తిరుమలలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం తిరుమల, Gokulashtami Asthanam on 27th August and Utlotsavam on 28th in Tirumala తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 27వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. ఆగస్టు 28న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై,…
Read MoreCategory: ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh
Bharti as party mouthpiece…? | పార్టీ మౌత్ పీస్ గా భారతి…? | Eeroju news
పార్టీ మౌత్ పీస్ గా భారతి…? కడప, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) Bharti as party mouthpiece…? ఏపీ రాజకీయాల్లో రెండురోజులుగా ఓ వార్త తెగ హంగామా చేస్తోంది. అది వైసీపీ పార్టీ గురించే. ఇంతకీ దాని సారాంశం ఏంటంటే.. పార్టీ పగ్గాలు భారతి చేతుల్లోకి వెళ్లబోతోందనేది అసలు వార్త. దీనిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రకరకాలుగా చర్చించుకోవడం మొదలైంది. ఇది కలా.. నిజమా అన్న చర్చ లేకపోలేదు.అధికారం పోయిన తర్వాత గడిచి రెండునెలల్లో ఐదుసార్లు బెంగుళూరు వెళ్లారు వైసీపీ అధినేత జగన్. ఎందుకు వెళ్లారన్నది పక్కనబెడితే.. మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారీ ఆయన తర్జనభర్జన పడుతున్నారు. ఏ విషయంపైనా క్లారిటీ ఇవ్వలేదు. మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.జగన్ వ్యవహారశైలిని గమనించిన ఆ పార్టీకి చెందిన నేతలు అధినేత ఇలా వ్యవహరిస్తున్నారేంటి అని…
Read MoreVasudeva Reddy investigation going on in secret area | రహస్య ప్రాంతంలో కొనసాగుతున్న వాసుదేవరెడ్డి విచారణ… | Eeroju news
రహస్య ప్రాంతంలో కొనసాగుతున్న వాసుదేవరెడ్డి విచారణ… విజయవాడ, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) Vasudeva Reddy investigation going on in secret area కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఇటీవల ఏపీలో అరెస్టుల పర్వం మొదలైంది. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. తాజాగా ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఐడీ అధికారులు వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారని సమాచారం. ఏపీలో మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఓ అజ్ఞాత ప్రాంతంలో ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం విక్రయాల విషయంపై వాసుదేవరెడిపై భారీ అభియోగాలు నమోదయ్యాయి. వైసీపీ హయాంలో సీఎం వైఎస్ జగన్…
Read MoreMock polling in 12 EVMs for 4 days | 4 రోజుల పాటు 12 ఈవీఎంలలో మాక్ పోలింగ్… | Eeroju news
4 రోజుల పాటు 12 ఈవీఎంలలో మాక్ పోలింగ్… ఒంగోలు, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) Mock polling in 12 EVMs for 4 days ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు దాటినా ఇంకా రిజల్ట్స్పై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఆ పార్టీ నేతలు ఇలాంటి స్టోరీలను షేర్ చేస్తుంటే… ఆ పార్టీని సపోర్ట్ చేసే మీడియాలో ఇలాంటి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్న వ్యవహారం మరో ఎత్తు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు స్థానం నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన ఫలితాలపై అనుమానపడుతున్నారు. ఈవీఎంలలో ఏదో జరిగిందన్న ఆయన డౌట్స్ క్లియర్ చేయాలని ఎన్నికల సంఘానికి అభ్యర్థన పెట్టుకున్నారు. ఆయన…
Read MoreAgrigold trees destroyed in Anantapur | అనంతపురంలో అగ్రిగోల్డ్ చెట్లు మాయం… | Eeroju news
అనంతపురంలో అగ్రిగోల్డ్ చెట్లు మాయం… అనంతపురం, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) Agrigold trees destroyed in Anantapur వందలు వేలు కాదు, ఏకంగా కోట్ల ఖరీదు చేసే విలువైన వృక్ష సంపదకు రెక్కలొచ్చాయి. దాదాపు పదేళ్లుగా ఆలనపాలన లేకపోవడంతో కొందరు అక్రమార్కులకు కన్ను కుట్టింది. గుట్టు చప్పుడు కాకుండా వందల ఎకరాల్లో చెట్లను మాయం చేసేశారు. అసలు ఎక్కడ ఎంత సంపద ఉందో కూడా తెలియకుండా రికార్డులు తారుమారు చేసేశారనే ఆరోపణలు ఉన్నాయి.అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్, సీఐడీ స్వాధీనంలో ఉన్న ఫ్యాక్టరీలో యంత్రపరికరాల చోరీ విషయం మరువక ముందే కోట్ల రుపాయల విలువైన వృక్షాలు మాయమైన వ్యవహారం వెలుగు చూసింది. 2015లో అగ్రిగోల్డ్ అక్రమాలపై ఏలూరులో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒడిశా, అండమాన్ వంటి రాష్ట్రాల్లో…
Read MoreThalli Devena, which will decrease with the RTI Act, begins | ఆర్టీఐ చట్టంతో తగ్గనున్న తల్లిదీవెన ప్రారంభం | Eeroju news
ఆర్టీఐ చట్టంతో తగ్గనున్న తల్లిదీవెన ప్రారంభం విజయవాడ, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) Thalli Devena, which will decrease with the RTI Act, begins అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపుతో పాటు డిఎస్సీ నియామకాల వంటి హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చినా ఆర్దిక అంశాలతో ముడిపడిన హామీలపై మాత్రం రెండున్నర నెలలుగా మదనపడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం ప్రధాన హామీగా ఉంది. అమ్మఒడి స్థానంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేల చొప్పున చెల్లిస్తామని టీడీపీ మిత్రపక్షాల తరపున హామీ ఇచ్చారు. ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమ్మఒడి పథకానికి ప్రాధాన్యత ఇచ్చింది. తొలి ఏడాది విద్యార్థుల తరపున తల్లుల ఖాతాలకు రూ.15వేలు జమ…
Read MoreGreetings from Chief Minister Chandrababu on the occasion of World Photography | వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు | Eeroju news
వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు కెమేరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టును ఫోటోలు తీసిన సీఎం గుంటూరు Greetings from Chief Minister Chandrababu on the occasion of World Photography వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమేరాను తీసుకుని స్వయంగా సిఎం ఫోటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఈ రంగంలో ప్రతిభ చూపుతున్న వారిని అభినందించారు. నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని సిఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో…
Read MoreThe stage is set for Roja’s arrest | రోజా అరెస్ట్ కు రంగం సిద్ధం | Eeroju news
రోజా అరెస్ట్ కు రంగం సిద్ధం తిరుపతి, ఆగస్టు 19 (న్యూస్ పల్స్) The stage is set for Roja’s arrest నాటి నటి.. నిన్నటి ఎమ్మెల్యే.. నేడు మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఆడుదాం ఆంధ్రా క్రీడలు ఉచ్చు బిగిస్తుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. అసలు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఆమెపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు కమ్ముకుంటున్నాయి.మాజీమంత్రి రోజా అనగానే గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో అప్పటి ఎమ్మెల్యే, మంత్రీ రోజా మాటలు తూటాలుగా పేలేవి.. ఆమె పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ సహా ఎవరి గురించి మాట్లాడినా సోషల్ మీడియా లో వైరల్ గా మారేది. ఇక జనసైనికుల నుంచి…
Read MoreChinni as president of Andhra Cricket Association | ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్ని | Eeroju news
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్ని విజయవాడ, ఆగస్టు 19 (న్యూస్ పల్స్) Chinni as president of Andhra Cricket Association ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన అధ్యక్షుడిగా టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెల 8న విడుదల కానుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులచేతుల్లోనే ఏసీఏ ఉండేది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరంతా తమ పదవులకు రాజీనామా చేశారు. విజయవాడలో ఈ నెల 4న జరిగిన సర్వసభ్య సమావేశంలో వీరి రాజీనామాలను ఆమోదించారు. కొత్త కార్యవర్గం కోసం కసరత్తు ప్రారంభమైంది. అధ్యక్షుడితోపాటు అపెక్స్ కౌన్సిల్లోని ఆరు పదవులకు శుక్రవారం విశాఖ స్టేడియంలో నామినేషన్లు స్వీకరించారు.…
Read MoreIPSs in long leave thinking | లాంగ్ లీవ్ ఆలోచనలో ఐపీఎస్ లు | Eeroju news
లాంగ్ లీవ్ ఆలోచనలో ఐపీఎస్ లు విజయవాడ,ఆగస్టు 19 (న్యూస్ పల్స్) IPSs in long leave thinking పని లేని శిక్ష.. ఏపీలో 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లకు కలవరం పుట్టిస్తోందట…. ఇన్నాళ్లు వెయిటింగ్లో పెట్టినా చింతించని ఐపీఎస్లు… రోజూ ఆఫీసుకు రావాలని జారీ చేసిన మెమోతో తల పట్టుకుంటున్నారు… పనిలేకుండా ఖాళీగా కూర్చోలేమంటూ సెలవు తీసుకునేందుకు రెడీ అవుతున్నారట… కానీ, ప్రభుత్వం ఐపీఎస్ల పట్ల కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోందట.పనిఉన్నా, లేకపోయినా, రోజా ఆఫీసుకు రావాల్సిందే.. హాజరు వేసుకోవాల్సిందేనంటూ ఖరాకండీగా చెప్పేస్తుందట… దీంతో ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట ఐపీఎస్లు. ఎక్కువ మంది దీర్ఘకాలిక సెలవు కోసం దరఖాస్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఐపీఎస్లకు సెలవు ఇస్తుందా? లేదా? అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది. వైసీపీ హయాంలో జరిగిన…
Read More