హైదరాబాద్
రాష్ట్రంలొ రోజురోజుకి రైతుల కష్టాలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలు బాగా పెరిగాయి. వ్యవసాయ పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ఈ పరిస్థితులు వచ్చాయి. అన్నదాతల ఆవేదన ఆక్రనందన బిన్న రూపాల్లో వ్యక్త పరుస్తున్నారు. రైతులు కంటతడి పెడుతున్నారు. అనవసరంగా కాంగ్రెస్ కు ఓటు వేశామని బాధ పడుతున్నారు.
కాంగ్రెస్ నాయకులు రైతులను పట్టించుకోకుండా ఇతర పార్టీల నాయకులకు కండువాలు కప్పే ఉన్న పనిలో ఉన్నారు. ఎంత సేపు అధికారం, రాజకీయం తప్ప జనాన్ని రైతులను పట్టించుకునే పని లేదు కాంగ్రెస్ నేతలకు. పాలన చేతనైతే రైతుల వద్దకు వెళ్లి దైర్యం చెప్పండి.,నీళ్లివ్వండి. వచ్చే ప్రభుత్వం ఇంత హోల్ సేల్ గా మోసం చేస్తారు అని జనం అనుకోలేదు.. మంత్రి తుమ్మల కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తున్నాడు. ఆయనంటే సోదరభావం ఉంది. కొంత గౌరవం ఉంది. గతంలో మీరు మంత్రి గా ఉన్నప్పుడు వ్యవసాయ పరిస్థితులు ఏంటో తెలియదా అని ప్రశ్నించారు.