Foreign Family Praises Vande Bharat Express | Indian Railways Experience Goes Viral | FBTV NEWS Watch more:https://www.youtube.com/watch?v=xjQYcdWd-Z4
Read MoreTag: #IndianRailways
RRC Railway Jobs 2025: Northern Railway Recruitment 2025: 4,116 Apprentice Vacancies – Eligibility, Apply Online, Cluster-Wise Posts
RRC Railway Jobs 2025: నార్తర్న్ రైల్వేలో భారీగా 4,116 అప్రెంటిస్ ఖాళీలు – క్లస్టర్ వారీగా పోస్టులు, అర్హతలు, దరఖాస్తు వివరాలు దేశవ్యాప్తంగా ఉన్న అనేక క్లస్టర్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి నార్తర్న్ రైల్వే (RRC-NR) తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,116 అప్రెంటిస్ ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు నవంబర్ 25, 2025 నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. క్లస్టర్ వారీగా ఖాళీల వివరాలు లక్నో: 1,397 పోస్టులు ఢిల్లీ: 1,137 పోస్టులు ఫిరోజ్పూర్: 632 పోస్టులు అంబాలా: 934 పోస్టులు మొరదాబాద్: 16 పోస్టులు ఈ అప్రెంటిస్ పోస్టులను ట్రేడ్ మెడిసిన్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కార్పెంటర్ వంటి పలు ట్రేడుల్లో భర్తీ చేయనున్నారు. అర్హతలు అభ్యర్థులు 10వ…
Read MoreSCRailway : దక్షిణ మధ్య రైల్వే సంచలనం: ఒక్కరోజులో టికెట్ జరిమానాల ద్వారా ₹1.08 కోట్లు వసూలు, ఆల్ టైమ్ రికార్డు!
దక్షిణ మధ్య రైల్వేలో రికార్డు స్థాయిలో జరిమానాల వసూలు మొత్తం 16,105 కేసులు నమోదు చేసిన రైల్వే అధికారులు భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక రోజులో ఇదే అత్యధిక వసూలు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉక్కుపాదం మోపారు. మంగళవారం జోన్ వ్యాప్తంగా నిర్వహించిన మెగా టికెట్ తనిఖీ డ్రైవ్లో ఒక్కరోజే ఏకంగా రూ.1.08 కోట్లకు పైగా జరిమానా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. భారతీయ రైల్వే చరిత్రలోనే ఒకేరోజు ఇంత భారీ మొత్తంలో అపరాధ రుసుం వసూలు కావడం ఇదే తొలిసారి. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆదేశాల మేరకు జోన్ పరిధిలోని ఆరు డివిజన్లలో ఏకకాలంలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు,…
Read MoreTirupati : దసరా, దీపావళి ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
పండగ రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తిరుపతి నుంచి షిర్డీ, జల్నాలకు ప్రత్యేక రైలు సర్వీసులు ప్రతి ఆదివారం తిరుపతిలో బయల్దేరనున్న షిర్డీ స్పెషల్ ట్రైన్ దసరా, దీపావళి పండుగల సీజన్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) అనేక ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు, ముఖ్యంగా తిరుమల శ్రీవారి భక్తులకు అనువుగా ఉండేలా పలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. రద్దీని నియంత్రించేందుకు ఈసారి మొత్తం 470 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో 170 రైళ్లు పూర్తిగా SCR పరిధిలో నడుస్తుండగా, మిగిలినవి ఇతర రైల్వే జోన్ల నుంచి ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. చెన్నై-షాలిమార్, కన్యాకుమారి-హైదరాబాద్ మార్గాల్లో కూడా ప్రత్యేక…
Read MoreSabariExpress : శబరి ఎక్స్ప్రెస్ ఇప్పుడు ‘సూపర్ఫాస్ట్’ – ప్రయాణ సమయం 2 గంటలు ఆదా!
సూపర్ఫాస్ట్గా మారిన సికింద్రాబాద్- తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్ నేటి నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు 17229/30 నుంచి 20629/30గా మారిన రైలు నంబర్ సికింద్రాబాద్-తిరువనంతపురం (త్రివేండ్రం) మార్గంలో తరచూ ప్రయాణించే వారికి రైల్వే శాఖ ఒక శుభవార్త అందించింది. ఈ రూట్లో ఎంతో ముఖ్యమైన శబరి ఎక్స్ప్రెస్ను తాజాగా సూపర్ఫాస్ట్ రైలుగా ఉన్నతీకరించింది. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. రైలు వేగం పెరగడం వలన ప్రయాణికులకు సుమారు రెండు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ కీలక మార్పులో భాగంగా రైలు నంబర్ను కూడా మార్చారు. ఇంతకుముందు 17229/30 నంబర్లతో నడిచిన ఈ రైలు, ఇకపై 20629/30 నంబర్లతో సూపర్ఫాస్ట్గా పరుగులు పెట్టనుంది. వేగం పెంచడంతో పాటు, ప్రయాణ వేళల్లో కూడా అధికారులు ముఖ్యమైన మార్పులు చేశారు. కొత్త టైమింగ్స్ (సెప్టెంబర్ 30,…
Read MoreHyderabad : తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధి: మూడు కొత్త హైస్పీడ్ రైలు మార్గాల ప్రతిపాదన
తెలంగాణ మీదుగా మూడు కొత్త హైస్పీడ్ రైలు మార్గాలు చెన్నై, బెంగళూరు మార్గాలకు ఇప్పటికే అలైన్మెంట్లు ఖరారు నేడు రైల్వే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. హైదరాబాద్ను దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, అమరావతిలకు అనుసంధానించే మూడు హైస్పీడ్ రైలు మార్గాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. హైస్పీడ్ రైలు కారిడార్ల అప్డేట్స్ హైదరాబాద్-చెన్నై మార్గం: ఈ హైస్పీడ్ రైలు మార్గం నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడల మీదుగా వెళ్తుంది. కాజీపేట ద్వారా కాకుండా, ఈ కొత్త మార్గంలో తెలంగాణలో 6-7 స్టేషన్లు ఉండొచ్చు. హైదరాబాద్-బెంగళూరు మార్గం: ఈ కారిడార్ నాగ్పూర్-హైదరాబాద్-బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేకు సమాంతరంగా నిర్మించబడుతుంది. దీని కోసం మూడు అలైన్మెంట్లు ప్రతిపాదించారు. తెలంగాణలో 4-5 స్టేషన్లు ఏర్పాటు చేయాలని అంచనా…
Read MoreVandeBharat : వందే భారత్ స్లీపర్ రైలు: సెప్టెంబర్ నెలలో తొలి రైలు ప్రారంభం
VandeBharat : వందే భారత్ స్లీపర్ రైలు: సెప్టెంబర్ నెలలో తొలి రైలు ప్రారంభం : రైల్వే ప్రయాణికులకు శుభవార్త! సెప్టెంబర్ నెలలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ కొత్త రైలు భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఆయన తెలిపారు. అలాగే, ముంబై – అహ్మదాబాద్ మధ్య త్వరలో దేశంలోనే మొదటి బుల్లెట్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఈ బుల్లెట్ రైలు 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల 7 నిమిషాల్లో చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలు వందే భారత్ స్లీపర్ అనేది సెమీ-హై-స్పీడ్ రైలు. రాత్రిపూట ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం నడుస్తున్న 50కి పైగా వందే భారత్…
Read MoreRailway Services : భారతీయ రైల్వేల ‘రైల్ వన్’ యాప్: ఇకపై ప్రయాణం మరింత సులువు!
Railway Services : భారతీయ రైల్వేల ‘రైల్ వన్’ యాప్: ఇకపై ప్రయాణం మరింత సులువు:భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు ఓ గొప్ప శుభవార్తను అందించింది. ఇకపై వేర్వేరు రైల్వే సేవల కోసం రకరకాల యాప్లను వాడాల్సిన అవసరం లేకుండా, అన్నింటినీ ఒకే చోటుకు తెచ్చింది. ‘రైల్ వన్’ పేరుతో సరికొత్త ఆల్-ఇన్-వన్ సూపర్ యాప్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆవిష్కరించారు భారతీయ రైల్వేల సరికొత్త ‘రైల్ వన్’ యాప్: ప్రయాణికులకు ఒకే వేదికపై అన్ని సేవలు భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు ఓ గొప్ప శుభవార్తను అందించింది. ఇకపై వేర్వేరు రైల్వే సేవల కోసం రకరకాల యాప్లను వాడాల్సిన అవసరం లేకుండా, అన్నింటినీ ఒకే చోటుకు తెచ్చింది. ‘రైల్ వన్’ పేరుతో సరికొత్త ఆల్-ఇన్-వన్ సూపర్ యాప్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆవిష్కరించారు.…
Read MoreChenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన – చీనాబ్ రైల్వే వంతెన–ను ప్రజలకు అంకితం చేశారు. ఈ నిర్మాణం ద్వారా కశ్మీర్ లోయ, దేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా కలవడం ప్రారంభమైంది. ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టులో అత్యంత ప్రాముఖ్యమైన భాగంగా నిలిచింది. ఈ ఉదయం ప్రధాని మోదీ ఉధంపూర్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్కు చేరుకొని అక్కడి నుంచి చీనాబ్ వంతెన వద్దకు ప్రయాణించారు. అక్కడ ఆయన ఈ శిల్పకళా అద్భుతాన్ని అధికారికంగా ప్రారంభించారు. గత ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సరిహద్దును దాటి ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించిన తర్వాత ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్లో తొలిసారి పర్యటించడం విశేషం. చీనాబ్ నదిపై నిర్మితమైన ఈ…
Read More