సావిత్రి బాయి పూలే మహిళా భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని పెద్దపెల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. శనివారం మంథని పట్టణంలోని 11వ వార్డులో నిర్మిస్తున్న సావిత్రి బాయి పూలే మహిళా భవన నిర్మాణ పనులను పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ తో కలిసి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ ఈ భవన నిర్మాణానికి అదనంగా నిధులు మంజూరు చేయించామని త్వరలోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. మహిళల అభ్యున్నతి కోసం తాము పాటుపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అరేపల్లి కుమార్, కౌన్సిలర్ వీ.కే రవి,గుండా విజయ లక్ష్మి నాయకుడు పాపారావు లు పాల్గొన్నారు.