Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రైతులకు సంకెళ్లు.. కేసీఆర్ సర్కార్ పై ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం..

0

రైతులకు సంకెళ్లు వేయడంపై ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు.  రీజనల్ రింగ్ రోడ్డు కోసం కొన్ని మాసాలుగా భూములు తీసుకుంటున్నారు. భూసేకరణ పేరుతో బలహీన వర్గాలు, హరిజన, దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారు. గవర్నమెంట్ భూములు తీసుకోకుండా.. రైతుల దగ్గర ఉన్న ఎకరం, రెండు ఎకరాల భూమిని గుంజుకుంటున్నారని అయన అన్నారు.  తాతముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి భూమి పోతోందన్న బాధతో,  భువనగిరి, రాయగిరి, ఇంకా మిగిలిన గ్రామాల రైతులు పోరాటం చేస్తున్నారు.

 

శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయినా, కొందర్ని అరెస్ట్ చేశారు. జైలుకు పంపారు.  భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.   అయితే.. కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో రాయగిరి రైతులకు బేడీలు వేశారు. ఇది చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి.  భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నా.  ఇది మంచి పద్దతి కాదు.  రైతుల కోసం అంత చేస్తా.. ఇంత చేస్తున్నా అని చెప్పుకుంటున్న కేసీఆర్ దీనిపై ఏం సమాధానం చెప్తారు.  రైతులకు సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనిఅన్నారు.

ఖమ్మం అసెంబ్లీ బరిలోకి పొంగులేటి?

దీనికి సంబంధించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలి.  ప్రభుత్వ భూమి ఉంచుకుని.. రైతుల నుంచి భూమి లాక్కోవడం కరెక్ట్ కాదు. అన్నదాతలకు సంకెళ్లు వేయడం రాష్ట్ర రైతాంగాన్ని అవమానించడమే.  అన్నం పెట్టే రైతులకే సంకెళ్లు వేయడాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా తీవ్రంగా ఖండిస్తున్నా. రాయగిరి ట్రిబుల్ ఆర్ రైతులకు సంకెళ్లు వేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie