హస్తమా…కమలమా… వైసీపీ దారెటు… కడప, జూలై 12, (న్యూస్ పల్స్) Hastama kamalma YCP Daretu వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అధినేత జగన్ వరుస సమీక్షలు నిర్వహించి నాయకులతో మాట్లాడుతున్నారు. నియోజకవర్గాల వారీగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపం ఎక్కడ జరిగిందో ఆరా తీస్తున్నారు. 2029 నాటికి పార్టీని పూర్వ వైభవం దిశగా తీసుకెళ్తానని చెబుతున్నారు. పార్టీలో ప్రక్షాళన సైతం ప్రారంభించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఒకరిద్దరిని సస్పెండ్ కూడా చేశారు. నియోజకవర్గాల ఇన్చార్జిలను కూడా మార్చుతున్నారు. అయితే అంతవరకు ఓకే కానీ.. పార్టీలో సీనియర్లు మాత్రం మౌనం వీడడం లేదు. కొందరైతే పార్టీ కార్యక్రమాల విషయంలో అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. ముఖ్యంగా జగన్ క్యాబినెట్లో మంత్రి పదవులు అనుభవించిన వారు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తోంది.…
Read MoreTag: AP News
Some irregularities in excavations at Tirumala | తవ్వే కొద్ది అక్రమాలు… | Eeroju news
తవ్వే కొద్ది అక్రమాలు… తిరుమల, జూలై 12, (న్యూస్ పల్స్) Some irregularities in excavations at Tirumala తిరుమలలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వీఐపీలు, వివిధ దర్శనాల విషయంలో ఎన్నెన్నో అవకతవకలు బయటపడ్డాయి. ఒకేరోజు పదుల సంఖ్యలో బ్రేక్ దర్శనాలు కొనసాగాయి. మంత్రులు, ప్రజా ప్రతినిధుల వెంట పదుల సంఖ్యలో అనుచరులు బ్రేక్ దర్శనానికి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అవి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దర్శన టికెట్ల విషయంలో సైతం భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవా టిక్కెట్లు ఒకే ఫోన్ నెంబర్ తో ఎక్కువ టికెట్లు పొందారని టీటీడీ ఐటీ విభాగం సిబ్బంది పరిశీలనలో వెలుగు చూడడం గమనార్హం. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. చిత్తూరు జిల్లాకు…
Read MoreGodavari | ఆదుకున్న గోదావరి… | Eeroju news
ఆదుకున్న గోదావరి… విజయవాడ, జూలై 12, (న్యూస్ పల్స్) Godavari ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు నీటిని మంత్రులు విడుదల చేశారు. డెల్టా సాగు, తాగు అవసరాల కోసం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు. డెల్టా రెగ్యులేటర్ నుంచి గేట్లు తెరిచి 500 క్యూసెక్కులను విడుదల మంత్రి నిమ్మల విడుదల చేశారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. – జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖను 20 ఏళ్లు వెనక్కి లాగారని ఆరోపించారు. పట్టిసీమ వట్టిసీమన్న జగన్.. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్య మిచ్చారని, ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభించామన్నారు. బ్యారేజ్…
Read MoreCases Deviations | కేసులు… ఫిరాయింపులు | Eeroju news
కేసులు… ఫిరాయింపులు విజయవాడ, జూలై 12 (న్యూస్ పల్స్) Cases Deviations ఏపీలో అధికారం చేతులు మారాక… కొందరు వైసీపీ నేతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఐదేళ్లు అధికారంలో ఉండగా, చక్రం తిప్పిన నేతలు… నోటికి పని చెప్పిన నాయకులు…. ఇప్పుడు గుట్టుగా కాలం వెళ్లదీస్తున్నారు. తమ ఆచూకీ కూడా తెలియకుండా పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. అలాంటి వారిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కొడాలి నాని. పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నాని గత ఐదేళ్లలో ఎలాంటి సౌండ్ చేసే వారో అందరికీ తెలిసే ఉంటుంది. ఏది మంచో… ఏదో చెడో కూడా ఆలోచించకుండా ప్రత్యర్థులపై మాటలతో విరుచుకుపడి టీడీపీకి టార్గెట్ అయ్యారు కొడాలి నాని. అసెంబ్లీ, కేబినెట్ భేటీ, పబ్లిక్ మీటింగ్ ఇలా ఏదైనా సరే… వెనకా ముందు ఆలోచించకుండా… సీఎం చంద్రబాబుపై…
Read MoreA check to the sand mafia | ఇసుక మాఫియాకు చెక్ | Eeroju news
ఇసుక మాఫియాకు చెక్ విజయవాడ, జూలై 12, (న్యూస్ పల్స్) A check to the sand mafia ఇసుక మాఫియాకు చెక్ పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే ఇసుక మాఫియాకు కళ్లెం వేసేలా ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. ప్రజల కళ్లలో దుమ్ము కొట్టి, ఇసుకను పొలిమేర దాటించిన ఇసుకాసురుల భరతం పట్టే బ్రహ్మాస్త్రంగా కొత్త చట్టాన్ని రూపొందించారు. చంద్రబాబు 2014-2019 పాలనలో ఉచిత ఇసుక విధానం ద్వారా ఇసుక మాఫియా కోట్లు కొల్లగొట్టిందని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తూ అప్పట్లో నూతన విధానం తీసుకొచింది. నూతన ఇసుక పాలసీపై 2019 సెప్టెంబర్ 4న జగన్ ప్రభుత్వం జీవో 70, 70 జారీ చేసింది. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక విక్రయాలకు ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానాల్లో…
Read MoreImplementation of 3 schemes from August 15 | ఆగస్టు 15 నుంచి 3 పథకాలు అమలు | Eeroju news
ఆగస్టు 15 నుంచి 3 పథకాలు అమలు విజయవాడ, జూలై 12, (న్యూస్ పల్స్) Implementation of 3 schemes from August 15 పింఛన్లు పెంపు, మెగా డీఎస్సీ , ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు సహా పలు హామీలు నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం…మరో మూడు కీలక ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది. పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, హెల్త్ ఇన్స్రెన్స్ పథకాలు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే రోజు నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారుతెలుగుదేశం( ప్రభుత్వం హయాంలో అత్యంత ఆదరణ పొందిన అన్నక్యాంటీన్లు జగన్ మూతవేశారు. ఐదురూపాయలకే పేదల ఆకలి తీర్చే ఈ క్యాంటీన్లను మళ్లీ పునరుద్ధరిస్తామని…
Read MoreAmaravati | అమరావతికి షాక్… | Eeroju news
అమరావతికి షాక్… విజయవాడ, జూలై 12, (న్యూస్ పల్స్) Amaravati అమరావతికి షాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కొత్త శోభతో వెలుగొందుతోంది. కొత్తగా ఊపిరి పోసుకుంది. ఐదేళ్ల వైసిపి పాలనలో విధ్వంసమైన అమరావతి రాజధానిని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అమరావతిని పూర్వస్థితిలోకి తెచ్చి నిర్మాణాలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తోంది.అటు అమరావతిలో రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు కీలక రోడ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని శరవేగంగా జరపాలని భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అమరావతికి ఎదురు దెబ్బ తగిలింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తమ యూనిట్ ను అమరావతిలో మూసివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. 2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో అమరావతిలో కీలక సంస్థలు ఏర్పాటయ్యాయి.…
Read MoreCleansing started in Tirumala | తిరుమలలో మొదలైన ప్రక్షాళన | Eeroju news
తిరుమలలో మొదలైన ప్రక్షాళన తిరుమల, జూలై 11, (న్యూస్ పల్స్) Cleansing started in Tirumala తిరుమల.. కలియుగ వైకుంఠం. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచమంతా భక్తులున్న దివ్యక్షేత్రం. శ్రీనివాసుడు ఆపద మొక్కులవాడు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం. అందుకే ఆ కలియుగ దైవం దర్శనం కోసం .. ఎక్కడెక్కడి నుంచో సామాన్య భక్తులు వ్యవయప్రయాసలకు ఓర్చి ఏడు కొండలెక్కి వసతులున్నా లేకున్నా రోడ్లపై పడిగాపులు కాస్తారు. కంపార్ట్మెంట్లలో గంటలకు గంటలు ఎదురు చూస్తారు. కిక్కిరిసిన క్యూలైన్లలో తోసుకుంటూ.. ఆనందనిలయం ముందు దివ్యదర్శనానికి అడుగుపెడతారు. అరసెకనులో గర్భగుడి బయట క్యూలైన్లలో ఉన్న సామాన్య భక్తులను సిబ్బంది లాగి అవతల పడేస్తుంటే.. అరసెకను ఆ వేంకటేశ్వరుడి దివ్య దర్శనం చేసుకుని అరమోడ్పు కన్నులతో ఆలయం బయటకు చేరతారు. ఇది తిరుమల క్షేత్ర దర్శనం అనగానే మనకు గుర్తుకొచ్చేవి.తిరుపతిలో అడుగు…
Read MoreGottipati on the ZP pedestal | జెడ్పీ పీఠంపై గొట్టిపాటి గురి | Eeroju news
జెడ్పీ పీఠంపై గొట్టిపాటి గురి ఒంగోలు, జూలై 11, (న్యూస్ పల్స్) Gottipati on the ZP pedestal ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు మంచి జోరుమీద కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీడీపీ… జిల్లా పరిషత్లోనూ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తోంది. జిల్లాలో 56 మండలాలు ఉంటే.. వైసీపీకి 55 మంది జడ్పీటీసీలు ఉన్నారు. మిగిలిన ఒక్కస్థానంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది. అసలు ఒక్క సభ్యుడూ లేని జడ్పీని టీడీపీ కైవసం చేసుకుందామని ప్లాన్ చేయడమే రాజకీయంగా ఇంట్రస్టింగ్గా మారింది. ఒక్కరూ లేనిచోట టీడీపీ జెండా ఎలా ఎగురుతుందనేది ఉత్కంఠకు కారణమవుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ప్రస్తుతం బూచేపల్లి వెంకాయమ్మ వ్యవహరిస్తున్నారు. ఈమె దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తల్లి. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు సన్నిహితుడైన…
Read MoreJagan’s resignation as a hot topic | హాట్ టాపిక్ గా జగన్ రాజీనామా | Eeroju news
హాట్ టాపిక్ గా జగన్ రాజీనామా కడప, జూలై 11, (న్యూస్ పల్స్) Jagan’s resignation as a hot topic మాజీ సీఎం జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. YCP మౌనం అంగీకారమా? లేక ఎప్పట్లాగే ఉదాసీనతా ? అనేది అర్థం కావడం లేదనే చర్చ సాగుతోంది. ఇంతకీ.. జగన్ రిజైన్ చేయటం ఏమిటి? అసలు.. ఆ వార్తలెలా వస్తున్నాయిఏపీలో జగన్ రాజీనామా అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం అయిన వైసీపీ అధినేత.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు లేఖ రాశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ పార్టీకి ప్రతిపక్ష…
Read More