కొండా సురేఖకు కోర్టుక్లాస్ హైదరాబాద్, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) Konda Surekha కేటీఆర్ పిటిషన్పై సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపింది. కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు వేయగా..ఈ పిటిషన్పై సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా కొండా సురేఖకు ఆదేశాలిచ్చింది. విచారణలో భాగంగా బాధ్యత కలిగిన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కోర్టు పేర్కొంది. అందులోనూ ఒక ప్రజా ప్రతినిధి నుంచి ఇలాంటి మాటలు రావడం తీవ్ర అభ్యంతకరం అని తెలిపింది. అలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయంది. మరోసారి కేటీఆర్పై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. ఆమె వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, ఇతర ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతే…
Read MoreTag: Eeroju news
Revanth Reddy | రేవంత్ మౌనానికి కారణం ఏమిటో… | Eeroju news
రేవంత్ మౌనానికి కారణం ఏమిటో… హైదరాబాద్, అక్టోబరు 25, (న్యూస్ పల్స్) Revanth Reddy ధరలు పెంచింతే.. ఆదాయం వచ్చేది, ఖజానా నిండేది.. ఆరు గ్యారంటీలు అమలయ్యేది. ఇదీ సీఎం రేవంత్కు అధికారులు చేసిన ప్రతిపాదన. మద్యం ధరలు.. విద్యుత్, ఎల్ఆర్ఎస్ చార్జీలు పెంచేద్దామని సూచించగా.. రేవంత్ పెదవి విరిచినట్లు టాక్. ప్రస్తుతానికి ఇవన్నీ పక్కనపెట్టమని చెప్పారట. రేవంత్ నిర్ణయం వెనక కారణం ఏంటి.. అధికారుల ప్రతిపాదనలపై మౌనానికి కారణం ఏంటి.. సచివాలయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి..తెలంగాణ సర్కార్.. ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలుతో పాటు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల కొరత రేవంత్ సర్కార్ను తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీ కోసం సుమారు 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. 2లక్షలపైన…
Read MoreKTR | కేటీఆర్ నోటీసులతో జవాబులు | Eeroju news
కేటీఆర్ నోటీసులతో జవాబులు హైదరాబాద్, అక్టోబరు 25, (న్యూస్ పల్స్) KTR నేను ఎవరినైనా అనొచ్చు.. కానీ నన్నెవరూ అనొద్దు.. మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఇదేనా. అంటే ప్రత్యర్థుల నుంచి అవునన్న సమాధానమే వస్తోంది. ఎందుకంటే గతంలో కేటీఆర్ చాలా సార్లు నోరు జారారు. మొన్నటికి మొన్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు వేసుకోవాలన్నారు. మహిళా కమిషన్ ఆగ్రహానికి గురయ్యారు. విచారణకూ హాజరై వివరణ ఇచ్చుకున్నారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో సీఎంను ఏకవచనంతోనూ పిలిచి ఆ తర్వాత మాటలు వెనక్కు తీసుకున్నారుకొత్తగా తనపై విమర్శలు చేసేవారిపై లీగల్ నోటీసులు సంధిస్తున్నారు. ప్రతి విమర్శలకు ‘నోటి’ని కాకుండా నోటీసులనే నమ్ముకుంటున్నారు. అంతకు ముందు మంత్రి కొండా సురేఖ విషయంలోనూ అదే చేశారు. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్లపైనా లీగల్ నోటీసులనే నమ్ముకున్నారు.…
Read MoreJanasena | జనసేనకు పెరిగిన గ్రాఫ్…. | Eeroju news
జనసేనకు పెరిగిన గ్రాఫ్…. కాకినాడ, అక్టోబరు 25, (న్యూస్ పల్స్) Janasena జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయంగా డిమాండ్ పెరుగుతుంది. వైసీపీ నుంచి నేతలు పెద్దయెత్తునచేరేందుకు సిద్ధమయ్యారు. జనసేన గేట్లు తెరిస్తే చాలు.. ఇక పోలోమంటూ దూసుకు రావడానికి లీడర్లు సిద్ధంగా ఉన్నారు. ఎవరు ముందు చేరాలన్న తపన వైసీపీ నేతల్లో కనిపిస్తుంది. అందుకే జనసేనకు డిమాండ్ పెరిగింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఆచితూచి చేరికల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు. చేరికల విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా, నేతల ట్రాక్ రికార్డును కూడా తెప్పించుకుని లోతుగా పరిశీలించిన తర్వాతనే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలిసింది. చేరికల విషయంలో పవన్ కల్యాణ్ కొన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆ నేత ఏదైనా…
Read MoreJustice Sanjiv Khanna | నవంబర్ 11న సీజేఐ కొత్త బాధ్యతలు | Eeroju news
నవంబర్ 11న సీజేఐ కొత్త బాధ్యతలు న్యూఢిల్లీ, అక్టోబరు 25, (న్యూస్ పల్స్) Justice Sanjiv Khanna భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొదటి ప్యూస్నే న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఖన్నా, ప్రస్తుత సీజేఐ , DY చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత నవంబర్ 11న ఆ పదవిని చేపట్టనున్నారు. చంద్రచూడ్ గతంలో జస్టిస్ ఖన్నా పేరును తుదిపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేశారు. ప్రస్తుత న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఒక రోజు తర్వాత, నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 8, 2022న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ ఖన్నా…
Read MoreDelhi Air Pollution Alert | ఢిల్లీలో డేంజర్ బెల్స్… | Eeroju news
ఢిల్లీలో డేంజర్ బెల్స్… న్యూఢిల్లీ, అక్టోబరు 25, (న్యూస్ పల్స్) Delhi Air Pollution Alert ఢిల్లీలో కాలుష్య స్థాయి మరింత ప్రాణాంతకంగా మారింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య తీవ్రతతో కళ్ల మంటలు, గొంతు నొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది.ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 2 ను అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. కాలుష్యాన్ని నియంత్రించడానికి గ్రీన్ వార్ రూమ్ ను ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ ఆన్, వెహికల్ ఆఫ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరుతోంది. ఇందుకోసం వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి…
Read MoreKTR | మళ్లీ తప్పులో కాలు.. కేటీఆర్ కు ఏమైంది | Eeroju news
మళ్లీ తప్పులో కాలు.. కేటీఆర్ కు ఏమైంది హైదరాబాద్, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) KTR తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవకాశాన్ని వినియోగించుకుని బోర్లా పడుతున్నారు. లేటెస్ట్గా తెలంగాణ విద్యుత్ ఛార్జీలు పెంచుతారంటూ అప్పుడు ప్రచారం మొదలుపెట్టేశారాయన.అధికార పార్టీపై ఉద్యమం చేయాలంటే జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. తేడా వస్తే ప్రజలు చాలా చులనకగా చూస్తారు. దానికి ఓ ఒక్కపార్టీ మినహాయింపు కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి బురద జల్లుతూనే ఉన్నారు కేటీఆర్ సంబంధం లేని విషయాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ప్రత్యర్థులపై రాళ్లు వేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో బోర్లా పడ్డారు.. పడుతున్నారు కూడా. అయినా కాంగ్రెస్ సర్కార్ ఏదో చేస్తోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.అందుకు ఎగ్జాంపుల్…
Read MorePedda Reddy | మారని పెద్దా రెడ్డి తీరు | Eeroju news
మారని పెద్దా రెడ్డి తీరు తిరుపతి, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) Pedda Reddy ఏ రాయి అయితేనేం పల్లు ఉడగొట్టుకోవడానికి అన్నట్లు తయారైందంట పుంగనూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లతో పాటు ప్రజల పరిస్థితి .. గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరుతో దందాలు నడిస్తే తాజాగా ఊరికొకరు సామంత రాజుల్లా తయారై తమ మీద ప్రతాపం చూపుతున్నారని అక్కడి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ దందాలతో పాటు క్యారీల వద్ద మాముళ్లు, స్థలాలపై పెత్తనం మరో వైపు బ్రాందీ షాపులు, చివరకు బెల్ట్ షాపులకు సైతం లక్షలాది రూపాయలు వసూల్లకు పాల్పడుతున్నారన్న అరోపణలు వస్తున్నాయి. దీంతో టీడీపీ కేడర్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక.. దీని కోసమా తాము పోరాటాలు చేసిందని తలలు పట్టుకుంటుందట. పుంగనూరు నియోజకవర్గం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో…
Read MoreVasireddy Padma | వాసిరెడ్డి ఆగ్రహం వెనుక… | Eeroju news
వాసిరెడ్డి ఆగ్రహం వెనుక… విజయవాడ, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) Vasireddy Padma అధికారం కోల్పోయిన తర్వాత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్ లు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన నాయకులు మొత్తం ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పైగా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నాయకుల జాబితాలో ఇప్పుడు ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా చేరారు. బుధవారం ఆమె వైసిపికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి వెళ్తూ వెళ్తూ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడంలేదని.. కష్టపడుతున్న వారిని విస్మరిస్తున్నారని పద్మ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి…
Read MoreAamir Khan | అమీర్ ఖాన్ రీల్ హీరోనేనా… రియల్ కాదా | Eeroju news
అమీర్ ఖాన్ రీల్ హీరోనేనా… రియల్ కాదా ముంబై, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) Aamir Khan ఈ సినిమాలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఫాతిమా సనా షేక్, జైరా వాసిం ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ రాయ్ కపూర్, అమీర్ ఖాన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భారత మల్ల యోధులు గీత ఫొగాట్, బబితా ఫొగాట్, తండ్రి మహావీర్ జీవిత కదా ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్లను వసూలు చేసింది.. అయితే ఈ సినిమా విడుదలైన ఇన్ని సంవత్సరాల తర్వాత మల్ల యోధురాలు బబితా ఫొగాట్ నిర్మాతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏకంగా…
Read More