జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి
నాగర్ కర్నూల్
అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు సరైన సమయస్ఫూర్తి ప్రదర్శించడం వల్ల భారీ ప్రాణ ఆస్తి నష్టాలను నివారించవచ్చని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి అన్నారు. ఏప్రిల్ 14 నుండి
జిల్లాలో అగ్నిమాపక శాఖ ద్వారా జరుగుచున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో అగ్నిమాపక నివారణను ప్రయోగాత్మక ప్రదర్శన ద్వారా
చూపించారు. అగ్ని రాజుకుంటే ఏ విధంగా నష్ట నివారణ చేపట్టాలి, మంటలను ఏ విధంగా అదుపులోకి తీసుకోవాలో ప్రదర్శన రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు.ఆర్టీసీ క్యాంటీన్, వాహనాల
పార్కింగ్, పక్కనే ఉన్న చిరు వ్యాపారులు, దుకాణం దారులకు ఈ మంటల నివారణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా దుకాణాల్లో, ఇళ్లల్లో నిరంతర
విద్యుత్ వాడకం వల్ల షార్ట్ సర్క్యూట్ కావడం లేదా చిన్న నిప్పు రాజుకొని మంటలు ఎగిసిపడి నిమిషాల వ్యవధిలో అపారమైన ఆస్థి నష్టం, ప్రాణ నష్టం జరుగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో
తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలు ఏంటివి, మంటలను ఏ విధంగా అదుపులోకి తీసుకురావాలి అనే అంశాలను అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేసారు.
అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు చిరువ్యాపారులకు, దుకాణం దారులకు ప్రజలకు ఆకట్టుకున్నాయి.ఈ ప్రదర్శనలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.