Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కాకినాడలో ఐకాస ధర్నా

0

కాకినాడ:పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరుతూ అమరావతి జె.ఎ.సి. అధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేసారు. ఈ సందర్భంగా ఎ.పి. జె.ఎ.సి. అమరావతి రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో ఉద్యోగస్తులకు ఎన్నో హామీలు ఇచ్చారని ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సి.పి.ఎస్.

రద్దు చేస్తామని అన్నారన్నారు. కానీ ఎక్కడ అమలు చేయలేదని వాపోయారు. 11వ పి.ఆర్.సి. ప్రతిపాదించిన స్కేల్సును బయటపెట్టాలని, పెండింగ్లో ఉన్న 4 డి.ఎ.ల అరియర్స్ను చెల్లించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి.త్రినాధ్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు పద్మనాభం, ఉద్యోగులు, పెన్షనర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie