హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,500 పోలీసులు, కేంద్రబలాలు నుంచి 13, సీఆర్పిఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తులో ఉంటారని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోలింగ్ రోజు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద సెంట్రల్ బలగాలను వాడుతాం. అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇచ్చిన కంటే తక్కువ సెంట్రల్ బలగాలు ఈసారి హైదరాబాద్ కి వచ్చాయి. మరిన్ని పంపాలని కోరాం. పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లొకేషన్స్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ పోలీసుల నుంచి క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా పని చేస్తున్నారని అన్నారు.