One is the CM and the other is the Deputy CM | సూపర్ హిట్ జోడి.. | Eeroju news

సూపర్ హిట్ జోడి.....

సూపర్ హిట్ జోడి….. అమరావతి, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) One is the CM and the other is the Deputy CM ఒకరేమో సీఎం.. మరొకరేమో డిప్యూటీ సీఎం.. వారిద్దరి లక్ష్యం ప్రజాసంక్షేమ పాలన సాగించడమే. అయితే ఒకరిది సుధీర్ఘ రాజకీయ చరిత్ర.. మరొకరిది అందుకు భిన్నమైనా ఊహించని రీతిలో రాజకీయ రంగప్రవేశం చేసి, సక్సెస్ అయ్యారు. అంతవరకు ఓకే కానీ.. అనతి కాలంలోనే డిప్యూటీ సీఎంగా ప్రజల మన్ననలు పొందడమే కాక, ఏకంగా పల్లెలను అభివృద్ది బాటలో పయనింపజేసేందుకు భారీ ప్రణాళిక రూపొందించారు ఆయన. అందుకు సీఎంగా సుధీర్ఘ అనుభవం గల ఆ నేత.. తన ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు. ఇంతకు అభినందించిన సీఎం చంద్రబాబు అయితే.. అభినందనలు అందుకున్న వారు ఎవరో మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా..…

Read More

Amaravati | లడ్డూ సిట్ నియామకం ఎప్పుడో..? | Eeroju news

లడ్డూ సిట్ నియామకం ఎప్పుడో..?

లడ్డూ సిట్ నియామకం ఎప్పుడో..? అమరావతి, Amaravati తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదానికి ఉపయోగించే నెయ్యి విషయంలో జరిగిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీబీఐ, సిట్, అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అప్పటికే ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఆపేసింది. దాంతో కొత్త సిట్ ను వెంటనే నియమిస్తారని, విచారణ ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ సిట్ నియామకంపై ఇంత వరకూ అధికారిక ప్రకటన రాలేదు. సిట్ నియామకం, విచారణపై సుప్రీంకోర్టు ఎలాంటి గడువు పెట్టకపోవడంతో నింపాదిగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టుకు దసరా సెలవులు అయ్యేలోపు నియమించే అవకాశం ఉంది. సీబీఐ చీఫ్ దర్యాప్తును పర్యవేక్షిస్తారు. ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు ఏపీలోని సిట్ బృందంలో ఉన్న వారు. ఒక అధికారిని ఖరారు చేయాల్సి ఉంది. వీరిని ప్రకటిస్తే, దర్యాప్తు వేగంగా జరిగే…

Read More

AP Liquor | ఏపీలో మద్యం దుకాణాలకు విదేశాల నుంచి అప్లికేషన్స్‌.. | Eeroju news

ఏపీలో మద్యం దుకాణాలకు విదేశాల నుంచి అప్లికేషన్స్‌..

ఏపీలో మద్యం దుకాణాలకు విదేశాల నుంచి అప్లికేషన్స్‌.. అమరావతి అక్టోబర్ 14 AP Liquor ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నారు. దరఖాస్తుకు శుక్రవారం చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. శుక్రవారం ఒకే రోజు 20వేల వరకు దరఖాస్తులు రావచ్చని అంచనా. దాంతో ప్రభుత్వానికి రూ.1600కోట్లకుపైగానే ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. నిన్నటి వరకు ఎన్టీఆర్‌ జిల్లాలో 113 మద్యం దుకాణాలకు 4,839 మంది.. అల్లూరి జిల్లాలో 40 మద్యం దుకాణాలకు 869 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.అయితే, అమెరికా, యూరప్‌ నుంచి సైతం పలువురు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు…

Read More

CM Chandra babu | ఏపీలో 2027 లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం | Eeroju news

ఏపీలో 2027 లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం సీఎం చంద్రబాబు

ఏపీలో 2027 లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం సీఎం చంద్రబాబు అమరావతి, CM Chandra babu ఏపీలో నడికుడి శ్రీకాళహస్తి కోటిపల్లి నరసాపురం మధ్య రైల్వే లైన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో రూ.75 వేల కోట్ల రైల్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027లోగా బుల్లెట్ రైలుపనులు ప్రారంభం కావొచ్చు. ఐటీ లిటరసీ,డిజిటల్ హబ్ పెట్టాలని కేంద్రాన్ని కోరాం డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని కోరాం. క్లౌడ్ ఉన్న నాలెడ్జ్ ను పూర్తిగా వినియోగించుకుంటాం అని సీఎం చంద్రబాబు వివరించారు.   Chandrababu | భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news

Read More

Amaravati | అమరావతిలో కనిపించని రియల్ బూమ్ | Eeroju news

అమరావతిలో కనిపించని రియల్ బూమ్

      అమరావతిలో కనిపించని రియల్ బూమ్ విజయవాడ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Amaravati ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ రంగానికి కూటమి ప్రభుత్వంలో కూడా ఒడిదుడుకులు తప్పడం లేదు. రాజధాని నిర్మాణంపై జరిగిన రాద్ధాంతం ఏపీ రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచినా ఇంకా మార్కెట్‌పై నమ్మకం రావట్లేదు. ఎక్కడ పెట్టుబడి పెడితే ఏమవుతుందోననే ఆందోళన నిర్మాణ రంగాన్ని వేధిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌ భవన నిర్మాణ రంగం 2020 నుంచి తీవ్ర సంక్షోభాన్ని చవి చూస్తోంది. 2019లో ఇసుక తవ్వకాలపై నిషేధంతో మొదలైన ప్రతిష్టంభన మూడు రాజధానుల ప్రకటన తర్వాత నిర్మాణ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. క్రమబద్దమైన అభివృద్ధి, స్థలాల కొరత కారణంగా చిన్న పట్టణాలు మొదలుకుని, పది లక్షల్లోపు జనాభా ఉన్న పట్టణాలు, పదిలక్షల జనాభాకు పైబడిన…

Read More

AP Rains | ఈ నెల 10 నుంచి ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు | Eeroju news

ఈ నెల 10 నుంచి ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఈ నెల 10 నుంచి ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అమరావతి అక్టోబర్ 7 AP Rains ఏపీలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 10 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.ఆదివారం ఏలూరు, తూర్పుగోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, ఎన్టీఆర్, అనకాపల్లి, కర్నూలు నంద్యాల, తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజమహేంద్రవరంలో 53…

Read More

Amaravati | అమరావతికి నిధుల వరదే | Eeroju news

అమరావతికి నిధుల వరదే

అమరావతికి నిధుల వరదే విజయవాడ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Amaravati అమరావతి నిర్మాణంపై తీపికబురు అందింది. ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులకు ఊతమిచ్చేలా ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్ కన్సార్షియం నుంచి కేంద్ర ప్రభుత్వ హామీతో రుణాన్ని మంజూరు చేయడానికి సమ్మతి తెలిపాయి. గత ఐదేళ్లుగా అమరావతి పనులు నిలిచిపోవడంతో పాటు అంతకు ముందు చేపట్టిన పనులకు సంబంధించి దాదాపు రూ.9వేల కోట్ల మేర బిల్లులు బకాయి చెల్లించాల్సి ఉంది.2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారి అమరావతి పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనుల పునురుద్ధరణ ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి నిధులు గ్యారంటీగా ఇస్తామని నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. గతంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకులు అమరావతి నిర్మాణానికి రుణాలు…

Read More

Chandrababu | రథం దగ్ధం పై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు | Eeroju news

రథం దగ్ధం పై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు

రథం దగ్ధం పై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అమరావతి సెప్టెంబర్ 24 Chandrababu అనంతపురం జిల్లాలో రథం దగ్ధం పై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అర్ధరాత్రి జిల్లాలోని కనేకల్‌ మండలం హనకనహల్‌లో గుర్తుతెలియని దుండగులు ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు జిల్లాలోని అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అగంతుకులు నిప్పుపెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు వివరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడూ తనకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా పోలీసులు, అధికారులు హుటాహుటినా ఘటన స్థలానికి బయలు దేరి, గ్రామస్థులతో వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   World Bank representatives meeting with…

Read More

TTD evo Shyamala Rao | తిరుమల లడ్డూ తయారిలో కల్తీ జరిగిన మాట వాస్తవమే | Eeroju news

TTD evo Shyamala Rao

తిరుమల లడ్డూ తయారిలో కల్తీ జరిగిన మాట వాస్తవమే టీటీడీ ఈవో శ్యామలారావు   అమరావతి సెప్టెంబర్ 21 TTD evo Shyamala Rao తిరుమల లడ్డూ తయారిలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు. ల్యాబ్‌ నుంచి వచ్చిన నివేధికల ఆధారంగా కల్తీ జరిగినట్టు గుర్తించి సరఫరాదారు నుంచి నెయ్యి కొనుగోలును ఆపివేశామని పేర్కొన్నారు. శుక్రవారం టీటీడీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లడ్డూ కల్తీపై వివరాలను వెల్లడించారు. తిరుమల ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, అటువంటి చోట కల్తీ జరగడం దారుణమన్నారు. ఏపీలో అధికార మార్పిడి జరిగిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈవోగా బాధ్యతలు చేపట్టానని పేర్కొన్నారు. లడ్డూ నాణ్యత, ప్రమాణాలు తగ్గాయని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి తన దృష్టికి…

Read More

YCP | వైసీపీకి మరో షాక్ ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా | Eeroju news

YCP

వైసీపీకి మరో షాక్ ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా అమరావతి YCP వైకాపాకు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేసారు. – పార్టీకి, పదవికి రాజీనామా చేసారు. మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును కలసి రాజీనామా లేఖలు అందజేసారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన బల్లి కళ్యాణ చక్రవర్తి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన కర్రి పద్మశ్రీ ఎంపికయ్యారు.   YCP | ఏలూరు వైసీపీ ఖాళీ | Eeroju news

Read More