Tirupati Laddu | తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా | Eeroju news

Tirupati Laddu

తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా తిరుమల, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Tirupati Laddu తిరుమల శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. ప్రస్తుతం అన్ని మీడియా సంస్థల్లో చర్చ నడుస్తోంది. కొంతమంది చంద్రబాబు వ్యాఖ్యలపై ఆరోపణలు చేస్తుండగా.. మరోవైపు వైసీపీ హయాంలో జరిగింది వాస్తవమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ తరుణంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 50 ఏళ్తుగా తిరుమల లడ్డూలో ఉపయోగించే కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని జగన్ రెడ్డి ఎందుకు ఉన్నట్లు ఉండి తొలగించాడో ఇప్పుడు అర్ధమైందా ? అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ తయారీకి 50 ఏళ్లుగా సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని కాదని, తమిళనాడు కంపెనీకి ఎందుకు ఇచ్చాడో, ఇప్పుడు ప్రజలకు…

Read More

Kethireddy | జనసేన గూటికి కేతిరెడ్డి, విడుదల | Eeroju news

Kethireddy

జనసేన గూటికి కేతిరెడ్డి, విడుదల విజయవాడ, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Kethireddy ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటపడేందుకు లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను ఇప్పటికే పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. ఉదయభాను ఎన్నికలకు ముందే పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది కానీ ఎక్కడా సీటు లభించే అవకాశం లేకపోవడంతో వైసీపీలోనే కొనసాగారు. జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. వైసీపీ నేతల నుంచి జనసేన పార్టీకి చాలా ఎంక్వయిరీలు వస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు…

Read More

YS Jaganmohan Reddy | దూరమవుతున్న పార్టీ పిల్లర్లు… | Eeroju news

YS Jaganmohan Reddy

దూరమవుతున్న పార్టీ పిల్లర్లు… విజయవాడ, సెప్టెంబర 19, (న్యూస్ పల్స్) YS Jaganmohan Reddy వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి కలిసి నడుస్తున్న నేతలు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి దూరమయ్యారు. ఆయన పార్టీ పరిస్థితిపై సంచలన ఆరోపణలు చేయబోతున్నారు. జగన్ కోసం మొదట్లో రాజీనామా చేసిన నేత మాత్రమే కాదు.. జగన్ సమీప బంధువు కూడా. అయనను కూడా జగన్ తో పాటు కలిసి నడిచేలా ఉంచుకోలేకపోతున్నారు. ఒక్క దారుణ పరాజయం తర్వాత వైసీపీ ఫేట్ ఒక్క సారిగా మారిపోయింది. అతి భారీ మెజార్టీలతో ఓడిపోవడంతో భవిష్యత్ ఉంటుందా లేదా అన్న గందరగోళంతో పాటు జగన్ వ్యవహారశైలి వల్ల ఇబ్బంది పడిన వారంతా.. మెల్లగా వేరే దారి చూసుకుంటున్నారు. నిజానికి ఇంకా ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ వంటి కార్యక్రమాలు…

Read More

Special focus on BC | బీసీలపై స్పెషల్ ఫోకస్ | Eeroju news

Special focus on BC

బీసీలపై స్పెషల్ ఫోకస్ విజయవాడ, సెప్టెంబర్ 19, (న్యూస్ పల్స్) Special focus on BC ఏపీలో కూటమి ప్రభుత్వం బీసీలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు కులాలవారీగా కార్పొరేషన్లు పెట్టి ఆకట్టుకుంది. ఆ కార్పొరేషన్ల వల్ల అట్టడుగు వర్గాలకు లాభం జరిగిందా, కేవలం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ మెంబర్లు లబ్ధిపొందారా అనే విషయం పక్కనపెడితే తాజాగా కూటమి ప్రభుత్వం బీసీలకు నిజమైన ప్రోత్సాహం అందిస్తామంటూ ముందుకొస్తోంది. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా మరో అడుగు ముందుకేస్తామంటోంది. ఈమేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామంటోంది ప్రభుత్వం. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సంబంధించిన ఫైల్ పై ఈరోజు మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తారు. రాబోయే…

Read More

Balineni | పార్టీ నుంచి సపోర్ట్ లేదన్న ఫీలింగ్ బాలినేని షాక్… | Eeroju news

పార్టీ నుంచి సపోర్ట్ లేదన్న ఫీలింగ్

పార్టీ నుంచి సపోర్ట్ లేదన్న ఫీలింగ్ బాలినేని షాక్… ఒంగోలు, సెప్టెంబర్ 19, (న్యూస్ పల్స్) Balineni మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. కొంత‌కాలంగా బాలినేని పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఆయన ఉక్కపోతకు గురవుతున్నారు. తనకు ఏ మాత్రం గౌరవం లభించడం లేదని ఆయన కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింద. అయితే చివరి క్షణంలో జగన్ బుజ్జగించడంతో ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. అయితే ఆయన ఘోరపరాజయం పాలయ్యారు. ఆ తర్వాత తాను ఈవీఎంల వల్లే ఓడిపోయానని పోరాటం చేశారు. ఈవీఎంల చెకింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోర్టుల్లోనూ కేసులు వేశారు. అయితే పార్టీ నుంచి కనీసం సపోర్టు లేదని.. జగన్ పట్టించుకోవడం లేదని అసంతృప్తి…

Read More

Vizianagaram | 20 నుంచి పైడితల్లి ఉత్సవాలు | Eeroju news

pydithalli jatara

20 నుంచి పైడితల్లి ఉత్సవాలు విజయనగరం, సెప్టెంబర్ 19, న్యూస్ పల్స్) Vizianagaram ఉత్తరాంధ్ర ఇల‌వేల్పు, విజ‌యన‌గ‌రం ప్రజ‌ల ఆరాధ్య దేవ‌త శ్రీ పైడిత‌ల్లి అమ్మవారి జాత‌ర మ‌హోత్సవం సెప్టెంబ‌ర్ 20 నుంచి అక్టోబ‌ర్ 30 వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 30న ఉద‌యం 8 గంట‌ల నుంచి దీక్షల విర‌మ‌ణ ఉంటుంది. దేవ‌స్థానం ఛైర్మన్‌, ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు, భ‌క్తుల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్ర పండగ‌గా ప్రక‌టించినందున అమ్మవారికి టీటీడీ, ప్రభుత్వం ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తాయి. సెప్టెంబ‌ర్ 20న ఉద‌యం 8 గంట‌ల‌కు చ‌దురుగుడి వ‌ద్ద పందిరి రాట‌, మండ‌ల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌నం గుడి వ‌ద్ద ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అక్టోబ‌ర్ 10న అర్ధమండ‌ల దీక్షలు ప్రారంభం అవుతాయి. అక్టోబ‌ర్ 14న తొలేళ్ల ఉత్సవం, అక్టోబ‌ర్…

Read More

‘సిక్కోలులో బాబాయ్, అబ్బాయ్ మార్క్ | Eeroju news

'సిక్కోలులో బాబాయ్, అబ్బాయ్ మార్క్

‘సిక్కోలులో బాబాయ్, అబ్బాయ్ మార్క్ శ్రీకాకుళం, సెప్టెంబర్ 19, (న్యూస్ పల్స్) బాబాయ్ అబ్బాయిలపై సిక్కోలు జిల్లా అభివృద్ధి మంత్రం ఆధారపడి ఉంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు పదవులు వచ్చాయని అంతా అన్నారు. జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ప్రజలు భావిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గత పదేళ్లుగా శ్రీకాకుళం ఎంపీగానే ఉన్నారు. ఆయన పార్లమెంటులో వివిధ సమస్యలపై గళం విప్పడంతో ప్రధాన మంత్రి మోదీ దృష్టిలో పడ్డారు. అంతేకాకుండా సీనియర్ కేంద్ర మంత్రులతో కూడా ఆయనకున్న సత్ససంబంధాలే ఇప్పుడు సిక్కోలు జిల్లా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడనుంది. ప్రధానంగా జిల్లాలోని ఆముదాలవలస, పలాస, రైల్వే స్టేషన్లు అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిందిశ్రీకాకుళం రోడ్ మీదుగా నడిచే వివిధ రైళ్లుకూడ అక్కడ స్టేషన్ లో నిలిచేందుకు కృషి చేశారు. కేవలం శ్రీకాకుళం జిల్లాపైన…

Read More

Coverts | కోవర్టులు పై వేటు తప్పదా… | Eeroju news

Coverts

కోవర్టులు పై వేటు తప్పదా… విజయవాడ, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Coverts ఎన్నికల్లో టిడిపి సూపర్ విక్టరీ సాధించింది. సొంతంగానే 135 స్థానాల్లో విజయం సాధించింది. కూ టమిపరంగా 164 సీట్లను కైవసం చేసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు అవుతుంది.ఈనెల 20వ తేదీతో వందరోజుల పాలన పూర్తవుతుంది. దీంతో మూడు పార్టీలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నాయి. అయితే ఇదే క్రమంలో చంద్రబాబు కొన్ని రకాల లోపాలను సరి చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరును మదించనున్నారు. కొందరు వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నివేదికలు వచ్చాయి. వాటి ప్రకారం దిద్దుబాటు చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో కొందరు ఎమ్మెల్యేలకు భారీ షాక్ తగలనున్నట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా,ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా…

Read More

Steel Plant | తెరమీదకు స్టీల్ ప్లాంట్ పంచాయితీ | Eeroju news

Steel Plant

తెరమీదకు స్టీల్ ప్లాంట్ పంచాయితీ విశాఖపట్టణం, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Steel Plant ఏపీలో మరోసారి స్టీల్‌ ప్లాంట్‌పై రచ్చ మొదలైంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వరకు నిజముందో కాని.. వైసీపీ ఇప్పుడు దాన్నే అస్త్రంగా మార్చుకుని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. దానికి కూటమి నేతలు గట్టిగానే కౌంటర్లిస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి తీరప్రాంత ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలో ఏర్పాటైంది. వైజాగ్‌లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకూడదని 1966లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలుగు ప్రజల్లో తీవ్ర వ్యతిరేతకు కారణమైంది. విశాఖ ఉక్క, ఆంధ్రుల…

Read More

Pawan Kalyan | పవన్ పై ఫ్యాన్స్ పార్టీ సాఫ్ట్ కార్నర్ | Eeroju news

Pawan Kalyan

పవన్ పై ఫ్యాన్స్ పార్టీ సాఫ్ట్ కార్నర్ కాకినాడ, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Pawan Kalyan అధికారంలో ఉండగా తమకు ఎదురేలేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో వివిధ అంశాలపై ఆ పార్టీ స్పందిస్తున్న తీరు చూస్తే… కొన్ని విషయాల్లో వైసీపీ వైఖరి మారినట్లే కనిపిస్తోందంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్న వైసీపీ… కూటమి ప్రభుత్వంలో కీలక నేత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాన్‌పై మెతక వైఖరి అవలంభిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. పిఠాపురంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్…. స్థానిక ఎమ్మెల్యే పవన్‌ ఒక్కమాట కూడా అనకపోవడం వైసీపీ వైఖరిలో వచ్చిన మార్పును సూచిస్తోందంటున్నారు. పిఠాపురం పర్యటనలో పాపం పవన్‌ సినిమాల్లో నటిస్తే… సీఎం చంద్రబాబు రాజకీయాల్లో నటిస్తున్నారని విమర్శించారు. గతంలో…

Read More