మహబూబాబాద్: 240 వ రోజు మహాబూబాబాద్ నియోజక వర్గంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. ఆలేరు,వావిలాల,తండాల్లో గ్రామస్తులు షర్మిల కు ఘన స్వాగతం పలికారు. షర్మిల మాట్లాడుతూ కేసీఅర్ పాలన పోవాలి. కేసీఅర్ ది మోస పూరిత పాలనని ఆరోపించారు. ఏ పథకాన్ని కూడా కేసీఅర్ అమలు చేయలేదు. ఇళ్లులు కావాలన్న,రుణమాఫీ కావాలన్నా, వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి. నేను రాజన్న బిడ్డ. వైఎస్సార్ పాలన మళ్ళీ తీసుకు వస్తానని అన్నారు.