A place where you need to follow for what happening in world cup

గంగులకు ప్రముఖుల పరామర్శ

0

కరీంనగర్: రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ను ప్రముఖులు పరామర్శించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గంగుల నివాసానికి వెళ్లి జరిగిన ఘటనపై సంఘీభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు ఫోన్లో పరామర్శించారు.

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మంత్రిని కలిసి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆదివారం చెర్లబూత్కూర్ లో సభావేదిక కుప్పకూలడంతో మంత్రి గంగుల సహా ఇతర నేతలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగులకు ఎడమ కాలుకు గాయం అయిన విషయం విధితమే.

Leave A Reply

Your email address will not be published.