హైదరాబాద్
తాము చదువుకుంటున్న సమయంలో విద్యార్థుల పై ఇంత ఒత్తిడి ఉండేది కాదని ఇప్పుడు చదువుకునే విద్యార్థులలో ఎక్కువగా ఒత్తిడి ఉంటుందని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. కూకట్ పల్లి జోనల్ పరిధిలోని 7వ ఫేజ్ లో జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను ప్రమఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ తో కలిసి కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని చోట్లా ఈ సమ్మర్ క్యాంపులను ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లలకు ఉపయోగపడే విధంగా వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఆటలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంప్ లు వేసవి ముగిసే వరకు కొనసాగుతుందని వెల్లడించారు. పిల్లలకు ఈ ఆటలు ఇలానే కొనసాగించాలి అంటే జిహెచ్ఎంసి పరిధిలో అన్ని ఆటల విభాగాలలో మంచి కోచ్ లు సైతం అందుబాటులో ఉన్నారని వారిని మరింత నైపుణ్యంగా తీర్చిదిద్దేందుకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని కమిషనర్ అన్నారు.
Prev Post