అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలం పెద్దకూరపల్లి పంచాయతీ తిరుమల రెడ్డివారిపల్లి గ్రామంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో కావిల్ల పండగ నిర్వహించారు.తిరుమల రెడ్డివారిపల్లి గ్రామస్తులు ఉపవాస దీక్షతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు వస్త్రాలు ధరించి కావిల్లును పూజించి కేరళ వాయిద్యాలనడుమ హరోహర హరోహర అంటూ స్వామి వారిని స్మరిస్తూ తిరుమల రెడ్డివారిపల్లి గ్రామం నుంచి తమిళనాడులోని తిరుత్తని కి బయలుదేరి వెళ్లి అక్కడ ముడుపులు చెల్లిస్తారు.ఈ వేడుకను చూసేందుకు బంధుమిత్రులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.