Biden dropped out of the US presidential race | అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్‌ | Eeroju news

Biden dropped out of the US presidential race

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్‌ న్యూయార్క్, జూలై 22, (న్యూస్ పల్స్) Biden dropped out of the US presidential race అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్‌ వైదొలిగారు. ఈ విషయాన్ని స్వయంగా బైడెన్ ప్రకటించి తన మద్దతుదారులకు షాకిచ్చారు. డెమోక్రటిక్ పార్టీ కోసం, దేశ ప్రయోజనాల కోసం తాను కీలక నిర్ణయం తీసుకున్నానని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం వరకు, జనవరి 2025 వరకు పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల బైడెన్ కరోనా బారిన పడటం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై కొంతకాలం నుంచి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో US అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్…

Read More

Jagan is on the path of KCR | కేసీఆర్ బాటలోనే జగన్…. | Eeroju news

Jagan is on the path of KCR

కేసీఆర్ బాటలోనే జగన్…. హైదరాబాద్, జూలై 22, (న్యూస్ పల్స్) Jagan is on the path of KCR పెద్దరికం ఒకరు ఇస్తే వచ్చేది కాదు. తమకు తాముగా పెంచుకునేది.తమకు తాముగా పాటించేది. అదే ప్రజా మన్ననలను అందుకోగలుగుతుంది. తెలంగాణలో పెద్దరికాన్ని ప్రదర్శించారు కేసీఆర్. ఆయన పెద్దరికాన్ని తెలంగాణ ప్రజలు కూడా గౌరవించారు. వరుసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చిపెట్టారు. కానీ ఆయన పెద్దరికం మితిమీరింది. ప్రత్యర్థులను చులకన చేసింది. అదే వారిలో ఐక్యతకు కారణమైంది. తెలంగాణ సమాజం కెసిఆర్ ను పట్టించుకోకుండా చేసింది. పెద్దరికాన్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో తెలిస్తేనే అది నిలబడుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ది బెస్ట్ అని విశ్లేషకులు అభిప్రాయపడతారు. రాజకీయాల్లో ఉన్నవారు మాటను పొదుపుగా వాడాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడాలి. పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడాలి. ఈ విషయంలో చంద్రబాబు బెటర్ అనేది…

Read More

Yavvaram in spa centers | స్పా సెంటర్లలో యవ్వారం | Eeroju news

Yavvaram in spa centers

స్పా సెంటర్లలో యవ్వారం ఒంగోలు, జూలై 22 (న్యూస్ పల్స్) Yavvaram in spa centers బయటేమో స్పా, మస్సాజ్ సెంటర్ల బోర్డులు.. లోపలేమో యవ్వారం వేరే.. తనిఖీలకు వెళ్లిన పోలీసులు బిత్తరపోయారు.. ప్రకాశం జిల్లా ఎస్‌పిగా నాలుగురోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన దామోదర్‌ అసాంఘిక కార్యక్రమాలపై తనదైన స్టైల్లో దృష్టి పెట్టారు.. ఒంగోలులో మసాజ్‌ సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఒంగోలు నగరంలో మసాజ్ సెంటర్లు, స్పా క్లినిక్‌ల పేరుతో యువతులతో యువకులకు క్రాస్‌ జెండర్‌ మసాజ్‌లు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి.. దీంతో మొత్తం 16 స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు చేయాలని ఎస్‌పి దామోదర్ పోలీసు సిబ్బందిని అదేశించారు. ఎస్‌పి ఆదేశాల మేరకు బృందాలుగా విడిపోయిన పోలీసులు నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో నడుపుతున్న స్పా సెంటర్లపై…

Read More

Jagan is alone in Delhi | ఢిల్లీలో జగన్ ఒంటరి | Eeroju news

Jagan is alone in Delhi

ఢిల్లీలో జగన్ ఒంటరి విజయవాడ, జూలై 22 (న్యూస్ పల్స్) Jagan is alone in Delhi ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు జరిగిపోతున్నాయని దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎంపీలతో సమావేశం అయిన ఆయన కలసి వచ్చే పార్టీల మద్దతు కోసం ప్రయత్నించాలని కోరారు. అయితే వైఎస్ఆర్‌సీపీకి ఢిల్లీలో మద్దతుగా వచ్చే పార్టీలు పెద్దగా కనిపించడం లేదు. దీనికి కారణం వైఎస్ జగన్మోనహన్ రెడ్డి ఇంత కాలం అనుసరిస్తున్న వ్యూహమే అనుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీకి అప్రకటిత మిత్రపక్షంగా ఉన్నారు. మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో బీజేపీతో నేరుగా ఒక్క సారి కూడా పొత్తులు పెట్టుకోలేదు. ఓ సారి వైసీపీ నేరుగా  బీజేపీకి…

Read More

Rice and pulses at affordable prices | సరసమైన ధరలకు బియ్యం, కందిపప్పు | Eeroju news

Rice and pulses at affordable prices

సరసమైన ధరలకు బియ్యం, కందిపప్పు విజయవాడ, జూలై 22 (న్యూస్ పల్స్) Rice and pulses at affordable prices రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రిటైల్ మార్కెట్లలో సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పును ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రిటైల్ మార్కెట్లలో సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పును ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో  ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని రైతు బజార్లలో, ఉషోదయ, మెట్రో, రిలయన్స్, డిమార్ట్ రిటైల్ దుకాణాలలో సరసమైన ధరలలో నాణ్యమైన బియ్యం, కందిపప్పును ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు జేసీ సంపత్ కుమార్ చెప్పారు. ఇప్పటి వరకు 7 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల…

Read More

Is Sunita’s target | సునీత టార్గెట్ పూర్తయినట్టేనా | Eeroju news

Is Sunita's target

సునీత టార్గెట్ పూర్తయినట్టేనా కడప, జూలై 22 (న్యూస్ పల్స్) Is Sunita’s target వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత అనుకున్నది సాధించారు. జగన్ ప్రభుత్వాన్ని దించేయాలని అనుకున్నారు. జగన్ ఓటమికి తాను కూడా కొంత కారణమయ్యారని చెప్పకతప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తన తండ్రి వైఎస్ వివేకా హత్యపై నిజానిజాలు నిగ్గుతేల్చాలని ఆమె గత నాలుగేళ్లు పెద్ద యుద్ధమే చేశారు. న్యాయపరంగా హత్య కేసుపై పోరాటం చేశారు. హత్య కేసును ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంను ఆశ్రయించారు. అలాగే నిందితుల బెయిల్ ను రద్దు చేయాలని పెద్దయెత్తున పోరాటం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజూ మీడియా సమావేశాలతో హోరెత్తించేవారు. . ఇక ఎన్నికల సమయంలో కడప జిల్లాలో తన సోదరి వైఎస్ షర్మిలతో కలసి విస్తృతంగా ప్రచారం చేశారు.…

Read More

Chandrababu steps on peace and security | శాంతి భద్రతలుపై ఆచితూచి అడుగులు | Eeroju news

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు

శాంతి భద్రతలుపై ఆచితూచి అడుగులు విజయవాడ, జూలై 22, (న్యూస్ పల్స్) Chandrababu steps on peace and security తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతిభద్రతలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయన పథ్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడూ ఇలా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పలేదు. ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాలకు వెళ్లకుండా అడ్డుకోవడం, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను హత్యలు జరగడం వంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు సంక్షేమ పథకాల విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన స్ట్రిక్ట్ గా ఉంటారని గత పాలనను చూసిన వారికి ఎవరికైనా ఇలాగే తెలుస్తుంది. ఎందుకంటే ఒక అత్యాచారం జరిగినా, హత్యజరిగినా వెంటనే ఆయన నేరుగా స్పందించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్…

Read More

Heated politics in Chandragiri | చంద్రగిరిలో వేడెక్కిన రాజకీయాలు | Eeroju news

Heated politics in Chandragiri

చంద్రగిరిలో వేడెక్కిన రాజకీయాలు తిరుపతి, జూలై 22, (న్యూస్ పల్స్) Heated politics in Chandragiri చంద్రగిరిలో వైసీపీ, టీడీపీ పంచాయితీ మరింత ముదురుతోంది. అంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్ల నుంచి ఈ వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా మరోసారి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పులివర్తి నాని మధ్య మాటల యుద్ధం ఫీక్ స్టేజీకి చేరింది.తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఒకటేలా సాగుతోంది. పులివర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు, ఆరోపణలు వార్నింగులు కొనసాగుతున్నాయి. సై అంటే సై అంటున్న ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు బస్తీమే సవాల్ అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లకు మీరంటే మీరు…

Read More

Dead Pull & Wolverine | లేడీ డెడ్ పుల్ తో ప్రేక్ష‌కుల ముందుక రానున్న డెడ్ పుల్, విడుద‌లైన డెడ్ పుల్ & వాల్వ‌రిన్ ఫైన‌ల్ ట్రైల‌ర్ | Eeroju news

Dead Pull & Wolverine

Dead Pull & Wolverine లేడీ డెడ్ పుల్ తో ప్రేక్ష‌కుల ముందుక రానున్న డెడ్ పుల్, విడుద‌లైన డెడ్ పుల్ & వాల్వ‌రిన్ ఫైన‌ల్ ట్రైల‌ర్ రోజుకో స్పెష‌ల్ స‌ర్ప‌రైజ్ తో మార్వెల్ మూవీ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు డెడ్ పుల్ & వాల్వ‌రిన్ టీమ్. ర‌య‌న్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ప్ర‌థాన పాత్ర‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ రేంజ్ లో జూలై 26న విడుద‌లవ్వ‌నున్న చిత్రం డెడ్ పుల్ & వాల్వ‌రిన్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు ఇప్ప‌టికే వ‌రల్డ్ వైడ్ ఫుల్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ క్రేజ్ ని మ‌రింత‌గా పెంచేస్తూ డెడ్ పుల్ & వాల్వ‌రిన్ చిత్ర బృందం ఫైన‌ల్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. ఇప్ప‌టివ‌రుకు విడుద‌లైన ప్ర‌తి వీడియో కంటెంట్…

Read More

Ongoing loan waiver challenges | కొనసాగుతున్న రుణమాఫీ సవాళ్లు… | Eeroju news

Ongoing loan waiver challenges

కొనసాగుతున్న రుణమాఫీ  సవాళ్లు… హైదరాబాద్, జూలై 19, (న్యూస్ పల్స్) Ongoing loan waiver challenges తెలంగాణలో రైతు రుణమాఫీ మొదలైంది. గురువారమే  మొదటి విడతగా రూ.లక్షలోపు రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడం కోసం నిధులను విడుదల చేసింది. ఆగస్టు నెలాఖరులోపు రూ.2 లక్షల రుణాలను కూడా మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో చేసిన సవాలు తెరపైకి వచ్చింది.రైతు రుణమాఫీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్ రావుపై పరోక్షంగా రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘‘ఆ రోజు సవాల్ విసిరిన వారికి ఒకటే చెప్తున్నా.. మిమ్మల్ని మేం రాజీనామా చేయాలని కోరబోం. ఎందుకంటే మీరు ఎలాగూ పారిపోతారు. కానీ ఇకనైనా కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుంటుందని ఒప్పుకోండి. రాజకీయ ప్రయోజనాల…

Read More