కబ్జాలో అగ్రిగోల్డ్ భూములు | Agrigold lands in possession | Eeroju news

కబ్జాలో అగ్రిగోల్డ్ భూములు విజయవాడ, జూన్ 18, (న్యూస్ పల్స్) Agrigold lands in possession ఖాతాదారుల్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ డిపాజిట్ల వ్యవహారంలో సిఐడి దర్యాప్తు సాగుతుండగానే అటాచ్‌ చేసిన భూముల్ని కబ్జా చేసేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో దాదాపు 3వేల గజాల భూమిని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి తనయుడి పేరిట తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు.ఖాతాదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన వ్యవహారంలో 2015 నుంచి కేసులు నమోదు అవుతున్నాయి.నాలుగైదు రాష్ట్రాల్లో విస్తరించిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్‌ వ్యవస్థాపకులు సంపాదించిన స్థిర, చరాస్తుల్ని సిఐడి జప్తు చేసింది. అగ్రిగోల్‌ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు…

Read More

జనసేన ఆచితూచి అడుగులు | Janasena Step by step | Eeroju news

జనసేన ఆచితూచి అడుగులు కాకినాడ, జూన్ 18, (న్యూస్ పల్స్) Janasena Step by step ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో జనసేన పార్టీ పోషించింది కీలక పాత్ర. ఇక ప్రభుత్వం నడపడంలోనూ దాన్ని కొనసాగించాలి. పొత్తులో ఉన్నంత మాత్రానా టీడీపీ నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ‘‘డూ డూ బసవన్న’’ లాగా జనసేన తలూపడం శోభించదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగేట్టు, ప్రభుత్వంపై అవసరం మేర ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుందిముఖ్యమంత్రి తర్వాత ఉపముఖ్యమంత్రిదే రెండో స్థానం అనుకుంటారు చాలామంది. అయితే రాజ్యాంగంలో ఉపముఖ్యమంత్రి పదవి గురించి ఏ ప్రస్తావనా లేదు. ఈ రాజకీయ పదవికి సంబంధించి చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే, ఉపముఖ్యమంత్రికి అన్ని అధికారాలు ఇచ్చిన దాఖాలాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. అంతకముందు జగన్ మంత్రివర్గంలో పని చేసిన ఉపముఖ్యమంత్రులు అయినా, తెలంగాణలో…

Read More

అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక భరోసా | Amaravati is a financial guarantee for Andhra Pradesh | Eeroju news

అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక భరోసా విజయవాడ, జూన్ 18, (న్యూస్ పల్స్) Amaravati is a financial guarantee for Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పలు రంగాలు గణనీయమైన వృద్ధిని, అభివృద్ధిని సాధిస్తాయని భావిస్తున్నారు. అమరావతి ఆశాజనక భవిష్యత్తుపై నిపుణులు, పారిశ్రామికవేత్తలు లైవ్ మింట్ తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టూరిజం రంగాలు అత్యధిక వృద్ధిని నమోదు చేయనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల వలసలకు ఊతమిచ్చేలా సౌకర్యాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యమని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతి టోపోగ్రాఫికల్ స్థానం స్థిరమైన, ప్రణాళికాబద్ధమైన, హరిత నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావిస్తున్నారు.ఈవై ఇండియా పార్టనర్, ఎకనామిక్ డెవలప్మెంట్ అడ్వైజరీ లీడర్ ఆదిల్ జైదీ మాట్లాడుతూ.. కృష్ణా నది ఒడ్డున ఉన్న అమరావతి నగరం…

Read More

బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్.. ప్రవీణ్..? | Harish.. Praveen as president of BRS..? | Eeroju news

బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరీష్.. ప్రవీణ్..? హైదరాబాద్, జూన్ 17, (న్యూస్ పల్స్) Harish.. Praveen as president of BRS..? భారత రాష్ట్ర సమితి ఉనికి సమస్యల్లో పడింది. అసెంబ్లీ ఎన్నికల వరకూ బలంగా ఉన్న పార్టీ తర్వాత ఒక్క సారిగా  వెనుకబడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడం.. తర్వాత ఐదు నెలలకే వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం  భారత రాష్ట్ర సమితి నేతల్ని ఒక్క సారిగా  నిరాశకు గురి చేసింది. పార్టీ భవిష్యత్ పై నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలు అంతా  పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో పార్టని కాపాడుకునేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో మేథోమథనం జరుపుతున్నారు. తాను గౌరవాధ్యక్షుడిగా ఉండి… ఇతరులకు బాధ్యతలివ్వాలని ఆలోచిస్తున్నారని ఈ మేరకు పార్టీ కీలక నేతలతో…

Read More

ఇక స్లీపర్ వందే భారత్ | India is the sleeper vande | Eeroju news

ఇక స్లీపర్ వందే భారత్ చెన్నై, జూన్ 17, (న్యూస్ పల్స్) India is the sleeper vande ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఆగస్టు 15 నాటికి వందే భారత్ స్లీపర్ ట్రైన్స్  ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే వేగంగా వెళ్లే ఈ రైళ్ల ట్రయల్ రన్ త్వరలోనే చేపడతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ ట్రైన్స్ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ఇంకో రెండు నెలల్లో పట్టాలు ఎక్కనున్నాయి. స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను అందించనున్నారు. మిగతా రైళ్లతో పోలిస్తే వీటిలో మెరుగైన సౌకర్యాలు ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే వందే భారత్…

Read More

ఢిల్లీలో నీటి సంక్షొభం | Water crisis in Delhi | Eeroju news

ఢిల్లీలో నీటి సంక్షొభం న్యూడిల్లీ, జూన్ 17, (న్యూస్ పల్స్) Water crisis in Delhi ఢిల్లీ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. యమునా నదికి నీటి ప్రవాహం తగ్గడంతో నీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. నీరు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇదే సమయంలో నీటి సరఫరా వ్యవస్థను దుండగులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనను కొన్ని ప్రాంతాల్లో జరుగుతుండగా ఢిల్లీ జల మంత్రిత్వ శాఖ కీలక చర్యలకు ఉపక్రమించిందినగరానికి వచ్చే పైపులైన్లకు పహారా కాయాలని విజ్క్ష‌ప్తి చేస్తూ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసారు. రాష్ట్రంలోని కీలకమైన వాటర్ పైపులైన్ల వద్ద మరో 15 రోజుల పాటు పోలీసు భద్రత పెంచాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను కోరుతున్నాను. నగరానికి జీవనాధారంగా మారిన వాటర్ పైప్‌లైన్లను కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు.…

Read More

ప్రజలతో మమేకయ్యే శాఖలను తీసుకున్న పవన్ | Pawan, who has taken the branches to be with the people | Eeroju nres

ప్రజలతో మమేకయ్యే శాఖలను తీసుకున్న పవన్ కాకినాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Pawan, who has taken the branches to be with the people : శాఖల కేటాయింపులో టీడీపీ మిత్రధర్మాన్ని పాటించింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ముఖ్యమైన శాఖలు కేటాయించడంతో పాటు, అదే పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు కీలకమైన పౌరసరఫరాల శాఖను అప్పగించింది. జనసేనకు సినీరంగంతో ఉన్న సంబంధాలు, పవన్‌ సినీ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి విజ్ఞప్తి మేరకు కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. జనసేనానికి హోంశాఖ, ఆర్థిక శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ  ప్రజావసరాలు, పార్టీ బలోపేతంపై ద‌ృష్టిపెట్టిన ఆయన ప్రజలతో మమేకమయ్యే శాఖలనే ఏరికోరి ఎంచుకుని ప్రత్యేకత చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రిగా జనసేత పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే కొనసాగనున్నారు.…

Read More

టార్గెట్ కొడాలి… అనిత ఫిక్స్ | Target Kodali… Anita Fix | Eeroju news

టార్గెట్ కొడాలి… అనిత ఫిక్స్ విజయవాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Target Kodali… Anita Fix : ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఆరోపణలు ప్రత్యారోపణలతో నాయకులు తెగ హడావిడి చేశారు. మీడియాను తమ వైపు తిప్పుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వచ్చేసాయి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలలో కనీసం ప్రతిపక్ష పార్టీ లేకుండా చేశారు. గత అధికార పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు.. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ఏపీలో రాజకీయాల్లో కాక తగ్గడం లేదు. మరోవైపు చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఇందులో కీలకమైన హోం శాఖను పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు కేటాయించారు. తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా…

Read More

వైసీపీకి పునర్విభజన… టెన్షన్ | Redistribution to YCP… tension | Eeroju news

వైసీపీకి పునర్విభజన… టెన్షన్ తిరుపతి, జూన్ 17,(న్యూస్ పల్స్) Redistribution to YCP… tension : ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పలేదు. మున్ముందు ఆ పార్టీ ఎన్నో సంక్షోభాలను అధిగమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనను టిడిపి కూటమి సర్కార్ పునః సమీక్షించే అవకాశం ఉంది. ప్రతి నిర్ణయంలో లోపాలు వెతికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మద్యం వంటి భారీ కుంభకోణంలో జగన్ తో పాటు కీలక నేతల పాత్రను టిడిపి సర్కార్ బయట పెట్టే అవకాశం ఉంది. మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు వంటి అంశాల్లో భారీ లోపాలు ఉన్నాయి. అయితే ఒక్క కేసులతోనే కాదు.. వైసిపి నిర్వీర్యమయ్యే ఏ చిన్న అవకాశాన్ని చంద్రబాబు విడిచిపెట్టారు. అది జగన్ కు కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వ…

Read More

జూలై నుంచి ఫ్రీ బస్సు | Free bus from July | Eeroju news

జూలై నుంచి ఫ్రీ బస్సు కడప, జూన్ 17, (న్యూస్ పల్స్) Free bus from July : ఏపీలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా.. చంద్రబాబు ఆర్టీసీ పల్లె వెలుగుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వచ్చే నెల నుంచి అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించారు ఏపీ అధికారులు. ఈ పథకంతో ఎంత భారం పడుతుంది? ఆర్టీసీ సర్వీసులపై చూపే ప్రభావం ఎంత? వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారుసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. తరువాత రోజు బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. 16,347…

Read More