ప్రతి నెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

telangana cabinet meeting

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి నెల రెండు సార్లు మంత్రివర్గ సమావేశాలు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు ప్రతి నెలలో రెండు సార్లు నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా ఆదేశాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఉండే ఆలస్యాన్ని తగ్గించి, పాలనను మరింత చురుకుగా, సమర్థంగా ముందుకు తీసుకెళ్లడమే ఈ చర్య వెనక ప్రధాన ఉద్దేశం అని తెలుస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ప్రతి నెలలో తొలి మరియు మూడవ శనివారాల్లో కేబినెట్ భేటీలు నిర్వహించనున్నాయి. ఇప్పటి వరకు ముఖ్యమైన అంశాలపైనే సమావేశాలు జరగగా, ఇప్పుడు వాటి సంఖ్య పెరగడం వల్ల ప్రజల సమస్యలపై వేగవంతంగా చర్చించి తక్షణ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడనుంది. ఈ కొత్త…

Read More

Hero Ajith Kumar : అజిత్ కుమార్ గ్యారేజ్‌లోకి అరుదైన మెక్‌లారెన్ సెన్నా హైపర్‌కార్ చేరిక

అజిత్ కుమార్ గ్యారేజ్‌లోకి అరుదైన మెక్‌లారెన్ సెన్నా హైపర్‌కార్ తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఉన్న అజిత్ కుమార్ తన ఖరీదైన కార్ల కలెక్షన్‌ను మరింత శక్తివంతంగా మార్చారు. లెజెండరీ ఫార్ములా వన్ డ్రైవర్ అయర్టన్ సెన్నా పేరు మీద రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాత మెక్‌లారెన్ సెన్నా హైపర్‌కార్‌ను ఆయన ఇటీవల సొంతం చేసుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లకు పరిమితమైన అత్యంత అరుదైన కార్లలో ఒకటి. అయర్టన్ సెన్నా పట్ల అజిత్‌కు గాఢమైన అభిమానం ఉండటం వల్లే ఈ కారు ఆయనకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ కారుపై సెన్నా సంతకంతో కూడిన మార్ల్‌బొరో లివరీ డిజైన్ కూడా ఉంది, ఇది కారుకు మరింత ప్రత్యేకతను కల్పిస్తోంది. అజిత్ స్వయంగా ప్రొఫెషనల్ రేస్ కార్ డ్రైవర్ కావడంతో, ఈ హైపర్‌కార్ ఆయన గ్యారేజ్‌లో గౌరవ స్థానాన్ని…

Read More

Konda Surekha : తెలంగాణ సచివాలయంలో అస్వస్థతకు గురైన మంత్రి కొండా సురేఖ

konda surekha

తెలంగాణ సచివాలయంలో మంత్రి కొండా సురేఖకు అస్వస్థత తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం ఉదయం ఒక అప్రమత్త క్షణం చోటు చేసుకుంది. అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ slight అస్వస్థతకు గురై, కేబినెట్ సమావేశం ప్రారంభానికి ముందు అకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. ఈ ఘటనతో సచివాలయం వర్గాల్లో కొంత కలకలం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, మంత్రి కొండా సురేఖ ఉదయం నుంచి ఏ విధమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమెకు అస్వస్థత కలిగినట్లు తెలిసింది. సచివాలయంలోని తన ఛాంబర్ వద్దకు వెళ్తుండగా ఆమె అకస్మాత్తుగా మూర్ఛ వెళ్లిపోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె రక్తంలో చక్కెర స్థాయిలు (షుగర్ లెవెల్) మించాయని తెలిసింది. వెంటనే ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పందించి ప్రథమ చికిత్సను అందించారు. ఆహారం అందించి కొద్దిసేపటిలోనే ఆమె స్వల్పంగా…

Read More

Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం

chenab bridge

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన – చీనాబ్ రైల్వే వంతెన–ను ప్రజలకు అంకితం చేశారు. ఈ నిర్మాణం ద్వారా కశ్మీర్ లోయ, దేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా కలవడం ప్రారంభమైంది. ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టులో అత్యంత ప్రాముఖ్యమైన భాగంగా నిలిచింది. ఈ ఉదయం ప్రధాని మోదీ ఉధంపూర్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకొని అక్కడి నుంచి చీనాబ్ వంతెన వద్దకు ప్రయాణించారు. అక్కడ ఆయన ఈ శిల్పకళా అద్భుతాన్ని అధికారికంగా ప్రారంభించారు. గత ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సరిహద్దును దాటి ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించిన తర్వాత ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో తొలిసారి పర్యటించడం విశేషం. చీనాబ్ నదిపై నిర్మితమైన ఈ…

Read More

AP News : గిర్‌ అభయారణ్యంలో పర్యటించిన ప్రధాని మోదీ

10 for obesity control Nominated Prime Minister

 . గిర్‌ అభయారణ్యంలో పర్యటించిన ప్రధాని మోదీ   గాంధీనగర్, మార్చి 3, ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో పర్యటించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సం సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటన అనంతరం ప్రధాని జునాగఢలోని ససాన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో పాల్గొంటారు.గిర్‌ అభయారణ్యంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ స్వయంగా కెమెరాతో అక్కడున్న సింహాలను ఫొటోలు తీయడం విశేషం. ప్రధాని మోదీకి వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫీ అంటే ఇష్టం అనే విషయం తెలిసిందే. గతంలో పలు సందర్భాల్లో కూడా మోదీ కెమెరాతో వన్యప్రాణుల ఫొటోలు క్లిక్‌మనిపించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జునాగఢ్‌ జిల్లాలోని న్యూ పిపాలియా వద్ద 20.24 హెక్టార్లలో నేషనల్‌ రెఫరల్‌ సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌ లైప్ హెల్త్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర…

Read More

Amaravathi : త్వరలోనే మెగా డిఎస్సీ

AP DSC 2024 Notification

 . త్వరలోనే మెగా డిఎస్సీ   అమరావతి, మార్చి 3, (న్యూస్ పల్స్) నారా లోకేష్ తెలిపారు. ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసిపి సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ (సంతనూతలపాడు), ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (రాజంపేట), రేగం మత్స్యలింగం (అరకు), బి.విరూపాక్షి (ఆలూరు) పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని లోకేష్ అన్నారు. గత 30 ఏళ్లలో టిడిపి ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేశామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో సైతం 2014-19 కాలంలో చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వంలో సైతం 2014, 18, 19లలో మూడు…

Read More

Vishakapatnam : మేధావులు ప్రవేశపెట్టిన బడ్జెట్

new budget has begun

 . మేధావులు ప్రవేశపెట్టిన బడ్జెట్ విశాఖపట్నం వైసిపి ప్రభుత్వం ఫ్యాక్ష నిస్టుల బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం మేధావులు బడ్జెట్ ప్రవేశ పెట్టిందని రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ టీడీపీ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు. బడ్జెట్ లో విశాఖ కు 12 నుంచి 14 వందల కోట్లు కేటాయించారని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 2025-26 బడ్జెట్ ను ప్రేవేశపెట్టా రని చెప్పారు.2026వ సంవత్సరం చివరికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని,జగన్ గత ఐదేళ్లలో అభివృద్ధి ప్రక్కనపెట్టి కేవలం బట్టన్ నొక్కడనికే పరిమితం అయ్యారని ఎద్దేవ చేశారు. డబల్ ఇంజన్ సర్కా ర్ తో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని, విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. బడ్జెట్ కేటాయింపులు పై మాజీ మంత్రి…

Read More

Hyderabadh : నీటి పారుదల శాఖ మంత్రి  కి హరీష్ రావు ఫోన్

will harish rao lead a gulabi party

 . నీటి పారుదల శాఖ మంత్రి  కి హరీష్ రావు ఫోన్   హైదరాబాద్ ఎండిపోతున్న పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలి మిడ్ మానేరు నుండి 1 టి ఎం సీల నీటిని రంగనాయక సాగర్ లోకి ఎత్తి పోయండి. యాసంగి పంట పూర్తి అయ్యేంత వరకు పంట పొలాలకు సాగు నీటిని అందించాలి. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో ఫోన్ లో కోరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం లో పంట పొలాలకు సాగునీళ్లు అందుక పంట పొలాలు ఎండి పోతున్నాయని మిడ్ మానేరు నుండి రంగనాయక సాగర్ లోకి నీటిని ఎత్తి పోయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు…

Read More

Hyderabadh : దాడులు చేసిన వారి చిట్టాను పింకు బుక్‌లో రాసుకుంటాం

BRS MLC Kalvakuntla Kavitha

 . దాడులు చేసిన వారి చిట్టాను పింకు బుక్‌లో రాసుకుంటాం: . కవిత హెచ్చరిక   హైదరాబాద్ సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తామన్న కవిత సింగోటం ఆలయానికి కేసీఆర్ రూ.17 కోట్లు మంజూరు చేశారన్న కవిత. ఆ నిధులను జూపల్లి కృష్ణారావు రద్దు చేశారని ఆరోపణ, తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేసిన వారి చిట్టా పింకు బుక్‌లో రాసు కుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమకు సమయం వచ్చినప్పుడు వారి సంగతిని తేలుస్తామని ఆమె హెచ్చరించారు. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ, సింగోటం లింగాకార లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కోసం గతంలో కేసీఆర్ రూ.17 కోట్లు మంజూరు చేస్తే, ఆ నిధులను జూపల్లి కృష్ణారావు…

Read More

TS Inter exams : ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి.

Board of Intermediate Education

 .  ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి.   జయశంకర్ భూపాలపల్లి, ఇంటర్ మీడియట్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటర్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు, ఎల్ ఆర్ ఎస్ పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయు అంశాలపై శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రెవెన్యూ, ఇంటర్, పంచాయతి రాజ్, మున్సిపల్, విద్యుత్, మున్సిపల్, ఆర్టీసీ, వైద్య, శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఈ నెల 5వ తేదీ నుండి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు నిర్వహణకు 8 కేంద్రాలు ఏర్పాటు…

Read More