తిరుమల బోర్డు ఎప్పుడు… తిరుమల, అక్టోబరు 23, (న్యూస్ పల్స్) Tirumala కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచిపోతున్నాయి. ఇంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నియామకం జరగలేదు. కనీసం స్పసిఫైడ్ అథారిటీని కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో టీటీడీ చరిత్రలో మొదటి బ్రహ్మోత్సవాలు అధికారుల పర్యవేక్షణలో సాగాయి.త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుమలపై గత నెల మీడియాతో మాట్లాడుతూ బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారన్నారు. టీటీడీ పాలక మండలిలో.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 దేవాలయాలు పాలక మండళ్లను అతి త్వరలోనే నియమిస్తామని ప్రకటించారు. అది చెప్పి నెల గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలు టీటీడీ పాలక మండలి ప్రస్తావనే రావడం లేదు.టీటీడీ చరిత్రలో పాలకమండలి…
Read MoreTag: Tirumala
Tirumala Controversy | తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపా | Eeroju news
తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపా తిరుమల, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Tirumala Controversy ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై కొన్ని నెలల కిందట ఏపీ, తెలంగాణకు సంబంధించి పెద్దలు హైదరాబాద్ లో చర్చలు జరిపారు. కొన్ని విషయాల్లో క్లారిటీ రాగా, మరికొన్ని విషయాలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే తిరుమల విషయంలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు అంత సంతోషంగా లేరని తెలుస్తోంది. తిరుమలకు వెళ్లిన తమకు తగిన గౌరవం దక్కడం లేదని, ప్రొటోకాల్ లాంటివి పాటించడం లేదని తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. తమ సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు కావడం లేదని, తమ వారికి కనీసం గదులు కూడా కేటాయించడం…
Read MoreAP Pensions | ఏపీలో కొత్త పింఛన్లు… మార్గదర్శకాలు సిద్ధం! | Eeroju news
ఏపీలో కొత్త పింఛన్లు… మార్గదర్శకాలు సిద్ధం! తిరుమల, అక్టోబరు 18, (న్యూస్ పల్స్) AP Pensions కొత్త పింఛన్ల కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అదే సమయంలో వైసీపీ హయాంలో అనర్హులకు ఇచ్చినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ తరుణంలో కొత్త పింఛన్ల మంజూరు తో పాటు అనర్హుల పింఛన్లను తొలగించనున్నట్లు తెలుస్తోంది.ఏపీ ప్రభుత్వం సంక్షేమ పాలనకు ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా కీలక సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. అర్హత ఉండి పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే జనవరి నుంచి కొత్త పింఛన్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే అదే సమయంలో అనార్హుల పెన్షన్లు కూడా తొలగించనున్నారు. వారికి…
Read MoreAmaravati | లడ్డూ సిట్ నియామకం ఎప్పుడో..? | Eeroju news
లడ్డూ సిట్ నియామకం ఎప్పుడో..? అమరావతి, Amaravati తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదానికి ఉపయోగించే నెయ్యి విషయంలో జరిగిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీబీఐ, సిట్, అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అప్పటికే ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఆపేసింది. దాంతో కొత్త సిట్ ను వెంటనే నియమిస్తారని, విచారణ ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ సిట్ నియామకంపై ఇంత వరకూ అధికారిక ప్రకటన రాలేదు. సిట్ నియామకం, విచారణపై సుప్రీంకోర్టు ఎలాంటి గడువు పెట్టకపోవడంతో నింపాదిగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టుకు దసరా సెలవులు అయ్యేలోపు నియమించే అవకాశం ఉంది. సీబీఐ చీఫ్ దర్యాప్తును పర్యవేక్షిస్తారు. ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు ఏపీలోని సిట్ బృందంలో ఉన్న వారు. ఒక అధికారిని ఖరారు చేయాల్సి ఉంది. వీరిని ప్రకటిస్తే, దర్యాప్తు వేగంగా జరిగే…
Read MoreCM Chandrababu | తిరుమల సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పు | Eeroju news
తిరుమల సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పు CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (శుక్రవారం) తిరుమలకు రానున్నారు. అయితే సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. 5.30 నుంచి 7.30 వరకు పద్మావతి అతిథి గృహంలో చంద్రబాబు బస చేయనున్నారు. చంద్రబాబు దంపతులు 7.30 గంటలకు పద్మావతి అతిథి గృహం నుంచి బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు పట్టువస్త్రాలతో బేడీలు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. చంద్రబాబు దర్శనం అనంతరం ఆలయం వెలుపల వాహన మండపంలో జరిగే భారీ శేషవాహన సేవలో చంద్రబాబు దంపతులు పాల్గొంటారు.రాత్రి 9.30 గంటలకు పద్మావతి…
Read MoreTirumala | బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ…. | Eeroju news
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ…. తిరుమల, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Tirumala తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. వైఖానస ఆగమంలో క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు ఎలాంటి ఆంటకాలు లేకుండా విజయవంతం కావాలని కోరుతూ అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా..శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాలికలలో పుట్టమన్ను వేసి.. అందులో నవధాన్యాలు నాటుతారు. ఆ నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. బ్రహ్మోత్సావాల్లో భాగంగా రోజూ…
Read MoreGoverning Council after Brahmotsavam | బ్రహ్మోత్సవాల తర్వాతే పాలక మండలి..? | Eeroju news
బ్రహ్మోత్సవాల తర్వాతే పాలక మండలి..? తిరుమల, అక్టోబరు 1 , (న్యూస్ పల్స్) Governing Council after Brahmotsavam ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలై వారం గడుస్తోంది. గత వారం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, పాలక మండలి సభ్యుల్నినియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని నాయకులు, పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారిని గుర్తించి వారి అనుభవం, సామర్థ్యానికి తగ్గ పోస్టుల్లో నియమించారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి ప్రతినిధులు, కీలకమైన పదవుల నియామకంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం గుర్తింపు ఉన్న పదవుల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ వీడటం లేదు. గత వారమే టీటీడీ ఛైర్మన్ నియామక ప్రక్రియ కొలిక్కి వస్తుందని విస్తృతంగా ప్రచారం…
Read MoreTTD Board after Sankranti | సంక్రాంతి తర్వాతే టీటీడీ బోర్డు | Eeroju news
సంక్రాంతి తర్వాతే టీటీడీ బోర్డు తిరుమల, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్) TTD Board after Sankranti రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉండే నామినేడెట్ బోర్డు అది… జీవితంలో ఒకసారైనా ఆ బోర్డులో ఏదో ఒక పోస్టులో పనిచేయాలని చాలా మంది కలలు కంటుంటారు. సీఎం నుంచి పీఎం వరకు రికమెండేషన్స్ చేయించుకుంటుంటారు. అలాంటి పోస్టును వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం కూడా భావించింది.ఒకరిద్దరి పేర్లు ప్రచారంలోకి వచ్చినా లిస్టు మాత్రం ఫైనల్ అయిందనే అనుకున్నారు. కానీ, తొలివిడత నామినేడెట్ పోస్టుల జాబితాలో ఆ బోర్డు ఊసే లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో నియామకం జరిగే ఛాయలు కూడా కనిపించడం లేదు. ఇక క్యాలెండర్ మారితేగాని ఆ పోస్టు భర్తీ ఉండదనే తాజా సమాచారం ఆశావహుల ఆశలకు గండికొడుతోందంటున్నారు… ఇంతకీ ఆ క్రేజీ…
Read MoreLaddu scam | లడ్డూ స్కాం,… అరెస్ట్ లు భయం | Eeroju news
లడ్డూ స్కాం,… అరెస్ట్ లు భయం తిరుమల, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Laddu scam తిరుమల లడ్డూ వివాదంపై రంగంలోకి దిగేసింది సిట్ టీమ్. సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులు తమ పని మొదలుపెట్టేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేశారు? టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు? ఆ కంపెనీల లావాదేవీలేంటి? దీనివెనుక ఎవరు కీలకపాత్ర పోషించారు ఇలా రకరకాల విషయాలు వెలుగులోకి రానున్నాయి.తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది… రేగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాలతోపాటు కేంద్ర ప్రభుత్వం పెద్దలు రంగంలోకి దిగేశారు. మరోవైపు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనని దుయ్యబట్టాయి. పరిస్థితి గమనించిన చంద్రబాబు సర్కార్ తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్…
Read MoreAP | ఎదురు తిరుగుతున్న వ్యూహం | Eeroju news
ఎదురు తిరుగుతున్న వ్యూహం తిరుమల సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్) AP తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద కల్తీ విషయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ వ్యూహం మార్చారు. ఇప్పటి వరకూ నిజాలు తెలుసుకోవాలని ఆయన చాలా మందికి లేఖలు రాశారు. పార్టీ పరంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ లడ్డూ లో కల్తీ జరగనే లేదు అన్న వాదన మాత్రం గట్టిగా వినిపిస్తున్నారు. అందు కోసం రకరకాల వాదనలతో తెరపైకి వస్తున్నారు. తాజాగా జగన్ స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. తిరుమలకు కాలి నడకన వెళ్లడంతో పాటు శనివారం ఆలయాల్లో పూజలు చేయాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూ ఇష్యూలో జగన్ అన్యమతస్తుడు కాబట్టే హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని పైగా కించ పరుస్తున్నారని…
Read More