నిరుపేదలకు మంచి జరగాలన్న రాష్ట్ర అభివృద్ధి చెందాలి అన్న పవన్ కళ్యాణ్ లాంటి సమర్ధుడు అయిన వ్యక్తులు ముఖ్యమంత్రి అయితేనే జరుగుతాయని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు పవన్ రావాలి పాలన మారాలి అనే నినాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024లో ముఖ్యమంత్రి అవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పాదగయ క్షేత్రం నుండి తొలి తిరుపతి వరకు పవన్ కోసం పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు.
అక్రమ మైనింగ్ పై గప్ చిప్… ఎందుకని…
ముందుగా డాక్టర్ పిల్లా శ్రీధర్ డాక్టర్ పిల్లా దీపిక దంపతులు జనసేన కార్యకర్తలు వీర మహిళతో కలిసి పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వయంభు దత్తాత్రేయ స్వామి వారికి పురుహూతిక అమ్మవారికి కుక్కుటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించారు అనంతరం పాదగయ క్షేత్రం నుండి భారీ ర్యాలీగా డాక్టర్ పిల్లా శ్రీధర్ పవన్ కోసం పాదయాత్ర ప్రారంభించారు పిఠాపురం పట్టణం కుమారపురం.కందరాడ. F.K.పాలెం. మీదుగా విరవాడ. విరవ. తదితర గ్రామాలు మీదుగా ఈ పాదయాత్ర కొనసాగింది.
దారి పొడవునా గోవింద నామ స్మరణతో మారు మోగింది పవన్ కళ్యాణ్ జిందాబాద్ అనే నినాదాలతో పాదయాత్ర కొనసాగింది దారి పొడవునా డాక్టర్ పిల్లా శ్రీధర్ కు డాక్టర్ పిల్లా దీపికకు వీరమహిళలు. హారతులు ఇస్తూ స్వాగతాలు పలికారు ఈ పాదయాత్రలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జన సైనికులు వీర మహిళలు వేలాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జన బలంతో పాటు దైవ బలం తోడు ఉండాలని ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర .చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు..