విజయవాడ, జూన్ 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత అయిదేళ్లుగా చతికిలపడిన భూముల రేట్లు కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో రాజధాని ఆశలతో తిరిగి పుంజుకున్నాయి. నిజం చెప్పాలంటే 2023 డిసెంబరు నెల నుంచే తిరిగి చంద్రబాబే ముఖ్యమంత్రి కానున్నారనే టాక్ రావడంతో నిర్జీవమైన భూముల ధరల్లో చలనం కనిపించింది. మూడు రాజధానుల అంశాన్ని గత ప్రభుత్వం తెరపైకి తేవడంతో.. ఏపీ రాజధాని అమరావతితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు దాదాపు నాలుగేళ్లపాటు నేల చూపులు చూశాయి. ఇక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు మూతపడే పరిస్థితికొచ్చాయి. భూములు కొనుగోళ్ల పరిస్థితి అటుంచితే.. కనీసం అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు వైపు సైతం చూసేవారు లేని పరిస్థితి నెలకొంది. కానీ కొన్ని నెలల నుంచి పరిస్థితిలో మార్పు కనిపించింది. వైసీపీ…
Read MoreTag: Chandrababu Naidu
చిరంజీవి, పవన్ చేతులు పట్టుకొని పైకెత్తిన మోడీ ప్రజలకు అభివాదం | Chiranjeevi and Pawan held hands and saluted the people of Modi | Eeroju news
అమరావతి జూన్ 12 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు టిడిపి, జనసేన కార్యకర్తల, జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరందరి సమక్షంలో ఎపి సిఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. వీరితోపాటు కేబినెట్ మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ చేతులు పట్టుకొని పైకెత్తిన మోడీ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సంఘటన వేడుకకు హైలెట్ గా నిలిచింది.
Read Moreచంద్రబాబు తర్వాత పవన్, తర్వాత లోకేష్ | After Chandrababu, Pawan, then Lokesh | Eeroju news
విజయవాడ, జూన్ 12, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం చేస్తుంటే… సభా ప్రాంగణం ఒక్కసారిగా దద్దరిల్లింది. సభకు వచ్చిన వారంతా చప్పట్లతో స్వాగతం పలికారు. ప్రమాణం చేసిన తర్వాత మంత్రి పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవి కాళ్లకు దణ్ణం పెట్టారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ మొదటి సారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. సభలో అడుగుపెట్టీ పెట్టగానే మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్… ముందు ప్రజారాజ్యం బాధ్యతలు చేపట్టారు. ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవ్వడంతో 2014లో జనసేన పేరుతో పార్టీ పెట్టి ప్రజా సేవ చేస్తున్నారు. 2014…
Read Moreచంద్రబాబు ప్రమాణస్వీకారం నారా చంద్రబాబు నాయుడు అనే నేను… | Chandrababu’s oath taking I am Nara Chandrababu Naidu… | Eeroju news
అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, రాష్ట్రవిభజన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజా గా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్యశాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 2014లో తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా ప్రజల్లో తిరుగుతూ వారి కష్టసుఖాల్లో పాల్పంచుకున్నారు. 2024లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచ లన విజయాన్ని సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రి…
Read Moreమెగాస్టార్.. పవర్ స్టార్.. మధ్యలో మోడీ.. | Megastar.. Power star.. Modi in the middle.. | Eeroju news
అమరావతి, కోన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు. అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమైంది. మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన.. కార్యక్రమమం మొత్తంలో హైలెట్గా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత సభా వేదికనుంచి మోదీ దిగిపోయే సమయంలో ప్రధాన వేదికకు పక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్…
Read Moreచంద్రబాబు తిరుమల పర్యటనకు పటిష్టమైన భద్రత | Security tight for Chandrababu’s visit to Tirumala | Eeroju news
తిరుపతి బుధవారం ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు నాయుడు తిరుమల కు వస్తున్న నేపధ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం తిరుమలకు చేరుకుని గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తిరుపతి మీదుగా ఘాట్ రోడ్లు, తిరుమల, గాయత్రి అతిథిగృహం,వైకుంఠంకాంప్లెక్స్, శ్రీవారి ఆలయం వరకు రోడ్డు మార్గాన తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయం లోపల, విఐపి గేటు, పార్కింగ్ ప్రదేశం, గ్యాలరీలను, పరిశీలించి పోలీసు, ఏర్పోర్ట్ భద్రతా సిబ్బంది పాటించవలసిన బందోబస్తు ప్రణాళికను అధికారులకు వివరించారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు నిర్దేశిత పార్కింగ్ ప్రదేశంలోనే వాహనాలను పార్కింగ్ చేపించి యాత్రికులకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ముఖ్యమంత్రి…
Read More5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు | Vehicles stalled for 5 km | Eeroju news
5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు విజయవాడ Vehicles stalled for 5 km ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ప్రమాణ స్వీకారం మహోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతున్నారు.. ఈ కరణంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది One time settlement | వాహానాలకు వన్ టైమ్ సెటిల్ మెంట్ | Eeroju news
Read More