న్యూ ఢిల్లీ:బిఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో వసంత్ విహార్ లో నిర్మిస్తున్న భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయ తుది దశ నిర్మాణ పనులను బుధవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.
కేసిఆర్ ఆలోచనల ప్రకారం బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్ పై మంత్రి నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేసారు. కార్యాలయ ఫర్నీచర్ పరిశీలించారు. అధినేత కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని మంత్రి వారికి స్పష్టం చేశారు.