Telangana | ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టిని కలిసిన కెసి వేణుగోపాల్‌ | Eeroju news

ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టిని కలిసిన కెసి వేణుగోపాల్‌

ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టిని కలిసిన కెసి వేణుగోపాల్‌ హైదరాబాద్ అక్టోబర్ 26 Telangana ఏఐసిసి జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కెసి వేణుగోపాల్‌ను ఆయన నివాసంలో ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అసెం బ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హా మీ మేరకు, కులగణనను తెలంగాణ నుం చే ప్రారంభిస్తామన్న హామీని అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కెసి వేణుగోపాల్‌కు వివరించారు.   Seethakka.. Uttam Kumar Reddy.. Bhatti Vikramarka have key responsibilities | సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కీలక బాధ్యతలు! | Eeroju news

Read More

KTR | జనం నోటా ఒకటే స్లోగన్.. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. | Eeroju news

జనం నోటా ఒకటే స్లోగన్..  వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. కేటీఆర్ విమర్శలు

జనం నోటా ఒకటే స్లోగన్..  వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. కేటీఆర్ విమర్శలు   హైదరాబాద్ KTR దద్దమ్మ పాలనలో ధర్నాలతో తెలంగాణ రాష్ట్రం దద్దరిల్లుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ఈమేరకు ఎక్స్ ట్విట్టర్,లో కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దిక్కుమాలిన పాలనలో ప్రజల జీవితాలు దిక్కుమొక్కు లేకుండా పోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, గ్రామ సచివాలయం నుంచి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు. రైతు నుంచి మొదలు రైస్ మిల్లర్ల వరకు. కార్మికుని నుంచి మొదలు కాంట్రాక్టర్ల వరకు. టీచర్ల నుంచి మొదలు పోలీస్ కుటుంబాల వరకు, అవ్వాతాతల నుంచి మొదలు ఆడబిడ్డల వరకు. విద్యార్థుల నుంచి మొదలు విద్యావంతుల వరకు,నిరుద్యోగుల నుంచి మొదలు ఉద్యోగుల వరకు,…

Read More

Police Families Protest | రోడెక్కిన పోలీస్ కుటుంబాలు | Eeroju news

రోడెక్కిన పోలీస్ కుటుంబాలు

రోడెక్కిన పోలీస్ కుటుంబాలు కరీంనగర్, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) Police Families Protest రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. పోలీస్ అధికారుల తీరు, ప్రభుత్వ విధానంపై మండిపడుతు ఆందోళనకు దిగారు. పోలీస్ డ్యూటీ పేరుతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఇంటికి రాకుండా పని చేయడం ఇదేం పోలీస్ డ్యూటీలని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆందోళన కలకలం సృష్టించడంతో పోలీసులు ఆందోళనకు దిగినవారిని అదుపులోకి తీసుకుని వదిలేశారు.‌రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ ఉంది.‌ అందులో పని చేసే కానిస్టేబుళ్ళ భార్యలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 40 మంది కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యులు ఆకస్మాత్తుగా సిరిసిల్ల లోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి ధర్నా…

Read More

BRS | బీఆర్ఎస్ పేరు మార్చే యోచన | Eeroju news

బీఆర్ఎస్ పేరు మార్చే యోచన

బీఆర్ఎస్ పేరు మార్చే యోచన కరీంనగర్, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) BRS బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ మధ్య రకరకాల ఫీలర్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న పార్టీ జెండాలో కేసీఆర్ ఫోటోకు బదులు కేటీఆర్ కనిపించారు. ఎవరో అభిమానంతో చేసిందని చాలామంది భావించారు. కానీ, అంచనా ప్రకారమే పెట్టారట. దీనిపై పబ్లిక్ నుంచి రియాక్షన్ పెద్దగా లేకపోవడంతో.. దాన్ని అంచెలంచెలుగా అమలు చేయాలన్నది ఆ పార్టీ నుంచి ఇప్పుడు వినిపిస్తున్నమాట.జెండాలో ఫోటోయే కాదు.. ఇప్పుడు పార్టీ పేరు సైతం మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. గురువారం ఆదిలాబాద్‌లో చేపట్టిన రైతు పోరు సభలో కేటీఆర్ దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అంటే రాష్ట్ర సమితి కాదని.. భారత రైతు సమితి వచ్చే విధంగా మాట్లాడారు. దీంతో పార్టీలో మార్పులు మొదలవుతున్నాయనే సంకేతాలు క్రమంగా…

Read More

HYDRA | నాలుగు చెరువులతో హైడ్రా పనులు మొదలు | Eeroju news

నాలుగు చెరువులతో హైడ్రా పనులు మొదలు

నాలుగు చెరువులతో హైడ్రా పనులు మొదలు హైదరాబాద్, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) HYDRA రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా, తన పని తాను చేసుకుపోతోంది. రాబోయే ఆరునెలల్లో చేయబోయే టార్గెట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు చెరువులను సుందరీకరణ చేయనుంది. ప్రస్తుతం ఆయా పనుల్లో బిజీ ఉంది. హైదరాబాద్ డిజాస్టర్ రెన్సాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-హైడ్రా దృష్టి పెట్టింది. ఓ వైపు ప్రభుత్వ భూములను కాపాడుతూనే మరోవైపు చెరువులను సుందరీకరణ చేయాలని నిర్ణయించుకుంది. తనను తానే టార్గెట్ ఫిక్స్ చేసింది. హైదరాబాద్ సిటీలో చెరువుల పూర్వభవానికి పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలివిడతగా నాలుగు చెరువుల సుందరీకరణను ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేసింది. వాటిలో బాచుపల్లి- ఎర్రగుంట చెరువు, మాదాపూర్- సున్నం చెరువు, కూకట్‌పల్లి-నల్లచెరువు,…

Read More

Konda Surekha | కొండా సురేఖకు కోర్టుక్లాస్ | Eeroju news

కొండా సురేఖకు కోర్టుక్లాస్

కొండా సురేఖకు కోర్టుక్లాస్ హైదరాబాద్, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) Konda Surekha కేటీఆర్ పిటిషన్‌పై సిటీ సివిల్‌ కోర్టు విచారణ జరిపింది. కొండా సురేఖపై కేటీఆర్‌ పరువు నష్టం కేసు వేయగా..ఈ పిటిషన్‌పై సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా కొండా సురేఖకు ఆదేశాలిచ్చింది. విచార‌ణ‌లో భాగంగా బాధ్యత కలిగిన ప‌ద‌విలో ఉండి అలాంటి వ్యాఖ్య‌లు చేయడం స‌రికాద‌ని కోర్టు పేర్కొంది. అందులోనూ ఒక ప్ర‌జా ప్ర‌తినిధి నుంచి ఇలాంటి మాట‌లు రావ‌డం తీవ్ర అభ్యంత‌క‌రం అని తెలిపింది. అలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయంది. మ‌రోసారి కేటీఆర్‌పై అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించింది. ఆమె వ్యాఖ్యలను మీడియా, సోషల్‌ మీడియా, ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంట‌నే తొలగించాలని న్యాయ‌స్థానం ఆదేశించింది. అంతే…

Read More

Revanth Reddy | రేవంత్ మౌనానికి కారణం ఏమిటో… | Eeroju news

రేవంత్ మౌనానికి కారణం ఏమిటో...

రేవంత్ మౌనానికి కారణం ఏమిటో… హైదరాబాద్, అక్టోబరు 25, (న్యూస్ పల్స్) Revanth Reddy ధరలు పెంచింతే.. ఆదాయం వచ్చేది, ఖజానా నిండేది.. ఆరు గ్యారంటీలు అమలయ్యేది. ఇదీ సీఎం రేవంత్‌కు అధికారులు చేసిన ప్రతిపాదన. మద్యం ధరలు.. విద్యుత్‌, ఎల్‌ఆర్ఎస్ చార్జీలు పెంచేద్దామని సూచించగా.. రేవంత్‌ పెదవి విరిచినట్లు టాక్. ప్రస్తుతానికి ఇవన్నీ పక్కనపెట్టమని చెప్పారట. రేవంత్ నిర్ణయం వెనక కారణం ఏంటి.. అధికారుల ప్రతిపాదనలపై మౌనానికి కారణం ఏంటి.. సచివాలయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి..తెలంగాణ సర్కార్‌.. ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలుతో పాటు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల కొరత రేవంత్ సర్కార్‌ను తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీ కోసం సుమారు 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. 2లక్షలపైన…

Read More

KTR | కేటీఆర్ నోటీసులతో జవాబులు | Eeroju news

కేటీఆర్ నోటీసులతో జవాబులు

కేటీఆర్ నోటీసులతో జవాబులు హైదరాబాద్, అక్టోబరు 25, (న్యూస్ పల్స్) KTR నేను ఎవరినైనా అనొచ్చు.. కానీ నన్నెవరూ అనొద్దు.. మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఇదేనా. అంటే ప్రత్యర్థుల నుంచి అవునన్న సమాధానమే వస్తోంది. ఎందుకంటే గతంలో కేటీఆర్ చాలా సార్లు నోరు జారారు. మొన్నటికి మొన్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు వేసుకోవాలన్నారు. మహిళా కమిషన్ ఆగ్రహానికి గురయ్యారు. విచారణకూ హాజరై వివరణ ఇచ్చుకున్నారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో సీఎంను ఏకవచనంతోనూ పిలిచి ఆ తర్వాత మాటలు వెనక్కు తీసుకున్నారుకొత్తగా తనపై విమర్శలు చేసేవారిపై లీగల్ నోటీసులు సంధిస్తున్నారు. ప్రతి విమర్శలకు ‘నోటి’ని కాకుండా నోటీసులనే నమ్ముకుంటున్నారు. అంతకు ముందు మంత్రి కొండా సురేఖ విషయంలోనూ అదే చేశారు. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్లపైనా లీగల్ నోటీసులనే నమ్ముకున్నారు.…

Read More

KTR | మళ్లీ తప్పులో కాలు.. కేటీఆర్ కు ఏమైంది | Eeroju news

మళ్లీ తప్పులో కాలు.. కేటీఆర్ కు ఏమైంది

మళ్లీ తప్పులో కాలు.. కేటీఆర్ కు ఏమైంది హైదరాబాద్, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) KTR తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవకాశాన్ని వినియోగించుకుని బోర్లా పడుతున్నారు. లేటెస్ట్‌గా తెలంగాణ విద్యుత్ ఛార్జీలు పెంచుతారంటూ అప్పుడు ప్రచారం మొదలుపెట్టేశారాయన.అధికార పార్టీపై ఉద్యమం చేయాలంటే జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. తేడా వస్తే ప్రజలు చాలా చులనకగా చూస్తారు. దానికి ఓ ఒక్కపార్టీ మినహాయింపు కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి బురద జల్లుతూనే ఉన్నారు కేటీఆర్ సంబంధం లేని విషయాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ప్రత్యర్థులపై రాళ్లు వేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో బోర్లా పడ్డారు.. పడుతున్నారు కూడా. అయినా కాంగ్రెస్ సర్కార్ ఏదో చేస్తోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.అందుకు ఎగ్జాంపుల్…

Read More

Political | అన్నా.. చెల్లి మధ్య సరస్వతి పవర్స్… అసలేం జరిగింది… | Eeroju news

అన్నా..చెల్లి మధ్య సరస్వతి పవర్స్... అసలేం జరిగింది...

అన్నా..చెల్లి మధ్య సరస్వతి పవర్స్… అసలేం జరిగింది… హైదరాబాద్, అక్టోబరు 4, (న్యూస్ పల్స్) Political ఏపీలో పొలిటికల్‌ ప్రత్యర్ధులుగా ఉన్న అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంచాయితీ మొదలైంది. తనకు తెలియకుండానే తన కంపెనీ షేర్లు బదలాయించారంటూ తన తల్లి విజయమ్మకు లీగల్‌ నోటీస్‌ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్. అదే సమయంలో ఆస్తుల పంపకం అగ్రిమెంట్‌ రద్దు చేసుకుందామంటూ షర్మిలకు లేఖ రాయడంతో అంతే ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు చెల్లెలు. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో తల్లి విజయమ్మకు తాను ఇచ్చిన 1శాతం వాటా గిఫ్ట్‌ డీడ్‌ను తనకు తెలియకుండా షర్మిలకు బదలాయించారని.. దీనిని రద్దు చేయాలంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు మాజీ సీఎం జగన్‌. సరస్వతీ పవర్‌ కంపెనీలో 99శాతం షేర్లు జగన్‌కూ, 1శాతం షేర్లు విజయమ్మకూ ఉన్నాయి.…

Read More