AP : ఆంధ్రప్రదేశ్ లోని ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఓ సైనికురాలు

A Soldier's Success Story: From Border to Blackboard

రోజా విజయగాథ: సైనికురాలి నుంచి ఉపాధ్యాయురాలిగా సరిహద్దులో సైనికురాలు, తరగతి గదిలో టీచర్ చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమానుపల్లెకు చెందిన రోజా, ఒక అసాధారణమైన మహిళ. సైనికురాలిగా దేశ సరిహద్దుల్లో సేవలు అందిస్తూనే, ఆమె తన కల అయిన ఉపాధ్యాయ వృత్తిని సాధించారు. 2018లో ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యే అవకాశం కోల్పోయినప్పటికీ, ఆమె నిరాశ చెందలేదు. బదులుగా, 2022లో ఆమె బీఎస్‌ఎఫ్‌ జవానుగా ఎంపికై, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో విధి నిర్వహణలో ఉన్నప్పటికీ, ఆమె తన ఉపాధ్యాయ కలని మర్చిపోలేదు. ఖాళీ సమయాల్లో డీఎస్సీకి సిద్ధమై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో 83.16 మార్కులతో విజయం సాధించారు. దేశానికి సేవ చేస్తూనే, ఉపాధ్యాయురాలిగా తన లక్ష్యాన్ని చేరుకున్న రోజా ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. Read also : RamMohanNaidu : సామాన్యులకు చేరువైన…

Read More

Tirupati : తిరుపతిలో మహిళా ఆటో డ్రైవర్లు: సరికొత్త ప్రస్థానం

Women Auto Drivers in Tirupati: A New Journey of Empowerment

తిరుపతిలో ఆటోలు నడుపుతూ ఉపాధి పొందుతున్న మహిళలు కష్టాలను ఎదుర్కొని స్వయం ఉపాధితో ఆదర్శంగా నిలుస్తున్న వైనం రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ కలియుగ దైవం కొలువై ఉన్న తిరుపతిలో ఇప్పుడు కొత్త స్ఫూర్తి పవనాలు వీస్తున్నాయి. జీవితంలో ఎదురైన కష్టాలకు కుంగిపోకుండా, కొందరు మహిళలు ఆటో స్టీరింగ్‌ను పట్టి తమ జీవితాలకు కొత్త దారి వేసుకుంటున్నారు. మగవారికి మాత్రమే పరిమితం అనుకున్న రంగంలోకి అడుగుపెట్టి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టాల నుంచి వచ్చిన ఆలోచన కొందరు మహిళల జీవితాలు అనూహ్యమైన కష్టాలతో సతమతమయ్యాయి. భర్త చనిపోవడం, ఉన్న ఉద్యోగం కోల్పోవడం వంటి సంఘటనలు వారిని ఆర్థికంగా, మానసికంగా కుంగదీశాయి. ఏం చేయాలో తెలియని స్థితిలో వారికి రాస్ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ ఒక ఆశాకిరణంలా కనిపించింది.…

Read More

AP : మహిళా ఆరోగ్యమే కుటుంబానికి బలమైన పునాది

That's why women's health is the top priority'

విశాఖలో ‘స్వస్త్ నారీ’ కార్యక్రమం… హాజరైన నిర్మలా సీతారామన్, చంద్రబాబు హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశే మా నినాదం అన్న చంద్రబాబు  ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ‘స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, ఆ తరువాత రాష్ట్రం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ‘స్వస్త్ నారీ-సశక్త్ పరివార్’ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 13,944 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య…

Read More

NaraLokesh : రాష్ట్రాభివృద్ధికి మూడు కీలక అంశాలు: లండన్‌లో మంత్రి లోకేశ్

Quantum Valley & Data City to Transform Andhra Pradesh: Nara Lokesh

క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీలతో రాష్ట్ర రూపురేఖల మార్పు ఖాయం ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశాలు పరిశ్రమల ఏర్పాటుకు అవరోధంగా ఉన్న నిబంధనల సరళీకరణ ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార నిర్వహణ వేగాన్ని (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కేవలం మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపిస్తున్నామని, దీనికి నిదర్శనంగానే గడిచిన 15 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు సాధించగలిగామని రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘భాగస్వామ్య సదస్సు – 2025’కు ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు లండన్‌లో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ – యూకే బిజినెస్ ఫోరం’ రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.…

Read More

AP : రాజధాని అమరావతిలో కేబుల్ వంతెన నిర్మాణం – ఒక కొత్త శకం!

New Cable Bridge to Cut Travel Time from NH 65 to Amaravati

ఐకానిక్ వంతెన డిజైన్ ను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు ఓటింగ్ లో ఎక్కువ మంది మొగ్గుచూపిన డిజైన్ ను ఖరారు చేసిన సీఎం కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ కు అత్యధిక ఓట్లు రాజధాని అమరావతిలో నిర్మించనున్న కేబుల్ వంతెన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. అత్యాధునిక సాంకేతికతతో, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సుమారు రూ. 2,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నమూనాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఖరారు చేశారు. ఈ వంతెన నమూనా ఎంపిక కోసం గతంలో సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ప్రజా ఓటింగ్‌ నిర్వహించగా, అత్యధిక ఓట్లు సాధించిన రెండో నమూనాను ఫైనల్ చేశారు. కూచిపూడి నృత్య భంగిమలో డిజైన్ ఈ వంతెన కూచిపూడి నృత్యంలోని ‘స్వస్తిక హస్త’ ముద్రను పోలి ఉండటం ఒక ప్రధాన…

Read More

YS Viveka case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు – సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదిక

supreme court

వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ తదుపరి దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామన్న సీబీఐ కోర్టు ఆదేశిస్తే ముందుకెళతామని స్పష్టం చేసిన దర్యాప్తు సంస్థ దర్యాప్తు కొనసాగించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు కేసులో తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పిటిషనర్లు కోరినట్లుగా విచారణను ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేనప్పటికీ, దానిపై కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. మంగళవారం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫున సీనియర్…

Read More

Polvaram Project : పోలవరం ప్రాజెక్టు పనులకు గడువు 2027 జులై

Polavaram

గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారన్న సాయి ప్రసాద్ నీటి సంరక్షణ చర్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన  కేంద్ర ప్రభుత్వ నిధులతో 38,457 చిన్న నీటి పారుదల చెరువుల అభివృద్ధికి సంకల్పించామని వెల్లడి పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అయితే, గోదావరి పుష్కరాలు జరగబోయే జులై 2027 నాటికే ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలనే దిశగా వేగంగా పనులు జరుగుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తెలిపారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సూచన మేరకు డిసెంబరు 2027 కంటే ముందే, అంటే పుష్కరాల నాటికే పనులు పూర్తి చేయాలని…

Read More

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu is coming to Delhi is making the hearts of Union ministers start pounding.

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కీలక ప్రకటన చేసిన సీఎం  కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రైతులకు ప్రోత్సాాహకంగా ఇస్తామన్న చంద్రబాబు రబీ సీజన్ లో అధార్ అనుసంధానంతో ఇంటి వద్దకే ఎరువులు పంపిణీ  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు ముఖ్య ప్రకటన చేశారు. యూరియా వినియోగాన్ని తగ్గించే రైతులు, కౌలు రైతులకు బస్తా కొకటికి రూ.800 చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర జీఎస్‌డీపీపై సమీక్ష నిర్వహించిన సీఎం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. యూరియా విక్రయాల నిర్వహణ సక్రమంగా జరిగి ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు. ఎరువుల శాఖలో సరైన…

Read More

AP : మెగా డీఎస్సీ 2025: తుది జాబితా విడుదల, 16 వేల మందికి ఉద్యోగాలు.

Latest Update on DSC Appointments.

మొత్తం 16,347 పోస్టులకు గాను 16 వేల మంది ఎంపిక అభ్యర్థులు లేక 300కు పైగా పోస్టులు మిగిలిపోయిన వైనం ఈ నెల 19న అమరావతిలో భారీ సభ, నియామక పత్రాల పంపిణీ మెగా డీఎస్సీ-2025 అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజుతో తెరపడింది. పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలు జిల్లాల కలెక్టర్, డీఈఓ కార్యాలయాల్లో, అలాగే అధికారిక వెబ్‌సైట్ cse.apcfss.inలో అందుబాటులో ఉన్నాయి. ముఖ్య వివరాలు: పోస్టుల భర్తీ: మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, దాదాపు 16,000 పోస్టులను భర్తీ చేయగలిగారు. ఖాళీలు: వివిధ సామాజిక వర్గాలు, మేనేజ్‌మెంట్లలో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 300కు పైగా పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. వీటిని తదుపరి డీఎస్సీలో భర్తీ చేస్తారు. నియామక పత్రాల అందజేత:…

Read More

Vijayawada : ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలు: రూ. 4 కోట్ల టెండర్లు ఖరారు

ndrakeeladri Dasara Celebrations: Durga Temple Spends ₹4 Crores on Arrangements

కొండ కింద రూ.2.54 కోట్లు, కొండపైన రూ.1.50 కోట్ల పనులు మంచినీరు, టాయిలెట్ల బాధ్యతలు విజయవాడ కార్పొరేషన్‌కు అంచనా కన్నా ఎక్కువ ధరకు ఖరారైన సీసీటీవీల టెండర్ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల కోసం కనకదుర్గమ్మ ఆలయ అధికారులు సన్నాహాలను వేగవంతం చేశారు. ఈ నెల 22 నుంచి జరగనున్న ఈ ఉత్సవాలకు సుమారు రూ.4 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారు చేసి, కాంట్రాక్టర్లకు అప్పగించారు. కొండ దిగువన రూ.2.54 కోట్లు, కొండపైన రూ.1.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే, ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, చాలా పనులు తాత్కాలికంగానే ఉండటంతో వ్యయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక పనులకు భారీ వ్యయం దసరా ఉత్సవాల కోసం కొండ దిగువన తాత్కాలిక క్యూ లైన్లు, వాటర్ ప్రూఫ్ షామియానాలు, స్నానఘట్టాల వద్ద షెడ్లు, విద్యుత్ అలంకరణ, మైక్ సెట్ల…

Read More