Andhra Pradesh:ఎమ్మెల్సీ  అనంతబాబుకు ఉచ్చు

Trap for MLC Anantha Babu

Andhra Pradesh:త‌న ద‌గ్గ‌ర కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న ద‌ళిత కారు డ్రైవ‌ర్ వీధి సుబ్ర‌హ్మ‌ణ్యం ను హ‌త్య చేసి ఆపై డోర్ డెలివ‌రీ చేసిన సంఘ‌ట‌న పై ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించింది.. దీనిపై త‌మకు ఇంకా స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేదంటూ మృతుడి కుటుంబికులు ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబును క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే దీనిపై న్యాయ విచార‌ణ చేప‌ట్టి న్యాయం చేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

ఎమ్మెల్సీ  అనంతబాబుకు ఉచ్చు

కాకినాడ. ఏప్రిల్ 21
త‌న ద‌గ్గ‌ర కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న ద‌ళిత కారు డ్రైవ‌ర్ వీధి సుబ్ర‌హ్మ‌ణ్యం ను హ‌త్య చేసి ఆపై డోర్ డెలివ‌రీ చేసిన సంఘ‌ట‌న పై ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించింది.. దీనిపై త‌మకు ఇంకా స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేదంటూ మృతుడి కుటుంబికులు ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబును క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే దీనిపై న్యాయ విచార‌ణ చేప‌ట్టి న్యాయం చేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్ప‌డు ఏపీ ప్ర‌భుత్వం ఈ సంఘ‌ట‌న‌పై న్యాయ విచార‌ణ‌కు ఆదేశించింది.. కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం రంప‌చోడ‌వ‌రంకు చెందిన వైసీసీ ఎమ్మెల్సీ అనంత‌బాబు ద‌గ్గ‌ర కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసేవాడు.. చాలా కాలంగా ప‌నిచేస్తున్న సుబ్ర‌హ్మ‌ణ్యం మానేశాడు.. ఇదిలా ఉంటే 2022 మే 19న ఇంటి నుంచి వెళ్లిన సుబ్ర‌హ్మ‌ణ్యం తిరిగి రాలేదు. అయితే తెల్ల‌వారు జామున ఓ కారులో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి సుబ్ర‌హ్మ‌ణ్యం మృత‌దేహం తీసుకొచ్చి వ‌దిలి వెళ్లిపోయాడు.

ఈ సంఘ‌ట‌న అప్ప‌ట్లొ తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. ద‌ళిత సంఘాలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌కు దిగాయి.. అయితే వైసీపీ ప్ర‌భుత్వం నిందితున్ని కాపాడుతోంద‌ని ఆరోప‌ణ‌లు కూడా వెల్లువెత్తాయి.. ఈక్ర‌మంలోనే అత్యంత దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు పై కాకినాడ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పట్లో పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్ట‌కేల‌కు ఎమ్మెల్సీ అనంత‌బాబును అరెస్ట్‌చేసి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంత బాబు డోర్ డెలివరీ కేసులో న్యాయ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఈ న్యాయ విచారణలో ప్రాసిక్యూషన్ కు  సహాయం చేయడానికి ప్రత్యేక న్యాయవాదిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ మరియు మానవ హక్కుల రక్షణ కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ముప్పాళ్ళ సుబ్బారావును నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 538 ని విడుదల చేసింది.  దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ముప్పాళ్ళ సుబ్బారావు అండగా నిలిచారు. వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు నేనున్నానంటూ నిలబడ్డారు. ముప్పాళ్ళ సుబ్బారావు మడమతిప్పని పోరాటం వల్ల ఎమ్మెల్సీ అనంత బాబుకు స్థానిక న్యాయస్థానాల్లో బెయిల్ లభించలేదు. చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం అనంత బాబు బెయిల్ పై ఉన్నారు.

ద‌ళిత యువ‌కుడు వీధి సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో నిందితులు త‌ప్పించుకునే విధంగా పోలీసులు చార్చిషీట్ రూప‌క‌ల్ప‌న చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.. హ‌త్య సంఘ‌ట‌న అనంత‌రం 88 రోజుల‌కు దాఖ‌లు చేసిన చార్చిషీట్‌ను అప్ప‌ట్లో న్యాయ స్థానం తిర‌స్క‌రించింది. అందులో సాంకేతి ఆధారాలు, నిందితుల క‌ద‌లిక‌లు త‌దిత‌ర అంశాలు లేకుండా చార్జిషీట్‌లో లేక‌పోవ‌డ‌మే తిర‌స్క‌ర‌ణ‌కు కార‌ణ‌మ‌ని బాధితుల త‌ర‌పున వాదించిన న్యాయ‌వాది సుబ్బారావు వెల్ల‌డించారు. 2023 ఏ్ర‌పిల్ 14న అనుబంధ చార్జిషీట్‌ను వేశారు. గ‌డువులో దాఖ‌లు చేయ‌కుండా నిందితుడుకు బెయిల్ వచ్చేవిధంగా అప్ప‌టి ఎస్పీ, డీఎస్పీ ఆల‌స్యం చేశార‌ని విమ‌ర్శ‌లున్నాయి.. అప్ప‌ట్లో తానే హ‌త్య‌చేశాన‌ని విచార‌ణ‌లో ఎమ్మెల్సీ అనంత‌బాబు అంగీక‌రించిన‌ట్లు మీడియా స‌మావేశంలో ఎస్పీ వెల్ల‌డించారు కూడా.. చార్చిషీట్ ఆల‌స్యం వ‌ల్ల‌నే మ‌ద్యంత‌ర బెయిల్ వ‌చ్చింద‌ని ద‌ళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అయితే మృతుడి త‌ల్లితండ్ర‌లు నూకాల‌మ్మ‌,స‌త్య‌నారాయ‌ణ‌లు మాత్రం మూడేళ్లుగా న్యాయ‌పోరాటం చేస్తున్నారు. ఈ కేసును రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  బాధితులకు న్యాయం జరిగేలా విచారణకు ఆదేశిస్తారని భావిస్తూ వచ్చారు. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రత్యేక కౌన్సిల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక న్యాయవాదిగా మంచి ట్రాక్ రికార్డు కలిగిన ముప్పాళ్ళ సుబ్బారావును ఈ కేసులో సహాయం చేయడానికి ప్రత్యేక న్యాయవాదిగా నియమించడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్సీ అనంత బాబు కేసులో న్యాయం గెలుస్తుందన్న నమ్మకం ఇప్పుడు వీధి సుబ్రహ్మణ్యం కుటుంబంతో పాటు దళితుల్లోనూ కలుగుతోందంటున్నారు..

Read more:Andhra Pradesh:ఏపీలో స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు

Related posts

Leave a Comment