జగన్ వ్యూహాత్మక తప్పిదం… విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Jagan and Sharmila ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ అంశంలో స్పేస్ లేకపోయినా టీడీపీని తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నించింది. అయితే ప్రధానంగా తమ ఎటాక్ మాత్రం జగన్ సోదరి షర్మిపైనే గురి పెట్టారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. షర్మిల కూడా వాటికి కౌంటర్ ఇచ్చారు. కానీ ఈ మొత్తం అంశంలో వైఎస్ఆర్సీపీ చివరికి వెనక్కి తగ్గింది. ఇక ఎవరూ మాట్లాడవద్దని తమ పార్టీ నేతలకు సందేశం పంపింది. ఆస్తుల విషయం కోర్టులో ఉంది కాబట్టి అక్కడే వాదనలు వినిపించుకుందామని చెప్పింది. కానీ ఇప్పటి వరకూ జరిగిన రాజకీయంలో జరిగిన డ్యామేజ్ను మాత్రం కవర్ చేసుకోవడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం ఉందని…
Read MoreTag: AP News
Drone services | ఎయిమ్స్ లో డ్రోన్ సేవలు | Eeroju news
ఎయిమ్స్ లో డ్రోన్ సేవలు విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Drone services టెక్నాలజీ రోజురోజుకు ఓ రేంజ్లో అప్డేట్ అవుతుంది. సాంకేతికత కొత్త రూపు సంతరించుకుంటుంది. తాజాగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రేంజ్ అప్గ్రేడేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక టెక్నాలజీని హెల్త్ సెక్టార్లో కూడా మిక్స్ చేసి.. అద్భుతాలు చేయాలని కేంద్రం ప్రణాళికలు పెట్టుుకుని ముందుకు వెళ్తుంది. మంగళగిరి ఎయిమ్స్లో డ్రోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్లో డ్రోన్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఎయిమ్స్ వైద్యులు ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష నిర్వహించారు. దానిలో భాగంగా.. ఎయిమ్స్ నుంచి నూతక్కి పీహెచ్సీ వరకూ డ్రోన్ను ప్రయోగించారు. ఓ మహిళా రోగి నుంచి బ్లెడ్ శాంపిల్ సేకరించిన డ్రోన్.. అక్కడి నుంచి ఎయిమ్స్కు తిరిగొచ్చింది. మంగళగిరి ఎయిమ్స్ నుంచి…
Read MoreMahidhar Reddy | మహీధరరెడ్డికి బుజ్జగింపులు… తలొగ్గేనా | Eeroju news
మహీధరరెడ్డికి బుజ్జగింపులు… తలొగ్గేనా ఒంగోలు, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Mahidhar Reddy ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో సీనియర్ నేతగా వున్న మాజీ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి పార్టీ మారబోతున్నాడనే టాక్ జోరుగా నడుస్తోంది. నాలుగు సార్లు కందుకూరు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన మహిధర్ రెడ్డి మొన్నటి ఎన్నికల ముందు నుంచే వైసీపీకి దూరంగా వుంటూ వస్తున్నారు. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలో ముందు నుంచి మానుగుంట, దివి కుటుంబాల మధ్య రాజకీయాలు నడుస్తుండేవి. ఆ రెండు కుటుంబాల్లో ఏదో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యవారు.ఆరు దశాబ్దాల నుంచి కందుకూరు నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తుంది మానుగుంట కుటుంబం. మహిధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో…
Read MoreDharmana Prasada Rao | పక్క చూపులు చూస్తున్న ధర్మాన | Eeroju news
పక్క చూపులు చూస్తున్న ధర్మాన శ్రీకాకుళం, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Dharmana Prasada Rao రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ ఆయన. వైసీపీకి చెందిన ఆ నేత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారతారని, రాజకీయ సన్యాసం తీసుకున్నారని ఆయన మౌనంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ధర్మాన ప్రసాదరావు అంటే తెలుగు రాస్ట్రాలలో తెలియనివారు ఉండరు. మంచి వాక్చాతుర్యంతో పాటు రాజకీయ వ్యూాహరచనలో ఆయనది అందెవేసిన చేయి. ఇంతటి గొప్ప నేత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంటున్నారు. చివరకు తాను ఎంతగానో ఇష్టపడే దివంగత నేత Y.S. రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. దాంతో ఆ సీనియర్ ఆలోచన ఏంటి అన్నది…
Read More‘Deepavali’ village | ‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా? | Eeroju news
‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా? ‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా? ‘Deepavali’ village చాలా మందికి ‘దీపావళి’ అంటే పండుగని మాత్రమే తెలుసు. కానీ ‘దీపావళి’ అనే పేరు మీద గ్రామం ఉందని ఎవరికీ తెలిసి ఉండదు. అవును ఇది నిజం. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దీపావళి గ్రామం ఉంది. అయితే ఈ గ్రామానికి ఆ పేరు రావడానికి పెద్ద చరిత్రే ఉంది. సిక్కోలును పాలించే రాజు మరో ప్రాంతానికి వెళ్తూ ఈ గ్రామంలో స్పృహ కోల్పోయి పడిపోవడంతో అక్కడి ప్రజలు అతడిని దీపాల వెలుగులో సేవ చేశారు. కోలుకున్న తర్వాత రాజు ఈ గ్రామానికి ‘దీపావళి’ అని పేరు పెట్టినట్లు సమాచారం. NKR21 | నందమూరి కళ్యాణ్ రామ్ #NKR21 న్యూ 15 డేస్ వైజాగ్ షెడ్యూల్ ప్రారంభం…
Read MoreKapil Dev Chandrababu | సీఎం చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ | Eeroju news
సీఎం చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ విజయవాడ, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Kapil Dev Chandrababu ఏపీలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటు అవుతుందా? ఇప్పటికే ఒకటి విశాఖలో ఉంది. మరొకటి అమరావతిలో ప్లాన్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్దేవ్ భేటీకి కారణమేంటి? గతంలో తెచ్చిన ప్రొగ్రాంను తెరపైకి తెస్తున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది. అమరావతిలో సీఎం చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్దేవ్ సమావేశమయ్యారు. గతరాత్రి విజయవాడకు చేరుకున్న ఆయన, మంగళవారం సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖలోని ముడసర్లోవ ప్రాంతంలో గోల్ప్ కోర్టు ఉంది. అలాంటిది అమరావతిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2014-19 మధ్య కాలంలో గ్రామీణ క్రీడాకారులకు అంతర్జాతీయ…
Read MoreVasireddy Padma | ప్రకాశం నుంచి మరో నేతకు గ్రీన్ సిగ్నల్ | Eeroju news
ప్రకాశం నుంచి మరో నేతకు గ్రీన్ సిగ్నల్ ఒంగోలు, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Vasireddy Padma ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు వైఎస్సార్ కుటుంబ ఆస్తి వివాదం నడుస్తుండగా.. మరోవైపు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పార్టీని వీడుతున్నారు ఏపీలో వైసీపీ నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇందులో జగన్ కు అత్యంత సన్నిహితులు ఉండడం విశేషం. ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీలో ఉండలేక చాలామంది బయటకు వెళ్తున్నారు. కొందరు టిడిపిలో చేరడానికి ప్రయత్నిస్తుండగా.. మరికొందరు జనసేన బాట పడుతున్నారు. అయితే పదవులు ఉన్నవారు సైతం వదులుకొని మరి క్యూ కడుతుండడం విశేషం. రాజ్యసభ సభ్యులు ముగ్గురితో పాటు మరో నలుగురు ఎమ్మెల్సీలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. పదవులు వదులుకున్నారు. మూడు రోజుల కిందట మహిళా కమిషన్ మాజీ…
Read MoreYS Sharmila | ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న షర్మిళ | Eeroju news
ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న షర్మిళ విజయవాడ, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) YS Sharmila జగన్ ను ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేస్తోన్న షర్మిల..వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల రగడ కొనసాగుతూనే ఉంది. అదో సీరియల్ ఎపిసోడ్ ను తలపిస్తోంది. ఈరోజు మరో బాంబు వేశారు వైయస్ షర్మిల. వైయస్ షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. జగన్ తో పాటు వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు.వైయస్ కుటుంబ ఆస్తి వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై షర్మిల ఒంటరి పోరాటం చేస్తుండగా..వైసీపీ నుంచి మాత్రం నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. అయినా సరే షర్మిల ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.తనకు జగన్ అన్యాయం చేశారని..వైసిపి నేతలు ఎందుకు తెలుసుకోవడం లేదని..తనపై ఎందుకు పడ్డారని ఆమె ప్రశ్నిస్తున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆమె బాబాయి వైవి…
Read MorePawan kalyan | సరస్వతి పవర్ అనుమతులపై ఆరా | Eeroju news
సరస్వతి పవర్ అనుమతులపై ఆరా అమరావతి, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Pawan kalyan ఇంటి గుట్టు లంకకు చేటని పెద్దలు చెబుతారు. కొన్ని విషయాల్లో గుట్టుగా ఉండాలన్నది దానర్థం. ప్రస్తుతం మాజీ సీఎం జగన్కి చెందిన సరస్వతీ పవర్ కంపెనీ విషయంలో ఏం జరిగింది.. జరగబోతోంది?గతంలో సరస్వతి పవర్ కంపెనీకి కేటాయింపులపై ప్రభుత్వం వివరాలు సేకరిస్తోందా? కేటాయింపులు రద్దు చేస్తుందా? లేక సీఐడీ విచారణకు ఆదేశిస్తుందా? జగన్-షర్మిల వివాదంలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయా? అవుననే సమాధానం వస్తోంది.జగన్-షర్మిల వివాదం నేపథ్యంలో సరస్వతి పవర్ కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తోంది ప్రభుత్వం. వీటిని కేటాయించిన భూములు రద్దు చేయాలని రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. రాజకీయ నేతలు సీఐడీ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లగా పోరాటం చేస్తున్నారు గురజాల టీడీపీ ఎమ్మెల్యే…
Read MoreAP High Court | హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం | Eeroju news
హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం అమరావతి,28 AP High Court ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.ఈమేరకు సోమవారం హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో మహేశ్వరరావు కుంచెం (అలియాస్ కుంచం),తూటా చంద్ర ధన శేఖర్ (అలియాస్ టిసిడి శేఖర్),చల్లా గుణరంజన్ లచే అదనపు న్యాయమూర్తులుగా చీఫ్ జస్టిస్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. హైకోర్టులో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈఅదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోని పలువురు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్,ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి,హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం,డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి.పొన్నారావు, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ డా.వై.లక్ష్మణరావు,పలువులు రిజిష్ట్రార్లు,బార్…
Read More