A place where you need to follow for what happening in world cup

HOT NEWS

సీఎం జగన్ పై ఎంపీ రామ్మోహన్ సెటైర్లు

0

శ్రీకాకుళం:చంద్రబాబు చేసిన సంస్కరణలను దేశంలోని కీలక నేతలు ఆచరించారని, మోడల్గా తీసుకున్నారని.. ప్రధానిగా వాజ్పాయ్ సయితం.. చంద్రబాబు సలహాలు తీసుకునేవారని ఎంపీ రామ్మోహన్ అన్నారు. దివాళా తీస్తున్న రాష్ట్రాన్ని చంద్రబాబే బాగు చేయగ లరని ప్రజలు అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు హయాంలో భావనపాడు పోర్ట్ అనుమతులు తీసుకోస్తే నాలు గేళ్లు ఏం చేసారని సీఎం జగన్ను ఉద్దే శించి రామ్మోహన్ నాయుడు ప్రశ్నిం చారు.

పోర్టు శంఖుస్థాపన ఎన్నికల స్టంట్ మాత్రమేనన్నారు. పోర్టు పేరు, ఊరు మార్చారని.. అసలేం చేస్తున్నా రో అర్దం కావడంలేదన్నారు.10 కిలో మీటర్ల రోడ్డే వేయలేకపోయారని.. ఇక పోర్టు నిర్మిస్తారా? అంటూ ఎద్దేవా చేశా రు. జగన్ హామీలు పేపర్లో రాసుకోవ డానికి తప్ప.. ఒక్క రూపాయి రావడం లేదన్నారు. బోగాపురం ఏయిర్పోర్టు మరో కొత్త డ్రామాగా ఆయన అభివర్ణిం చారు.

Leave A Reply

Your email address will not be published.