడ్యూల్ విడుద‌ల‌.. హైదరాబాద్, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Telangana ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫీజు తేదీలను తెలంగాణ ప్రాథ‌మిక విద్యామండ‌లి విడుద‌ల చేసింది. ఈ నెల 18 వ‌ర‌కు ఫీజు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించారు. 18వ తేదీ వ‌ర‌కు ఎలాంటి అద‌న‌పు రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించారు. రూ.50 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 2 వ‌ర‌కు, రూ.200 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 12 వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. అంతే కాకుండా రూ.500 రుసుముతో డిసెంబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. 21వ తేదీనే చివ‌రి తేదీగా ప్ర‌క‌టించింది. ఆ త‌ర‌వాత ఫీజు క‌ట్టేందుకు అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఫీజుల వివ‌రాల విష‌యానికి వ‌స్తే… రెగ్యుల‌ర్ విద్యార్థుల‌కు అన్ని స‌బ్జెక్టుల‌కు క‌లిపి రూ. 125 చెల్లించాల్సి…

Read More

Malla Reddy | మల్లారెడ్డికి మరిన్ని చిక్కులు | Eeroju news

మల్లారెడ్డికి మరిన్ని చిక్కులు

మల్లారెడ్డికి మరిన్ని చిక్కులు హైదరాబాద్, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Malla Reddy పీజీ మెడికల్‌ సీట్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో సమస్య ఎదురైంది. మల్లారెడ్డి యూనివర్సిటీ స్థలంలోని ఐదెకరాలు తమకు చెందినవంటూ బాధితులు తెరపైకి వచ్చారు. స్థలాన్ని కొలిచేందుకు సర్వేయర్లు, అడ్వకేట్‌తో వచ్చిన బాధితులను స్థానికులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల వారికి కోర్టు ఆదేశాలు ఇస్తేనే స్థలాన్ని కొలవనిస్తామంటూ స్థానికులు తేల్చి చెప్పారు.దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. బహదూర్ పల్లికి చెందిన పిట్ల వీరయ్య అనే వ్యక్తికి 641, 642, 643, 644 సర్వే నెంబర్‌లలో ఏడెకరాల తొమ్మిది గుంటల స్థలం ఉండేదని బాధితులు తెలిపారు. పిట్ల వీరయ్యకు ఇద్దరు భార్యలు.. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు, రెండో భార్యకు ఓ కొడుకు ఉన్నారని చెప్పారు.…

Read More

BC Commission Chairman | ఇంటింటి సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే..! | Eeroju news

ఇంటింటి సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే..!

ఇంటింటి సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే..! బీసీ కమిషన్‌ చైర్మన్‌ హైదరాబాద్‌ BC Commission Chairman ఇంటింటి సర్వేలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారం అందించినా, ఎన్యూమరేటర్లు తప్పుడుగా నమోదు చేసినా క్రిమినల్‌ చర్యలతోపాటు, కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ హెచ్చరించారు. ఖైరతాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో  ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు. సొంత యంత్రాంగం, సిబ్బంది లేకపోవడం, బీసీ కమిషన్‌ కోరితేనే సర్వే బాధ్యతను ప్లానింగ్‌ శాఖకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పా రు. సమాచార సేకరణకు వచ్చే ఎన్యూమరేటర్లకు పౌరులు సహకరించాలని, సమస్య లు తలెత్తితే కలెక్టర్లు, బీసీ కమిషన్‌ దృష్టికి తేవాలని సూచించారు. CM Chandra babu | కేంద్రమంత్రులు… అయితే ఏంటీ.. | Eeroju news

Read More

KTR and MLA Kaushik Reddy | ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి పై పోలీసుల దాడి తీవ్రంగా ఖండించిన కేటీఆర్ | Eeroju news

ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి పై పోలీసుల దాడి తీవ్రంగా ఖండించిన కేటీఆర్

ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి పై పోలీసుల దాడి తీవ్రంగా ఖండించిన కేటీఆర్ హైదరాబాద్ KTR and MLA Kaushik Reddy హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై పోలీసులు అమానుషంగా దాడి చేయటంపై కేటీఆర్ ఆగ్రహం వ్య క్తం చేసారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా దాడికి తెగబడటమేనా ఇందిరమ్మ రాజ్యమంటే?  ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగానీ దద్దమ్మ రేవంత్ సర్కార్…అడిగిన వారిపై దాడులు చేసే సంస్కృతికి తెరలేపింది. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేస్తే…మేము వచ్చాక తప్పకుండా మిత్తితో చెల్లిస్తాం. కౌశిక్ రెడ్డి అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు…

Read More

Mega Krishna Reddy | మెగా కృష్ణారెడ్డి చుట్టూ రాజకీయం… | Eeroju news

మెగా కృష్ణారెడ్డి చుట్టూ రాజకీయం...

మెగా కృష్ణారెడ్డి చుట్టూ రాజకీయం… హైదరాబాద్, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Mega Krishna Reddy మేఘా కృష్ణారెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా  బడా కాంట్రాక్టులు ఆయన కంపెనీలే చేస్తూంటాయి. తెలంగాణలో కాళేశ్వరం అయినా.. ఏపీలో పోలవరం అయినా మేఘా ఇంజినీరింగే కాంట్రాక్టర్. ఇవి అతి భారీ ప్రాజెక్టులు. కింది స్థాయి వరకూ కొన్ని వేల కాంట్రాక్టులు ఆయన సంస్థకు దక్కి ఉంటాయి. ఇలా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల్లో తిరిగే ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ ఒలెక్ట్రాకు చెందినవి. ఇది మేఘా గ్రూప్ కంపెనీనే. ఇంకా అనేక విభాగాలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కానీ ఎవరు అధికారంలో ఉంటే వారికి ప్రతీపాత్రుడు. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారంలో ఉంది. మేఘా ఇంజినీరింగ్…

Read More