మంథని
ట్రస్మ ,ఈ అభ్యాస్ హైదరాబాద్ వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఒలింపియాడ్ ఎగ్జామ్ లో మంథని పట్టణంలోని శ్రేష్ట కిడ్స్ స్కూల్ చదివే 5వ తరగతి విద్యార్థిని వేముల అభిగ్న గౌడ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి ర్యాంకు సాధించింది. అంతే కాకుండా రాష్ట్ర స్థాయిలో శ్రేష్ఠ కిడ్స్ స్కూల్ కు ట్రస్మ ఒలింపియాడ్ బెస్ట్ స్కూల్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కూడా అందించారు.
కరస్పాండెంట్ సిరిపురం క్రాంతి కుమార్, ప్రిన్సిపాల్ బిందుల ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థిని ఈ ఘనత సాధించింది. రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని అభిగ్న గౌడ్ తో పాటు స్కూల్ యాజమాన్యాన్ని ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో బహుమతులు ప్రదానం చేసి సన్మానించారు . విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించడంలో తోడ్పాటును అందించిన వారి తల్లిదండ్రులకు పాఠశాల తరఫున కరస్పాండెంట్ క్రాంతి కుమార్ ప్రిన్సిపల్ బిందు లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.