Koneti Adimulam | కోనేటి ఆదిమూలం కేసు అలా క్లోజ్ | Eeroju news

Koneti Adimulam

కోనేటి ఆదిమూలం కేసు అలా క్లోజ్ తిరుపతి, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Koneti Adimulam రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు తేలిపోయింది. తన కేసు కొట్టి వేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలు అయిన వరలక్ష్మి కూడా ఇంప్లీడ్ అయి తాము రాజీకీ వచ్చామని కేసు అవసరం లేదని చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు వారాల కిందట సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధిస్తున్నారని అదే నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా టీడీపీ నేత హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. అ సమయంలో కోనేటి ఆదిమూలంతో తాను ఉన్న ప్రైవేటు వీడియోలను కూడా మీడియాకు రిలీజ్…

Read More

Vizianagaram | విజయనగరంలో ఆగని కూల్చివేతలు | Eeroju news

Vizianagaram

విజయనగరంలో ఆగని కూల్చివేతలు విజయనగరం, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Vizianagaram విజయనగరం జిల్లాలో హైడ్రా తరహా కూల్చివేతలు సంచలనంగా మారాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సైతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించారనే కారణంతో అధికారులు కూల్చివేతలకు దిగారు. ప్రస్తుతం ఈ మాన్సస్ ట్రస్ట్ కు చైర్మన్ గా మాజీ కేంద్రమంత్రి, తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తున్నారు.మాన్సస్ ట్రస్ట్ ను అశోక్ గజపతిరాజు తండ్రి డాక్టర్ పివిజి రాజు 1958లో నెలకొల్పారు. జిల్లాలో విద్యా వ్యవస్థ అభివృద్ధితో పాటు పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న సదుద్దేశ్యంతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించారు. ట్రస్ట్ ప్రారంభించిన తరువాత ఈ ట్రస్ట్ పర్యవేక్షణలో పలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఆ విద్యాసంస్థల…

Read More

Kharif purchases | అక్టోబరు 1 నుంచి ఖరీఫ్ కొనుగోళ్లు | Eeroju news

అక్టోబరు 1 నుంచి ఖరీఫ్ కొనుగోళ్లు

అక్టోబరు 1 నుంచి ఖరీఫ్ కొనుగోళ్లు విజయవాడ, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Kharif purchases ఖరీప్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు.ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాకి సొమ్ము చేరుతుందని వెల్లడించారు. రైతు పండించిన ప్రతి గింజా కొనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ధాన్యం అమ్మకం, మిల్లుల ఎంపికలో రైతుకే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. ప్రతి అడుగులో పారదర్శకంగా వ్యవహరిస్తామని….. ప్రతీ రైతుకీ భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. ఏఐఐబీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…

Read More

Vidadala Rajini | విడుదల రజనీ అరెస్ట్ తప్పదా | Eeroju news

Vidadala Rajini

విడుదల రజనీ అరెస్ట్ తప్పదా గుంటూరు, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Vidadala Rajini వైసీపీ నేతలకు కష్టాలు వెంటాడుతున్నాయా? ఈ జాబితా మరింత పెరిగే అవకాశముందా? తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ కూడా అందులో చేరిపోయారా? రేపో మాపో రజనీ అరెస్ట్ తప్పదా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.గడిచిన ఐదేళ్ల కాలం వైసీపీ స్వర్ణయుగం. ముఖ్యంగా నేతలకు కూడా. ఎందుకంటే బెదిరింపులు, దందాలకు పాల్పడినట్టు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారడంతో బాధితులు ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి విడుదల రజనీ వంతైంది. ఆమె పేరిట బంధువులు వసూళ్ల దందాపై విచారణకు ఆదేశించారు హోంమంత్రి అనిత.పల్నాడు జిల్లా పేరు చెప్పగానే ముందుగా గుర్తు కొచ్చేది స్టోన్ క్రషర్ బిజినెస్‌. అక్కడ ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. దీన్ని…

Read More

Tirumala | 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్ల వార్షిక ఆదాయం. | Eeroju news

3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్ల వార్షిక ఆదాయం.

3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్ల వార్షిక ఆదాయం. తిరుమల, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Tirumala కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర తిరుపతి ఆలయంలో లభించే లడ్డూలను భక్తులు ఎంతో శ్రద్ధతో ప్రసాదంగా గ్రహిస్తారు. ఈ లడ్డూలు దేశవ్యాప్తంగా పంపిణీ జరుగుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలోని (టిటిడి) వంటశాల అయిన పొటులో మాత్రమే వీటిని తయారు చేస్తారు. లడ్డూ తయారీ ప్రక్రియకు దిట్టం అని పేరు కూడా ఉండడం విశేషం.దిట్టం ప్రక్రియ ప్రకారం లడ్డూలో ఏయే పదార్థాలు ఎంత మోతాదులో వేయాలో అన్ని పక్కగా నిర్ధారణలుంటాయి. అయితే ఈ దిట్టం ప్రక్రియ తిరుమల దేవస్థానం చరిత్రలో ఆరుసార్లు మార్చడం జరిగింది. 2016 టిటిడి రిపోర్ట్ ప్రకారం.. శ్రీవారి ప్రసాదమైన లడ్డూలు దివ్య సుగంధం కలిగి ఉంటుంది. ఈ లడ్డూ తయారీలో ముఖ్యమైన…

Read More

Janasena | జనసేనలో చేరికలు.. గుర్రుగా కూటమి నేతలు | Eeroju news

జనసేనలో చేరికలు.. గుర్రుగా కూటమి నేతలు

జనసేనలో చేరికలు.. గుర్రుగా కూటమి నేతలు ఒంగోలు, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Janasena ప్రస్తుతం టీడీపీలో లీడర్ షిప్ కు కొదవలేదు. ఫుల్ టైట్ గా ఉంది. అయితే వైసీపీ అసంతృప్తుల్లో చాలా మంది జనసేనవైపు చూస్తుండడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. అటు జనసేనకు కూడా పెద్ద నాయకుల అవసరం ఉంది. రాజకీయాల్లో వలసలు కామన్. కలిసి వచ్చే వారిని కలుపుకొని పోవడమూ అంతే కామన్. అయితే ఈ వలసలు కాస్తా కూటమి ప్రభుత్వానికి ఎంత వరకు ఎఫెక్ట్ చూపుతాయన్నది కీలకంగా మారింది. కూటమి పరిణామాలు మారుతాయా? ఇబ్బంది రాకుండా డీల్ చేస్తారా అన్నది హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ నుంచి వలసలు ఆటోమేటిక్ గా కూటమివైపు వస్తున్నాయి. అక్కడ గుడ్ బై చెబుతున్న వారు అయితే టీడీపీ లేదంటే జనసేన వైపు చూస్తున్నారు.…

Read More

TTD evo Shyamala Rao | తిరుమల లడ్డూ తయారిలో కల్తీ జరిగిన మాట వాస్తవమే | Eeroju news

TTD evo Shyamala Rao

తిరుమల లడ్డూ తయారిలో కల్తీ జరిగిన మాట వాస్తవమే టీటీడీ ఈవో శ్యామలారావు   అమరావతి సెప్టెంబర్ 21 TTD evo Shyamala Rao తిరుమల లడ్డూ తయారిలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు. ల్యాబ్‌ నుంచి వచ్చిన నివేధికల ఆధారంగా కల్తీ జరిగినట్టు గుర్తించి సరఫరాదారు నుంచి నెయ్యి కొనుగోలును ఆపివేశామని పేర్కొన్నారు. శుక్రవారం టీటీడీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లడ్డూ కల్తీపై వివరాలను వెల్లడించారు. తిరుమల ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, అటువంటి చోట కల్తీ జరగడం దారుణమన్నారు. ఏపీలో అధికార మార్పిడి జరిగిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈవోగా బాధ్యతలు చేపట్టానని పేర్కొన్నారు. లడ్డూ నాణ్యత, ప్రమాణాలు తగ్గాయని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి తన దృష్టికి…

Read More

Rushikonda | రుషికొండ రహస్యాలు…. | Eeroju news

Rushikonda

రుషికొండ రహస్యాలు…. విశాఖపట్టణం, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Rushikonda ఏపీలో ఎన్నికలు పేదోడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధమని.. ప్రచారం సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పదేపదే పేర్కొన్నారు. అలాంటాయన తిరిగి అధికారంలోకి వస్తానన్న ధీమాతో విశాఖ రుషికొండపై నివాసానికి నిర్మింపచేసుకున్న ప్యాలెస్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కూటమి ప్రభుత్వానికి ఇప్పుడది వైట్ ఎలిఫెంట్‌లా మారింది. దాని నిర్మాణానికి రుషికొండపై కూలగొట్టిన కాటేజీలు.. అప్పట్లో అసలు ఏం జరిగిందన్న దానిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. అయితే ఆ ఎంక్వయిరీ టీమ్‌లో ఉన్న అధికారులు ఇంకా వైసీపీ విధేయత ప్రదర్శిస్తుండటంతో.. నిజాలు మరుగున పడిపోతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేసుకోవాలో? ఎలా వినియోగించుకోవాలో? కూటమి సర్కారుకు అంతుపట్టడం లేదు సుమారు 560కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా…

Read More

YS Jagan vs Anil Kumar | అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. | Eeroju news

అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్..

అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. నెల్లూరు, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) YS Jagan vs Anil Kumar   సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధ్యక్షుడు ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తున్నారు. వరుసగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లను మారుస్తున్నారు. ఆ క్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఇప్పటి దాకా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిని నెల్లూరు సిటీ ఇన్చార్జ్‌గా షిఫ్ట్ చేశారు. దాంతో వైసీపీలో నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటన్నది అర్థం కాకుండా తయారైంది. రాష్ట్రంలో వైసీపీ ఘోర ఓటమి చవి చూశాక లోపాలను సరిదిద్దుకునే పనిలో పడింది. రానున్న కాలంలో…

Read More

Indrakiladri mustabu for Dussehra | దసరాకు ఇంద్రకీలాద్రి ముస్తాబు | Eeroju news

దసరాకు ఇంద్రకీలాద్రి ముస్తాబు

దసరాకు ఇంద్రకీలాద్రి ముస్తాబు విజయవాడ, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Indrakiladri mustabu for Dussehra దసరా వచ్చేస్తుంది. అందులోనూ విజయవాడ దుర్గ గుడిలో జరిగే దసరా వేడుకలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఫేమస్. అయితే ఇటీవల విజయవాడ నగరం మొత్తం వరదలతో ఇబ్బంది పడడంతో ఈసారి దసరా వేడుకలు గతంలోలా జరుగుతాయా లేదా అమ్మవారి వైభవాన్ని ఈ ఏడాది చూడగలమా లేదా అని భక్తులు సందేహించారు. కానీ ఈసారి కూడా దుర్గ గుడిలో దసరాను ఎంతో వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అక్టోబర్ 3 నుంచి 12 వరకూ దసరా నవరాత్రులు జరుగుతాయని దుర్గగుడి కమిటీ తెలిపింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే సామాన్య భక్తులకు సైతం సంతృప్తికరంగా అమ్మవారి దర్శనం కల్పించడంతోపాటు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు…

Read More