హైదరాబాద్: ఆదాని కంపనీ ప్రజల సొమ్ము కొట్టేసింది. అది మాములు విషయం అని కేంద్రం చెప్తుంది. విదేశీ కుట్ర అంటుంది ఆర్ఎస్ఎస్. కుట్ర అయితే విచారణ జరిపించాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. కుట్ర నిజమే అయితే..అందరం కలిసి కొట్లాడదాం. జేసిపి వేయాల్సిందే. చర్చ కు సిద్ధంగా లేదు.. చర్యలకు సిద్ధంగా లేదు కేంద్రం. కుల వ్యవస్థ కి మూలం పండిట్ లు కారణం అన్నారు మోహన్ భగవత్.
పండిట్ లు కాదు..మేధావులు కారణము అని మరో మాట అంటారు. కొందరు వ్యక్తుల మీద నెట్టేసి.. కుల వ్యవస్థ ని కాపాడుకోవాలని చూస్తుంది . ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మానుకోవాలి. త్రిపురా లో బీజేపీ హింస పెంచింది. ఎన్నికలు దగ్గర పడుతుంటే దాడులు విస్తృతం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు.