చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ తిరుపతి, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Chandrababu VS Kiran Kumar ఒకరేమో ప్రస్తుత సీఎం.. మరొకరు మాజీ సీఎం.. వీరిద్దరూ కలిశారు.. మాట్లాడుకున్నారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకు ఏమి మాట్లాడుకున్నారు.. ఏ విషయంపై చర్చించారన్నది మాత్రం బయటకు రాని పరిస్థితి. వీరి కలయిక వెనుక ఏదైనా అంతరార్థం ఉందా అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నేతలు బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బాబు భేటీ కానున్నారు. ఈ సంధర్భంగా రాజకీయ పరమైన అంశాలపై చర్చ సాగనుండగా.. రాష్ట్రానికి సంబంధించిన…
Read MoreTag: AP News
Changes in inter education | ఇంటర్ విద్యలో మార్పులు | Eeroju news
ఇంటర్ విద్యలో మార్పులు విజయవాడ, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Changes in inter education ఏపీ ఇంటర్ విద్యలో మార్పులకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సంస్కరణలను తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవలే విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూడా ఇదే విషయం చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అడుగులు పడే అవకాశం ఉంది.ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త నిర్ణయాలను అమలు చేయాలని భావిస్తోంది. పరీక్షల విధానంతో పాటు సిలబస్ ను కూడా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను కూడా తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇటీవలే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.…
Read MoreTomato Price | రూ.80కి చేరిన టమాటా | Eeroju news
రూ.80కి చేరిన టమాటా రాజమండ్రి, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Tomato Price టమాటా ధరలు ఒక్కసారిగా సెంచరీ కొట్టేస్తోంది. ఎక్కడ చూసీన 80 రూపాయ కంటే తక్కువకు కిలో టమాటా దొరకడం లేదు. నిన్న మొన్నటి వరకు 50రూపాయల్లోపు ధర పలికే టమాటా ఇప్పుడు ఒక్కసారిగా డబుల్ అయిపోయింది. కొనేందుకు వెళ్తున్న వినియోగదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఉన్న వాటినోత సరిపెట్టుకుంటున్నారు. అసలే పండగ సీజన్ ఆపై ధర పెరిగిపోవడంతో ఏం తినాలని వాపోతున్నారు. టమాటా లేనిదే దాదాపు ఎవరింట్లో కూడా వంట పూర్తి కాదు. వెజ్ ఆర్ నాన్వెజ్ ఏం వండినా టమాటా ఉంటే ఆ వంటకానికి అదనపు రుచి వస్తుంది. కుటుంబానికి సరిపడేలా వంటకం పూర్తి అవుతుంది.ఇప్పుడు టమాటో వందకు చేరుకోవడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. కొందరు చింతపండును వినియోగిస్తుంటే మరికొందరు నిమ్మకాయలతో సరిపెట్టుకుంటున్నారు.…
Read MoreDevaragattu | దేవరగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం | Eeroju news
దేవరగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం కర్నూలు, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Devaragattu దసరా పండుగ సందర్భంగా దేవరగట్టు కర్రల సంబరానికి భక్తులు సిద్ధమవుతున్నారు. ఆలూరు నియోజకవర్గం లోని దేవరగట్టులో ప్రత్యేక విజయదశమి పండుగ రోజు మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా జరిగే సంప్రదాయ సమరమే కర్రల సమరం. దీనినే స్థానికంగా బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవానికి ఆంధ్రతో పాటు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లడంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి జరుపుకునే ఉత్సవమే సమరమే కర్రల సమరం బన్నీ ఉత్సవం గా పిలుస్తారు. ఈ కర్రల సంబరానికి కొంతమంది మద్యం సేవించి వస్తుండటంతో కర్రలు తిప్ప లేక,.. కర్రల చివర్లో ఉండే ఇనుప…
Read MoreCM Chandrababu Naidu | అభిమాని చిరకాల కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు నాయుడు | Eeroju news
అభిమాని చిరకాల కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి, CM Chandrababu Naidu శనివారం ఉదయం తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం నందు తనను ప్రాణంగా అభిమానించే అభిమానిని కలిసి అతని చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ తానున్నానని భరోసా కల్పిస్తూ అతని ఆరోగ్యం మెరుగుదలకు ఐదు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సాయం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అందచేసి మరో మారు మానవత్వం చాటుకున్నారు. తమ నాయకుడితో ఫోటో దిగాలని ఎప్పటి నుండో అనుకుంటున్న ఓ అభిమాని కోరికను తీర్చారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు. వివరాల్లోకి వెళితే… రేణిగుంట కు చెందిన పసుపులేటి సురేంద్రబాబు(30) మానసిక దివ్యాంగుడిగా జన్మించారు. దీనికి…
Read MoreJethwani | సీఐడీకి జెత్వానీ కేసు | Eeroju news
సీఐడీకి జెత్వానీ కేసు విజయవాడ, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Jethwani ఏపీలో వివాదంగా మారిన ఓ హీరోయిన్ కేసు ఇప్పుడు చేతికి వెళ్లబోతుందట. ఇప్పటికే బెయిల్ కోసం ఫైట్ చేస్తున్న ఆ ఆఫీసర్లకు..సీఐడీ గుబులు వెంటాడుతోందట. ఆ నటి కేసులో కొత్త కొత్త ట్విస్ట్లు ఉంటాయా.? ఇంకొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ మెడకు చుట్టుకోబోతోందా.? పవర్లో ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది. అనుకున్నోడి మీద కేసు పెట్టొచ్చు. తప్పు చేయనోన్ని కూడా ఇరకాటంలో పడేయొచ్చు. పర్మిషన్లు, చట్టాలు ఇవేవి అడ్డురావు. అందుకే అధికారం ఇచ్చే కిక్కే వేరు. అలాగని సమయం కలసి రాకపోతే అరాచకానికి మూల్యం చెల్లించుకోక కూడా తప్పదు. పవర్ చేతిలో ఉన్నప్పుడు ఏది పడితే అది చేశారు. ప్రభుత్వం మారింది. పాపాల చిట్ట బయటపడుతుంది. ఒకటా రెండా..స్యాండ్, మైన్, వైన్..చెప్పుకుంటూ పోతే పెద్ద కథే…
Read MoreAndhra Pradesh Deputy CM Pawan Kalyan | జనసేన విస్తరణ దిశగా పవన్ | Eeroju news
జనసేన విస్తరణ దిశగా పవన్ విజయవాడ, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Andhra Pradesh Deputy CM Pawan Kalyan రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఏదో సినిమాలో చెప్పినట్టు ” లైట్ ఎక్కడో ఉంటుంది.. దాని స్విచ్చు ఇంకెక్కడో ఉంటుంది”. నాయకుల స్పీచ్ గమనిస్తే యథాలాపంగా మాట్లాడిన మాటల వెనుక చాలా పెద్ద వ్యూహమే కనపడుతుంది. దానికి పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రసంగం బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడో ఆవు నెయ్యి కల్తీ దగ్గర మొదలైన రచ్చ పవన్ సనాతన ధర్మం కోసం తమిళంలో నిప్పులు చెరిగిన వరకు చేరుకుంది. సనాతన ధర్మ బోర్ట్ అనీ ధర్మ పరిరక్షణ అనీ పవన్ చాలా అంశాల మీదే మాట్లాడినా అసలు టార్గెట్ మాత్రం తమిళ రాజకీయ చిత్రమే అని అర్థమయిపోతుంది అంటున్నారు విశ్లేషకులు. పవన్ కల్యాణ్ ఎంత…
Read MoreChandrababu | భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news
భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు విజయవాడ, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Chandrababu కేంద్రంలో ఈసారి చంద్రబాబు పాత్ర పెరిగింది.గత ఐదేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో అధికారానికి దూరం కాగా..కేంద్రంలో కూడా పరపతి తగ్గింది. అటు బిజెపి అగ్రనేతలు పట్టించుకోలేదు. వారిని కాదని ఇతర జాతీయ పార్టీలతో సంబంధాలు ఏర్పరచుకోలేదు చంద్రబాబు. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా చంద్రబాబు ఇమేజ్ పెరిగింది. రాష్ట్రంలో ఒంటరిగానే టిడిపి 134 అసెంబ్లీ స్థానాలను సాధించింది. కూటమిపరంగా 164 సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సొంతంగా 16 ఎంపీ సీట్లలో గెలిచింది. కూటమిపరంగా 21 సీట్లతో సత్తా చాటింది. అయితే గత రెండుసార్లు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ సొంతంగానే అధికారంలోకి రాగలిగింది. కానీ ఈసారి మెజారిటీకి అల్లంతా దూరంలో నిలిచిపోయింది బిజెపి…
Read MoreTirupati Laddu | తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీం కోర్టు తాజా దర్యాప్తు | Eeroju news
తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీం కోర్టు తాజా దర్యాప్తు ఐదుగురు సభ్యులతో ‘సిట్’ ఏర్పాటు న్యూఢిల్లీ అక్టోబర్ Tirupati Laddu తిరుపతి లడ్డు వివాదంపై తాజా దర్యాప్తుకు సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్యవులు జారీ చేసింది. అంతేకాక ఐదుగురు సభ్యులతో కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ‘సిట్’లో సిబిఐ, ఆంధ్ర పోలీస్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఉంటారు.సిట్ విచారణను సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయస్థానాన్ని “రాజకీయ యుద్దభూమి”గా ఉపయోగించుకోడానికి అనుమతించబోమని న్యాయమూర్తులు బిఆర్.గవాయ్ , కెవి. విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ల బ్యాచ్పై ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయోగశాల పరీక్ష నివేదిక “అస్సలు స్పష్టంగా లేదు” అని సుప్రీం కోర్టు…
Read MoreGudivada MLA Venigandla Ramu | ప్రజా సమస్యల పరిష్కారానికై….ఇప్పటికి 9సార్లు సీఎం చంద్రబాబును కలిశాను | Eeroju news
గుడివాడ అభివృద్ధి….ప్రజా సమస్యల పరిష్కారానికై….ఇప్పటికి 9సార్లు సీఎం చంద్రబాబును కలిశాను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ Gudivada MLA Venigandla Ramu రాబోవు ఐదేళ్లలో గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తూ…. రోడ్లు, డ్రైనేజీ వసతులను పూర్తిస్థాయిలో కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే రాముకు…. టిడిపి శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సెంటర్లో టిడిపి జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే రాము ప్రజా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ప్రజలతో స్వయంగా మాట్లాడుతూ…. వారి వద్ద నుండి వినతుల అర్జీలను స్వీకరించారు. ప్రజా వేదికలో పాల్గొన్న అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే…
Read More