కాకినాడ
ప్రభుత్వం ప్రతి రైతుని ఆదుకుంటుందని, అలాగే కష్టకాలంలో మీ భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులను రైతులందరూ ఆదుకోవాలని రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో వాకాడ, యండమూరు, వలస పాకల, కరప, గ్రామాల్లో తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, జడ్పిటిసి సభ్యులు యాళ్ల సుబ్బారావు, మండల వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు పాటుస్థానిక రైతులు కార్యకర్తలతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లోని తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు వలన తడిసిన ధాన్యం రాశులను, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రాజేష్ కుమార్, తాసిల్దార్ శ్రీనివాస్, ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం డైరెక్టర్ ,మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, వలసపాకల సర్పంచ్ వాసంశెట్టి రామారావు, బండే తాతాజీ , వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
Prev Post