హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) ఓడలు బండ్లు అవుతాయి.. బండు ఓడలు అవుతాయి అన్నది సమెత. ఈ సామెత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం సరిగ్గా సరిపోతుంది. పదేళ్లు తెలంగాణలో నంబర్వన్గా, తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీ.. ఆరు నెలల క్రితం ఓటరు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకోవడమే ప్రశ్నార్థకమైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కారు స్పీడ్కు బ్రేకులు వేయగా.. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలు.. కారును పంక్చర్ చేసింది. పదేళ్లు తెలంగాణకు తాను ప్రభువును అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్ అతని కుటుంబాన్ని ప్రజాస్వామ్యంతో తమకున్న ఓటు అనే ఆయుధంతో కిందకు దించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ నేతల్లో అహంకారం తగ్గలేదు. ఇదే తరుణంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ పాలనలో జరిగిన స్కామ్లు, కుంభకోణాలను…
Read MoreTag: Telangana News
పరిపాలనపై పట్టు సాధించని రేవంత్ | Revanth who has not mastered the administration | Eeroju news
హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) తెలంగాణలో పరిపాలన ఇంకా గాడిన పడలేదు. ప్రభుత్వం ఇంకా కిందా మీదా పడుతోంది. ప్రతీ విషయంలోనూ వివాదాస్పదమవుతోంది. మద్యం బ్రాండ్ల విషయంలో ఏం జరిగిందో అంతా గందరగోళంగా మారిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాతే పాఠ్యపుస్తకాలు ప్రింటింగ్ చేసినా.. అందులో సీఎం కేసీఆర్ అంటూ పేజీలు ముద్రించారు. అవి పంపిణీకి వచ్చే వరకూ ఎవరూ గుర్తించలేదు. మరో వైపు గత ప్రభుత్వంలో అవినీతి పై జరుగుతున్న విచారణల్లో ఒకరు ముందు.. మరొకరు వెనక్కి లాగుతున్నారు. చివరికి ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఈ మొత్తం వ్యవహారాలన్నీ చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై పూర్తి పట్టు లేదన్న అభిప్రాయం కలుగుతుంది. అదే నిజమని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అంటే ఓ వ్యక్తి కాదు. వ్యవస్థ. మొత్తం…
Read Moreతెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు వర్షాలు | Rains for the next three days across Telangana | Eeroju news
హైదరాబాద్ జూన్ 14 తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తాయని ఎపి వాతావరణ శాఖ చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.
Read Moreరంగారెడ్డి జిల్లాలో 34 స్కూలు బస్సులపై కేసులు నమోదు | Cases registered against 34 school buses in Rangareddy district | Eeroju news
34 స్కూలు బస్సులపై కేసులు నమోదు : రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఫిట్ నెస్ లేని 34 విద్యాసంస్థల బస్సులపై కేసులు నమోదు చేసినట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ వెల్లడించారు. విద్యా సంస్థల బస్సులపై మూడవ రోజు ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా వ్యాప్తం గా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫిట్ నెస్ లేని, పన్నులు చెల్లించని 34 బస్సులపై కేసు నమోదు చేయడం జరిగిందని అయన అన్నారు. ఈ రోజు 4 బృందాలు గా ఏర్పడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తం గా రవాణా శాఖ అధికారులు తనిఖీ లు చేపట్టారు. ఈ సందర్భం గా డి టి సి చంద్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఫిట్ నెస్ లేని,15…
Read Moreఇక పుస్తకాలతో కుస్తీ… | And wrestling with books…| Eeroju news
హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) వేసవి సెలవులు తర్వాత తెలంగాణలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులున్నారు. పాఠశాలలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. ముఖ్యంగా తరగతి గదులను సర్వాంగ సుందరంగా అలంకరించారు.తొలిరోజు విద్యార్థులకు పుస్తకాలు, నోటు బుక్స్, యూనిఫామ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని స్కూల్స్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని విద్యార్థులకు ఇవ్వనున్నారు. అయితే ఈనెల 6 నుంచి బడిబాట కార్యక్రమం మొదలైంది. 19 వరకు జరగనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఇక స్కూళ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఎస్హెచ్జీ గ్రూపుల సభ్యులు, టీచర్లు, ఇతర ఉన్నతాధికారులుంటారు. స్కూల్స్ పరిధిలో చేపట్టే ప్రతీ పనిని…
Read Moreఫేక్ జీవోలు…మండిపడుతున్న టీ కాంగ్రెస్… | Fake creatures.. Burning Tea Congress… | Eeroju news
హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్ధం ఊరంతా చుట్టేస్తుందంటారు. ఏ మహానుభావుడు చెప్పాడో కానీ.. ఇది ముమ్మాటికి నిజమనిపిస్తుంది కొన్ని సీన్స్ను చూస్తే.. దీనికి లెటెస్ట్ ఎగ్జాంపుల్ TS నుంచి TGకి పేరు మార్చేందుకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ప్రచారం. ఒకరు 2 వేల కోట్లు అంటారు.. మరికొందరు 4 వేల కోట్లు అంటారు. ఇంతకీ ఇందులో ఏది నిజం..? ఏది అబద్ధం..?తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరగానే తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో.. TS నుంచి TGగా పేరు మార్చడం ఒకటి.. మరి చెప్పినంత ఈజీగా జరగదు కదా పని.. గవర్నమెంట్లోని అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ మార్పు జరగాలి.. దీనికి కాస్త ఖర్చవుతుంది.. ఇది నిజం.. బట్.. ప్రభుత్వంపై ఎప్పుడెప్పుడు బురద జల్లుదామా? అని ఎదురుచూసే విపక్షం.. దీనిని అస్త్రంగా మలుచుకుంది.…
Read Moreపెద్ద ప్లాన్ లో మల్లారెడ్డి… | Mallareddy in big plan… | Eeroju news
హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) ఏపీలో బంపర్ మెజార్టీతో చారిత్రక విజయం నమోదు చేసింది టీడీపీ. ఈ సారి ఎన్నికల్లో పోటీచేయని టీడీపీ తెలంగాణలో దాదాపు మూతపడింది. దాంతో ఇప్పుడు సైకిల్ పార్టీకి తెలంగాణంలో డిమాండ్ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్లో చేరదామంటే అక్కడ తలుపులు తెరుచుకోని బీఆర్ఎస్ నేతలకు టీడీపీనే దిక్కులా కనిపిస్తుందంట. అలాంటి వారిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ముందు వరుసలో కనిపిస్తున్నారు. సైకిల్ ఎక్కేందుకు ఆయన చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారంట. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు దిగి సైకిల్ ఎక్కేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ముఖ్య నేతలతో రహస్య మీటింగ్ ఏర్పాటు చేసి సమాలోచనలు జరిపారంట. ఆస్తుల రక్షణకు మల్లారెడ్డి తెలంగాణలో సరికొత్త రాజకీయానికి తెరలేపే ఆలోచనలో ఉన్నారంట. మల్లారెడ్డి…
Read Moreనిద్రలో విద్యశాఖ అధికారులు | Education officials in sleep | Eeroju news
వరంగల్, జూన్ 14, (న్యూస్ పల్స్) విద్యా శాఖలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినా, అధికారులు మాత్రం పాత ప్రభుత్వమనే భ్రమల్లోనే ఉన్నారు. మొద్దు నిద్ర వీడడంలేదు. దాని ఫలితమే తెలంగాణలో పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగింది?తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబిత ఇంద్రారెడ్డి పేర్లు యధాతధంగా ఉంచేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనికి బాధ్యులు ఎవరన్నదానిపై విచారణ మొదలైంది.పాఠ్య పుస్తకాలను కనీసం చూడకుండా పంపిణీ చేయడంపై విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ లో కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటింది.…
Read Moreరుణమాఫీపై కొత్త గైడ్ లైన్స్… | New guidelines on loan waiver… | Eeroju news
హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) రుణమాఫీ స్కీమ్ పై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15వ తేదీలోపు రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని గత కొద్దిరోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగియటంతో రుణమాఫీపై రేవంత్ సర్కార్…గట్టిగా ఫోకస్ చేసే పనిలో పడింది. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో… ఏ విధంగా అమలు చేస్తారనే దానిపై రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కటాఫ్ తేదీ ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. దీనికితోడు ఏకకాలంలో రైతుల రుణమాఫీ ఎలా సాధ్యమవుతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచే అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే రేవంత్ సర్కార్ మాత్రం…. ఇచ్చిన…
Read Moreకరీంనగర్ లో బూడిద రాజకీయం | Gray politics in Karimnagar | Eeroju news
కరీంనగర్, జూన్ 14, (న్యూస్ పల్స్) రామగుండం ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిద రవాణాకు సంబంధించి కాంగ్రెస్, బిఆర్ఎస్ బిజేపి నేతల మధ్య రోజురోజుకు మాటల యుద్ధం పెరుగుతోంది. బూడిద రవాణాలో ఆక్రమాలు చోటుచేసుకున్నాయని ఓ పార్టీ ఆరోపిస్తుండగా.. రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని మరో పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.అక్రమ రవాణాతో పాటు ప్రతి రోజూ రూ. లక్షల్లో అవినీతి జరుగుతోందని, అందులో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తం ఉందని బిఆర్ఎస్ కు చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు ఉమ్మడి జిల్లాలో చర్చకు దారి తీశాయి. తాను స్వయంగా కొన్ని లారీలను పట్టించినప్పటికీ రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని, అధికారులు కేసులు…
Read More