జనవరి నుంచి తల్లి వందనం నెల్లూరు, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Thalli Vandanam ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులు క్రమంగా కొలిక్కి వస్తున్న వేళ ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా ఇప్పటికే డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. సామాజిక పింఛన్లు కూడా వెయ్యి రూపాయలు పెంచి అందిస్తోంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రజలకు అందించేందుకు రెడీ అవుతోంది. సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో కీలకమైన హామీ తల్లికి వందనం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని అమ్మ ఒడి పేరుతో అందించింది. దానికి కూటమి ప్రభుత్వం పేరు మార్చి తల్లికి వందనం పేరుతో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏడాదికి 15 వేల రూపాయలు వేయనున్నారు.…
Read MoreTag: Chandrababu Naidu
AP Pensions | ఏపీలో కొత్త పింఛన్లు… మార్గదర్శకాలు సిద్ధం! | Eeroju news
ఏపీలో కొత్త పింఛన్లు… మార్గదర్శకాలు సిద్ధం! తిరుమల, అక్టోబరు 18, (న్యూస్ పల్స్) AP Pensions కొత్త పింఛన్ల కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అదే సమయంలో వైసీపీ హయాంలో అనర్హులకు ఇచ్చినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ తరుణంలో కొత్త పింఛన్ల మంజూరు తో పాటు అనర్హుల పింఛన్లను తొలగించనున్నట్లు తెలుస్తోంది.ఏపీ ప్రభుత్వం సంక్షేమ పాలనకు ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా కీలక సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. అర్హత ఉండి పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే జనవరి నుంచి కొత్త పింఛన్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే అదే సమయంలో అనార్హుల పెన్షన్లు కూడా తొలగించనున్నారు. వారికి…
Read MoreTirupati | తిరుపతిలోనే స్కిల్ యూనివర్శిటీ | Eeroju news
తిరుపతిలోనే స్కిల్ యూనివర్శిటీ తిరుపతి, అక్టోబరు చ17, (న్యూస్ పల్స్) Tirupati ఆంధ్రప్రదేశ్ యువత కోసం చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతోంది. ఈ వర్శిటీనీ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తే బావుంటుందనే కసరత్తు చేస్తోంది. అయితే స్కిల్ యూనివర్శిటీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తిరుపతి జల్లా ఏర్పేడు మండలం కొబాక దగ్గర 50 ఎకరాల స్థలంలో వర్శిటీని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారట. అలాగే ఈ యూనివర్శిటీకి వర్సిటీకి ఛైర్మన్గా వ్యాపారవేత్తలను నియమించాలనే ఆలోచనలో ఉన్నారట. గత ప్రభుత్వం స్కిల్ వర్సిటీ కోసం 50 ఎకరాలు కేటాయించింది.. కానీ అక్కడ ఎలాంటి నిర్మాణాలూ జరగలేదు. అందుకే ఏర్పేడు దగ్గర భూములు అందుబాటులో ఉండటంతో.. అక్కడ ఏర్పాటు చేయాలని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ నిర్ణయించినట్ల తెలుస్తోంది. ఈ స్కిల్ వర్శిటీకి…
Read MoreAP Cabinet | ఇండస్ట్రియల్ పాలసీకి కేబినెట్ ఆమోదం | Eeroju news
ఇండస్ట్రియల్ పాలసీకి కేబినెట్ ఆమోదం విజయవాడ, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) AP Cabinet ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చ జరుగింది. కేబినెట్ ముందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కొత్త పాలసీలకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పునరుత్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది.20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా పాలసీని రూపొందించింది. ఇవే కాకుండా ఏపీ…
Read MoreAmaravathi | అమరావతికి కొత్త కళ | Eeroju news
అమరావతికి కొత్త కళ అమరావతి, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Amaravathi అమరావతికి కొత్త కళ వస్తోంది. దాదాపు జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి కావడంతో.. అమరావతి రాజధాని యధాస్ధానానికి చేరుకొనుంది.డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని బడ్జెట్లో ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి సర్దుబాటు చేయించింది. ఈ నిధులు సైతం విడుదల కానున్నాయి. పలుమార్లు అమరావతిని సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రుణం మంజూరుకు ఆమోదముద్ర వేశారు. ఇది పూర్తిస్థాయి కేంద్రం సర్దుబాటు చేసే నిధులు. కేంద్రమే హామీ ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం మాత్రమే భరించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆ పది శాతం నిధులు…
Read MoreOne is the CM and the other is the Deputy CM | సూపర్ హిట్ జోడి.. | Eeroju news
సూపర్ హిట్ జోడి….. అమరావతి, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) One is the CM and the other is the Deputy CM ఒకరేమో సీఎం.. మరొకరేమో డిప్యూటీ సీఎం.. వారిద్దరి లక్ష్యం ప్రజాసంక్షేమ పాలన సాగించడమే. అయితే ఒకరిది సుధీర్ఘ రాజకీయ చరిత్ర.. మరొకరిది అందుకు భిన్నమైనా ఊహించని రీతిలో రాజకీయ రంగప్రవేశం చేసి, సక్సెస్ అయ్యారు. అంతవరకు ఓకే కానీ.. అనతి కాలంలోనే డిప్యూటీ సీఎంగా ప్రజల మన్ననలు పొందడమే కాక, ఏకంగా పల్లెలను అభివృద్ది బాటలో పయనింపజేసేందుకు భారీ ప్రణాళిక రూపొందించారు ఆయన. అందుకు సీఎంగా సుధీర్ఘ అనుభవం గల ఆ నేత.. తన ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు. ఇంతకు అభినందించిన సీఎం చంద్రబాబు అయితే.. అభినందనలు అందుకున్న వారు ఎవరో మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా..…
Read MoreVijayawada | తెరచాటు ప్రయత్నాల్లో లాబీయిస్టులు | Eeroju news
తెరచాటు ప్రయత్నాల్లో లాబీయిస్టులు విజయవాడ, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Vijayawada ఏపీలో అనూహ్యంగా కొందరు మద్యం షాపులు దక్కించుకున్నారు. లక్కీ డ్రా లో షాపులు పొందిన వారు ఉన్నారు. చాలామంది వందలాది దరఖాస్తులు వేశారు. కానీ వారికి చుక్కెదురు అయింది. అదే సమయంలో ఈ వ్యాపారంతో సంబంధం లేని వారు లాటరీలో షాపులను సొంతం చేసుకున్నారు. అటువంటి వారిపై ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది. సిండికేట్ లు రకరకాల ప్రలోభాలకు దిగుతున్నారు.బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. షాపు నిర్వహణకు 40 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అని.. అదే షాపులు మాకు అప్పగిస్తే కోటి రూపాయల నుంచి..కోటి 20 లక్షల వరకు ఇస్తామని చెబుతున్నారు. అలాగే గుడ్ విల్ కింద నెలకు 15 వేల వరకు అందిస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో షాపులు దక్కించుకున్న వారిలో ఒక…
Read MoreChandrababu VS Kiran Kumar | చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ | Eeroju news
చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ తిరుపతి, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Chandrababu VS Kiran Kumar ఒకరేమో ప్రస్తుత సీఎం.. మరొకరు మాజీ సీఎం.. వీరిద్దరూ కలిశారు.. మాట్లాడుకున్నారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకు ఏమి మాట్లాడుకున్నారు.. ఏ విషయంపై చర్చించారన్నది మాత్రం బయటకు రాని పరిస్థితి. వీరి కలయిక వెనుక ఏదైనా అంతరార్థం ఉందా అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నేతలు బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బాబు భేటీ కానున్నారు. ఈ సంధర్భంగా రాజకీయ పరమైన అంశాలపై చర్చ సాగనుండగా.. రాష్ట్రానికి సంబంధించిన…
Read MoreChandrababu | భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news
భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు విజయవాడ, అక్టోబరు 5, (న్యూస్ పల్స్) Chandrababu కేంద్రంలో ఈసారి చంద్రబాబు పాత్ర పెరిగింది.గత ఐదేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో అధికారానికి దూరం కాగా..కేంద్రంలో కూడా పరపతి తగ్గింది. అటు బిజెపి అగ్రనేతలు పట్టించుకోలేదు. వారిని కాదని ఇతర జాతీయ పార్టీలతో సంబంధాలు ఏర్పరచుకోలేదు చంద్రబాబు. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా చంద్రబాబు ఇమేజ్ పెరిగింది. రాష్ట్రంలో ఒంటరిగానే టిడిపి 134 అసెంబ్లీ స్థానాలను సాధించింది. కూటమిపరంగా 164 సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సొంతంగా 16 ఎంపీ సీట్లలో గెలిచింది. కూటమిపరంగా 21 సీట్లతో సత్తా చాటింది. అయితే గత రెండుసార్లు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ సొంతంగానే అధికారంలోకి రాగలిగింది. కానీ ఈసారి మెజారిటీకి అల్లంతా దూరంలో నిలిచిపోయింది బిజెపి…
Read MoreMLA Kolikapudi Srinivas | కొలికపూడి మాకు వద్దంటూ… టీడీపీకి పంచాయితీ | Eeroju news
కొలికపూడి మాకు వద్దంటూ… టీడీపీకి పంచాయితీ విజయవాడ, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) MLA Kolikapudi Srinivas తిరువూరు టీడీపీ పంచాయితీ మంగళగిరికి చేరింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడిని టీడీపీ శ్రేణులు నిలదీశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. 2 రోజుల కిందట చిట్టెల గ్రామ టీడీపీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ను ఎమ్మెల్యే కొలికపూడి దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో కవిత చికిత్స పొందుతున్నారు. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన మీడియా ప్రతినిధులు కూడా శనివారం చంద్రబాబును కలిశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికర పరిస్థితి…
Read More