సోషల్ వార్ కు రెఢీ.. ఒంగోలు, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Social War వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. పక్కా వ్యూహంతోనే అడుగులు ముందుకు వేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలతో పాటు సోసల్ మీడియా విషయంలోనూ ఆయన చాలాదూకుడుగా ఉండాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఎన్నికలు అయిపోయి.. నాలుగు మాసాలు గడిచాయి. ఈ నాలుగు మాసాల కాలంలో పార్టీ నేతలు ఎలా ఉన్నా..ఇప్పటి నుంచి మాత్రం పక్కాగా ఉండాలని జగన్ సూచించారు. జమిలి ఎన్నికలు వస్తే..ఎప్పుడైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.అయితే.. మరీ ముఖ్యంగా, ప్రజలే కాకుండా.. సోషల్ మీడియాపై కన్నేయాలని పార్టీ కేడర్ సహా నాయకులకు సూచించారు. కేవలం మీడియా మీటింగులు, సభలు సమావేశాలే కాకుండా.. ప్రజల మధ్య ఉండడం తో పాటు సోషల్ మీడియాతోనూ సమరం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ పరంగా కూడా…
Read MoreTag: AP News
Sarada Peetham | శారద పీఠానికి షాక్… | Eeroju news
శారద పీఠానికి షాక్… హైదరాబాద్ కు మకాం మార్చేసిన స్వరూపనంద విశాఖపట్టణం, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Sarada Peetham విశాఖ శారదా పీఠానికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైసిపి ప్రభుత్వం కేటాయించిన స్థల అనుమతిని రద్దు చేసింది. చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. వైసిపి హయాంలో శారదా పీఠం కళకళలాడింది. పీఠాధిపతి స్వామి స్వరూపానంద కు ఎనలేని ప్రాధాన్యత లభించేది. ఆయన సిఫారసులకు జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చేది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే స్వరూపానంద చేసిన యాగాలతోనే జగన్ కు అధికారం దక్కిందన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. దీంతో వైసీపీ నేతల తాకిడి పీఠానికి పెరిగింది. ఏటా జరిగే పీఠం వార్షికోత్సవాలకు, పర్వదినాలకు విశాఖ శారదా పీఠానికి…
Read MoreChandra Babu.. Narendra Modi & Pawan Kalyan | చంద్రబాబు.. పవన్ కు మోదీ నిర్దేశం.. | Eeroju news
చంద్రబాబు.. పవన్ కు మోదీ నిర్దేశం.. కాకినాడ, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Chandra Babu.. Narendra Modi & Pawan Kalyan దేశంలో ఒకే ఒక్క ఎన్నికలు తేవాలన్నది మోడీ టార్గెట్. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టిన మోడీ.. ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకు వ్యతిరేక కూటమి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఎన్డీఏ భాగస్వామి పక్షాలు మాత్రం ఆహ్వానిస్తున్నాయి. మోడీ అనుకున్నట్టు జరిగితే ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారనున్నాయిఏపీలో కూటమి నేతల స్వరం మారుతోంది. వారి నోట ఎన్నికల మాట వినిపిస్తోంది.కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ.. ఏపీలో కూటమి పార్టీల నేతలు సైతం అందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. తిరుగులేని విజయం సాధించింది. 175 అసెంబ్లీ సీట్లకు గాను.. ఏకంగా 164 స్థానాలతో సత్తా…
Read MoreRailway | రైలు బస్సు కావాలంటున్న కోనసీమ వాసులు | Eeroju news
రైలు బస్సు కావాలంటున్న కోనసీమ వాసులు కాకినాడ, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Railway దేశంలోని అన్ని రాష్ట్రాలు టూరిజం పరంగా ఎలాంటి క్రొత్త కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తుంటే ఏపీలో మాత్రం చేతిలో ఉన్న ఒక గొప్ప అవకాశాన్ని రైల్వే పక్కన పెట్టేస్తుంది. అదే ” రైలు బస్సు”. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడా లేని అరుదైన ” రైలు బస్సు” నిన్న మొన్నటి వరకూ ఏపీలో తిరిగేది. అయితే కరోనా పేరు చెప్పి దానిని రద్దు చేసింది డిపార్ట్మెంట్.కోనసీమకు రైలు తేవాలని దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి చేసిన కృషి ఫలితంగా కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ రైల్వే లైన్ ఏర్పడింది. అక్కడి నుంచి గోదావరి మీదుగా బ్రిడ్జి నిర్మించి నర్సాపూర్కు లింక్ ఏర్పాటు చేస్తే కోనసీమకు రైల్వే లైన్ వచ్చేసినట్టే. అయితే…
Read MoreVizianagaram | విజయనగరం జిల్లాలో డయేరియా విలయ తాండవం | Eeroju news
విజయనగరం జిల్లాలో డయేరియా విలయ తాండవం విజయనగరం, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Vizianagaram విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా విలయ తాండవం చేస్తుంది. వాంతులు, విరోచనాలతో నాలుగు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. డయోరియాను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. గుర్ల మండలంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి డయోరియాను అదుపు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇరవై రెండు మంది రోగులు జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్ కు తరలించారు. రోగులు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు వైద్యాధికారులు గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య…
Read MoreAP Budget | బడ్జెట్ ఎప్పుడు… | Eeroju news
బడ్జెట్ ఎప్పుడు… విజయవాడ, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) AP Budget ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయ అంచనాలు ప్రతి ఏడాది మార్చిలోనే అసెంబ్లీలో పెడతారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలోనే ఆ పని చేస్తుంది. అందులో రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, ఇతర వివరాలు చూసుకుని పద్దు రెడీ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది బడ్జెట్ లేకుండానే నడిచిపోతోంది. ఎన్నికల కారణంగా జగన్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ పెట్టింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ నాలుగు నెలలైనా ఆర్థిక పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియడం లేదని ఇంకా బడ్జెట్ పెట్టలేదు. దీనిపై వైఎస్ఆర్సీపీ విమర్శలు గుప్పిస్తోంది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటాన్ అకౌంట్.. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పద్దులు నిర్వహిస్తున్నారు. జూన్లో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కాస్త…
Read MoreTeachers | టీచర్లకు వరుస గుడ్ న్యూస్ లు | Eeroju news
టీచర్లకు వరుస గుడ్ న్యూస్ లు విజయవాడ, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Teachers ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ టీచర్లకు ముఖ్యమైన గమనిక. ఎస్సీఈఆర్టీ (రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి)లో డిప్యుటేషన్పై పనిచేసే పోస్టులకు దరఖాస్తు చేసేందుకు పురపాలక ఉపాధ్యాయులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.ఈ పోస్టులకు సంబంధించి.. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లోని వారికే మొదట అవకాశం కల్పించారు. ఇటు పురపాలక టీచర్లకూ డిప్యుటేషన్ ఇవ్వాలని విన్నవించడంతో.. ఈ మేరకు వారికి కూడా అనుమతి ఇచ్చారు. విద్యా శాఖ ఎస్సీఈఆర్టీలో 34 పోస్టులను డిప్యుటేషన్పై భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.. ఈనెల 25లోపు ఆన్లైన్లో దరఖాస్తుల్ని సమర్పించాలి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్ని 28వ తేదీ నుంచి…
Read MoreSrikakulam | ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు | Eeroju news
ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు శ్రీకాకుళం, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Srikakulam శ్రీకాకుళంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కారులో నుంచి లాక్కొచ్చి కొందరు వ్యక్తులు చితక్కొట్టారు. ఏంటని ఆరా తీస్తే… కారు ర్యాష్గా డ్రైవ్ చేసి ముగ్గురు వ్యక్తులను గాయపరిచాడని చెప్పారు. కారు ఆపకుండా వచ్చేశాడని అన్నారు. ఇంతలో పోలీసులు వచ్చి ఆ కారు డ్రైవర్ను స్టేషన్కు తరలించారు. ఇదంతా విన్న వాళ్లకు, చూసిన వాళ్లకు ప్రమాదం, అనంతరం జరిగిన ఘటనగా అనుకుంటారు. అయితే కేసు మూలాల్లోకి వెళ్తే తప్ప అసలు కథ ఏంటో ఎవరికీ తెలియదు. దీని వెనుక ఇసుక వివాదం ఉందని చాలా మందికి అర్థం కాదు. శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్య కాలంలో పలు ప్రాంతాల్లో అక్రమంగా దాచి ఉంచిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు ఇప్పుడు ఈ వివాదానికి ఈ…
Read MoreThalli Vandanam | జనవరి నుంచి తల్లి వందనం | Eeroju news
జనవరి నుంచి తల్లి వందనం నెల్లూరు, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Thalli Vandanam ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులు క్రమంగా కొలిక్కి వస్తున్న వేళ ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా ఇప్పటికే డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. సామాజిక పింఛన్లు కూడా వెయ్యి రూపాయలు పెంచి అందిస్తోంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రజలకు అందించేందుకు రెడీ అవుతోంది. సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో కీలకమైన హామీ తల్లికి వందనం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని అమ్మ ఒడి పేరుతో అందించింది. దానికి కూటమి ప్రభుత్వం పేరు మార్చి తల్లికి వందనం పేరుతో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏడాదికి 15 వేల రూపాయలు వేయనున్నారు.…
Read MoreAP | బీసీలకు రక్షణ కోసం చట్టం | Eeroju news
బీసీలకు రక్షణ కోసం చట్టం విజయవాడ, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) AP పరిపాలన ప్రజల్ని మెప్పించేలా చేయగలిగితే మళ్లీ మళ్లీ ఓటు వేయడానికి ఆసక్తి చూపుతారు. ప్రజాస్వామ్య రాజకీయంలో ఇది మొదటి సూక్తి. మరి ఐదేళ్ల పాలనలో ప్రజల్ని మెప్పించడం సాధ్యమేనా అంటే కష్టమే కానీ అసాధ్యం కాదని చాలా సార్లు ప్రభుత్వాలకు కంటిన్యూటీ ఇచ్చి ప్రజలు నిరూపించారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో ప్రజల్ని సంతృప్తి పరిచేలా పాలన సాగించడం అంత తేలిక కాదు. అదే సమయంలో వారి మనసులో ఆశల్ని, ఆకాంక్షల్ని కనిపెట్టగలిగితే పెద్ద కష్టమేం కాదు. ఏపీలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి వివిధ వర్గాల్లో ఉన్న ఆశల్ని తీర్చేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా బీసీ వర్గాల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టం తేవాలని నిర్ణయించుకుంది. ఎస్సీ, ఎస్టీలకు రక్షణ…
Read More