Dokka Seethamma in google search… | గూగుల్ సెర్చ్ లో డొక్కా సీతమ్మ… | Eeroju news

Dokka Seethamma in google search...

గూగుల్ సెర్చ్ లో డొక్కా సీతమ్మ… కాకినాడ, జూలై 31, (న్యూస్ పల్స్) Dokka Seethamma in google search… డొక్కా సీతమ్మ.. ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టింది.దీంతో డొక్కా సీతమ్మ గురించి బలమైన చర్చ ప్రారంభమైంది.ఆమె ఎవరు? స్వాతంత్ర సమరయోధురాలా? దేశ నాయకురాలా? అంటూ అందరిలో అనుమానం ప్రారంభమైంది. ఆమె గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డొక్కా సీతమ్మ గురించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆమె పేరిట క్యాంటీన్లను తెరుస్తామని ప్రకటించారు. అయినా సరే డొక్కా సీతమ్మ గురించి ఎక్కువమందికి తెలియదు. తాజాగా ప్రభుత్వం ఆమె పేరును గౌరవిస్తూ పథకానికి పెట్టిన వేళ.. ఆమె గురించి…

Read More

Liquor with fake Hologram stickers | నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం | Eeroju news

Liquor with fake Hologram stickers

నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం నెల్లూరు, జూలై 31 (న్యూస్ పల్స్) Liquor with fake Hologram stickers వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం మద్యం అమ్మకాలపై శ్వేతపత్రం విడుదల చేశారు. మద్యం విక్రయాల్లో రూ.18 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని స్వయంగా సీఎం తెలిపారు. మద్యం విక్రయాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తామన్నారు. అయితే ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం అక్రమంగా సరఫరా చేసినట్లు అభియోగాలు వస్తున్నాయి. మద్యం డిపోల నుంచి కాకుండా నేరుగా ఉత్పత్తి కంపెనీల నుంచే షాపులకు మద్యం…

Read More

Big hopes for the Kadapa cadre | కడప కేడర్ కు భారీ ఆశలు | Eeroju news

Big hopes for the Kadapa cadre

కడప కేడర్ కు భారీ ఆశలు కడప, జూలై 31 (న్యూస్ పల్స్) Big hopes for the Kadapa cadre ఐదేళ్ల జగన్ పాలనలో కడప జిల్లాలో టీడీపీ కేడర్ కుదేలైంది. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణుల్లో కసి వచ్చింది. చంద్రబాబు రిలీజ్ అయ్యే వరకు కడప జిల్లా వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో రోజూ నిరసనలు తెలిపారు. వైసీపీ వారి దాడులను తట్టుకుని పార్టీ కోసం కష్టపడ్డారు. ఇలా కష్టపడ్డ వారంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు. కడప జిల్లాలో జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ ఏడు చోట్ల గెలుపొందింది. వైసీపీ స్థాపన నుంచి ఆ పార్టీకి కంచుకోటగా మారిన జగన్ సొంత జిల్లాలో టీడీపీ పాగా వేయగలిగింది. మిగిలిన జిల్లా సంగతి ఎలా ఉన్నా జగన్ సొంత జిల్లాలో టీడీపీ…

Read More

Jagan in Sharmila Trap… | షర్మిల ట్రాప్ లో జగన్… | Eeroju news

Jagan in Sharmila Trap...

షర్మిల ట్రాప్ లో జగన్… విజయవాడ,జూలై 31 (న్యూస్ పల్స్) Jagan in Sharmila Trap… కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న వైఎస్ షర్మిల, మాట్లాడిన ప్రతీసారి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో అప్పటి జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. హోదాని తన సొంతం కోసం వాడుకుంటున్నారని దుమ్మెత్తిపోశారామె. అప్పుడే కాదు.. ఇప్పుడు అదే దూకుడు ప్రదర్శి స్తున్నారు. ఎక్స్ వేదికగా వైసీపీని తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ నేతలకు పోరాడటం చేత కాదని ఓపెన్‌గా చెబుతున్నారు. వైసీపీ నేతలకు మీడియా పాయింట్ ఎక్కువన్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే అధికార కూటమి కంటే.. వైసీపీని ఎక్కువగా దుయ్యబడుతున్నారు వైఎస్ షర్మిల. ఎందుకంటే జగన్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ఎండగడుతున్నారు. ఇక షర్మిల మొదటి నుంచి ప్రత్యేక హోదా పల్లవిని ఎత్తుకున్నారు.. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కూడా. వైసీపీ వద్ద ఎలాంటి…

Read More

Janasena | దుమ్మరేపుతున్న జనసేన… | Eeroju news

Janasena

దుమ్మరేపుతున్న జనసేన… విజయవాడ, జూలై 31, (న్యూస్ పల్స్) Janasena   ఏపీ పొలిటికల్ హిస్టరీలో జనసేనది ప్రత్యేక స్థానం. మొన్నటి వరకు ఫెయిల్యూర్ పార్టీ. కానీ ఈ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించడంతో జనసేన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. తన పార్టీ అభ్యర్థులు గెలవడమే కాదు.. ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపునకు కూడా పవన్ కళ్యాణ్ కారణమని నేషనల్ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. ప్రధాని మోదీ అయితే పవన్ కాదు.. తుఫాన్ అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ స్టామినాను జాతీయస్థాయిలో పెంచారు. 2014 ఎన్నికల నాటికి ఆవిర్భవించింది జనసేన. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు పవన్. రెండు చోట్ల మద్దతిచ్చిన వారే గెలిచారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరికి వారే ఒంటరిగా పోటీ…

Read More

Srisailam is like a full pot..Ten gates are lifted and water is released | నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల | Eeroju news

Srisailam is like a full pot..Ten gates are lifted and water is released

నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల శ్రీశైలం Srisailam is like a full pot..Ten gates are lifted and water is released ఎగువ ప్రాంతాల నుంచి గంట గంటకు కృష్ణా వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. దీంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి శ్రీశైలం పది గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్కు 2,75,700 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్నాయి. జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం…

Read More

This is our sincerity, this is our commitment | ఇది మా చిత్తశుద్ధి, ఇది మా నిబద్ధత | Eeroju news

This is our sincerity, this is our commitment

ఇది మా చిత్తశుద్ధి, ఇది మా నిబద్ధత హైదరాబాద్, జూలై 30 This is our sincerity, this is our commitment తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్  తీపి కబురు చెప్పింది.  అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో   సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణ మాఫీ నిధులు విడుదల  చేశారు. ఇప్పటికే రూ.లక్ష ఉన్నవారికి రుణమాఫీ పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,40,223 మందికి రూ.6190.01 కోట్లు నిధులు విడుదల చేశారు. మూడో విడత కింద 17, 75, 235 మంది రైతులకు రూ.12,224.98కోట్లు విడుదల చేశారు. రాజకీయ ప్రయోజనం కాదు… రైతు ప్రయోజనం ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సంతోషంగా ఉండాలని 6మే 2022న వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించామని..  గత ప్రభుత్వం  60నెలలు నాలుగు విడతల్లో రూ.లక్ష…

Read More

Metro at 5.30 | 5.30 గంటలకే మెట్రో | Eeroju news

Metro at 5.30

5.30 గంటలకే మెట్రో హైదరాబాద్, జూలై 30 Metro at 5.30 దరాబాద్ మెట్రో మరో ఫెసిలిటీ తీసుకొస్తోంది. ఉదయం ఐదున్నర గంటలకే తొలి ట్రైన్ నడపాలని నిర్ణయించారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉండే వాళ్లకు మెట్రో ట్రైన్ వరంలా మారింది. ఒక చివరి నుంచి మరో చివరకు వెళ్లాలంటే గంటల కొద్ది సమయం వృథా అయ్యాది. అదే మెట్రో వచ్చాక ఆ సమయం గంటకు తగ్గిపోయింది. ఉదయం ఆరు గంటలకు ప్రతి కారిడార్‌ నుంచి తొలి ట్రైన్ బయల్దేరుతుంది. ఇకపై దాన్ని మరింత ముందుకు తీసుకొచ్చింది మెట్రో యాజమాన్యం. ప్రతి రోజు ఉదయం 5.30కి ఇకపై మొదటి మెట్రో బయల్దేరనుంది. ఇప్పటికే దీనిపై ట్రయల్‌రన్ నిర్వహించిన అధికారులు ప్రతి రోజూ నడపాలని నిర్ణయించారు. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య…

Read More

Man Steals Rtc Bus | అత్తగారింటికి ఆర్టీసీ బస్సు వేసు కెళ్లిన అల్లుడు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! | Eeroju news

Man Steals Rtc Bus

అత్తగారింటికి ఆర్టీసీ బస్సు వేసు కెళ్లిన అల్లుడు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! నంద్యాల Man Steals Rtc Bus నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం వైరల్ అయ్యింది. అత్తా రింటికి ఆర్టీసీ బస్సు వేసుకుని వెళ్లడంతో అందరూ అవాక్కయ్యా రు. వెంకటాపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఆత్మకూరు నుంచి తన అత్తగారి ఊరు ముచ్చు మర్రి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్నాడు. ఎంతసేపటికి బస్సు రాక పోవడంతో దుర్గయ్యకు విసుగొచ్చిం ది. ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రాకపోవడంతో.. వెంటనే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఆర్టీసీ ప్రైవే ట్ బస్సు ఎక్కాడు.. ఆ బస్సును నడుపుకుంటూ అత్తగారి ఊరికి వెళ్లాడు.అయితే అక్కడితో దుర్గ య్య ఊరుకోలేదు. ఆత్మకూరు నుంచి ముచ్చుమర్రి బస్సులో వెళ్లి.. మళ్లీ బస్సును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో…

Read More

Full responsibilities of KTR K | కేటీఆర్ కే పూర్తి బాధ్యతలు | Eeroju news

మళ్లీ తప్పులో కాలు.. కేటీఆర్ కు ఏమైంది

కేటీఆర్ కే పూర్తి బాధ్యతలు హైదరాబాద్, జూలై 30, (న్యూస్ పల్స్) Full responsibilities of KTR K తిపక్షనేత హోదాలో మొదటి సారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. మళ్లీ ఫాంహౌస్‌కి వెళ్లిపోయారు. దాంతో అధికారంలో ఉన్నంత కాలం యువరాజులా చెలాయించిన కేటీఆర్‌పై పాపం పెద్ద భారమే పడినట్టు కనిపిస్తుంది. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకు సమాధానం చెప్పుకోవాలి. అటు అధికారపక్షం నేతల విమర్శలకు వివరణలు ఇచ్చుకోవాలి. మరోవైపు పదేళ్లు మిత్రత్వం కొనసాగించిన ఎంఐఎం కూడా ఇప్పుడు బీఆర్ఎస్‌పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగిపోతుండటంతో సతమతమవుతున్న కేటీఆర్.. ఈ ముప్పేట దాడితో ఒంటరి అయిపోతున్నారు. తెలంగాణలో కాళేశ్వరం కేంద్రంగా డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఇరు పార్టీల మధ్య వాటర్ వార్ హైవోల్టేజ్‌కి చేరుకుంది. బీఆర్ఎస్ చలో మేడిగడ్డతో కాళేశ్వరం పంచాయితీ కాక రేపుతోంది.…

Read More