పదేళ్లు పోయో… మరో పదేళ్లు ఆగాలా… విజయవాడ, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Pawan Kalyan గత ఎన్నికలలో తాను పోటీచేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయారు పవన్ కళ్యాణ్. పవన్ పని అయిపోయింది. ఇక రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రతిపక్షాలు గేలిచేశాయి. అయినా అవన్నీ పట్టించుకోకుండా పవన్ కళ్యాన్ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. గత ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం బాగా కనిపించింది. అనూహ్యంగా కూటమి పక్షాలకు అఖండ విజయం అందించారు ప్రజలు. జనసేన కూడా తనకు కేటాయించిన సీట్లను నిలబెట్టుకోవడమే కాకుండా రెండు పార్లమెంట్ సీట్లు కూడా గెలిపించుకుంది. పవన్ ఏ పదవీ ఆశించకుండానే డిప్యూటీ సీఎం వంటి కీలక పదవి లభించింది. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన ప్రభంజనమే కనిపిస్తోంది. అయితే జనసేనానిఉండుండి ఓ…
Read MoreTag: Vijayawada
Sajjala Ramakrishna Reddy | సజ్జలకు కీలక బాధ్యతలు | Eeroju news
సజ్జలకు కీలక బాధ్యతలు దూరంగా సీనియర్ నేతలు విజయవాడ, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Sajjala Ramakrishna Reddy వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ ప్రకటించడం ఆ పార్టీలో కొత్త దుమారానికి కారణం అవుతోంది. పైకి ఎవరూ మాట్లాడకపోయినప్పటికీ చాలా మంది సీనియర్లు ఇక పార్టీలో యాక్టివ్గా ఉండటం కన్నా వీలైనంత మౌనం పాటిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న సీనియర్ల కన్నా సజ్జల ఏ మాత్రం సీనియర్ కాదు. ఆయన జగన్ కోటరీని నడుపుతున్నారన్న అసంతృప్తి వారిలో ఉంది. 2014లో గెలుస్తామనుకున్న వైసీపీ నేతలు ఓడిపోయారు. అయితే ఐదేళ్ల పాటు కష్టపడ్డారు. ఈ కష్టంలో మొదట జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉంటే తర్వాత విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. ఆయన 2019 ఎన్నికలకు ముందు…
Read MoreYS Jagan | వైసీపీ ఎమ్మెల్సీల సేఫ్ గేమ్ | Eeroju news
వైసీపీ ఎమ్మెల్సీల సేఫ్ గేమ్ విజయవాడ, నవంబర్ 20, (న్యూస్ పల్స్) YS Jagan వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో పదకొండు మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని .. అది ఇచ్చే వరకూ సభకు వచ్చేది లేదని వైసీపీ సభాపక్ష నేత జగన్ ప్రకటించారు. దాంతో అసెంబ్లీలో విపక్షం లేకుండా పోయింది. కానీ శాసనమండలిలో మాత్రం ఆ పార్టీకి మెజార్టీ ఉంది. బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష నేత హోదా ఉంది. శాసనసభలో కాకకపోయినా శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆశించిన ఆ పార్టీ క్యాడర్ కు జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదు. శాసనమండలిలో వైసీపీకి పూర్తి మజార్టీ ఉంది. టీడీపీకి పది మంది ఎమ్మెల్సీలు ఉంటే.. వైసీపీకి 37 మంది ఉన్నారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు వైసీపీకి చెందినవారే. ఇలాంటి…
Read MoreNara Lokesh | రాటు తేలుతున్న లోకేష్…. | Eeroju news
రాటు తేలుతున్న లోకేష్…. విజయవాడ, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Nara Lokesh టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా పూర్తిగా పరిణితి చెందారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు తరహాలోనే ఆయన రాజకీయాలను బాగానే ఒంటబట్టించుకున్నారని అర్థమవుతుంది. ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేష్ లో చాలా వరకూ మార్పు కనిపిస్తుంది. ఇటు తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలను చూస్తుంటే లోకేష్ మాత్రం పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఒక రకంగా నారా లోకేష్ కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అలవడిందని పార్టీ నేతలే చెబుతుండటం విశేషం. ఒకరకంగా తండ్రి చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా బయటకు కనిపించకపోయినా ముఖ్యమైన నిర్ణయాలన్నీ లోకేష్ తీసుకుంటున్నవే. స్పీడ్ డెసిషన్…
Read MoreKodali Nani | కొడాలి నాని అడ్డంగా బుక్కైనట్టేనా | Eeroju news
కొడాలి నాని అడ్డంగా బుక్కైనట్టేనా విజయవాడ, నవంబర్ 19, (న్యూస్ పల్స్) Kodali Nani పవర్లోకి రాగానే కొడాలి నానిని టార్గెట్ చేసింది కూటమి సర్కార్. విచారణలు, గుడివాడలో అక్రమాలు అంటూ కేసుల వరకు వెళ్లింది వ్యవహారం. అక్కడక్కడ నాని మీద FIRలు కూడా అయ్యాయి. ఏ క్షణంలో అయినా కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కారణాలేంటో తెలియదు కానీ..టీడీపీ క్యాడర్, లీడర్ల నుంచి వస్తున్న ఒత్తిడికి అనుగుణంగా నాని మీద వేగంగా యాక్షన్ తీసుకోలేకపోయింది కూటమి సర్కార్. ఇప్పుడు ఆయన చుట్టూ ఉచ్చు బిగించే ప్లాన్ జరుగుతోంది.కొడాలి నాని..మీడియా ముందుకు వస్తే చాలు..చంద్రబాబు, లోకేశ్ పేరెత్తితే ఒంటి కాలిపై లేచేవారు. ఓ రేంజ్లో ఫైర్ అయ్యేవారు. ఇంకో రకంగా చెప్పాలంటే అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడటమే స్టైల్గా పెట్టుకున్నారనొచ్చు. వైసీపీ హయాంలో…
Read MoreAghori | అఘోరీ లక్ష్యాలు ఏంటీ… ఎందుకీ రచ్చ | Eeroju news
అఘోరీ లక్ష్యాలు ఏంటీ… ఎందుకీ రచ్చ విజయవాడ, నవంబర్ 19, (న్యూస్ పల్స్) Aghori అసలు అఘోరీ మాత టార్గెట్ ఏమిటో రోజురోజుకు ప్రజల మద్దతు కూడగట్టుకోవడం ఏమో కానీ, వ్యతిరేక పవనాలు మాత్రం వీస్తున్నాయని టాక్. సనాతన ధర్మ పరిరక్షణ ఒక్కటే లేడీ అఘోరీ లక్ష్యమైతే ఎందుకింత రచ్చ? రహదారిపై బైఠాయింపు ఎందుకు? అసలు ఆమె ఏం కోరుకుంటోందనేది ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.లేడీ అఘోరీ అంటేనే అందరికీ పరిచయం. కారణం సోషల్ మీడియా వేదికగా ఈమెపై సాగిన ప్రచారాలు కూడా అన్నీ ఇన్నీ కావు. ముత్యాలమ్మ ఆలయంపై దాడి సమయంలో వెలుగులోకి వచ్చిన లేడీ అఘోరీ, సనాతనధర్మ పరిరక్షణ తన భాద్యత అంటూ ప్రకటించారు ఆ సమయంలో. అలా తెలంగాణలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే పలు ఛానల్స్ కి పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చి…
Read MoreAP CM Chandra Babu | 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ | Eeroju news
48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ విజయవాడ, నవంబర్ 19, (న్యూస్ పల్స్) AP CM Chandra Babu ఏపీలో ఖరీప్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక అమలు చేస్తున్నారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రూ.314 కోట్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో రైతుల దగ్గర ధాన్యం కొని, నెలల తరబడి డబ్బులు చెల్లించలేదన్న విమర్శల నేపథ్యంలో… కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై దృష్టిపెట్టింది. వైసీపీ దిగిపోయే నాటికి 84,724 మంది రైతులకు రూ.1674.47 కోట్లు బకాయిలు కూటమి సర్కార్ తెలిపారు. ఆ బకాయిలను రైతులకు చంద్రబాబు ప్రభుత్వమే చెల్లించిందని…
Read MoreAmaravati | అమరావతి కోసం అదిరిపోయే ప్లాన్ | Eeroju news
అమరావతి కోసం అదిరిపోయే ప్లాన్ విజయవాడ, నవంబర్ 18, (న్యూస్ పల్స్) Amaravati ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేరే లెవల్కు తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోంది. చుట్టుపక్కల ఉన్న నగరాలను కలుపుకొని దీన్ని మెగా సిటీగా రూపకల్పన చేయాలని భావిస్తోంది. కొత్త రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ మతిపోయేలా చేస్తోంది. కోటి మంది జనాభాతో ప్రపంచంలోనే టాప్ మెగా సిటీగా తీర్చిదిద్దాలని స్కెచ్ వేస్తోంది ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే ప్రతిపాదనలు రెడీ చేసింది. అమరావతితోపాటు విజయవాడ, గుంటూరు, మంగళగిరిని కూడా వేరే లెవల్క తీసుకెళ్లాలని సీఆర్డీఏను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజధాని పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నప్పటికీ దాని ఎఫెక్ట్తో జరిగే అభివృద్ధిని మాత్రం మిగతా మూడు నగరాలకు వ్యాప్తి చెందేలా చూస్తున్నారు. అందుకోసం ఈ నగరాల్లో ప్రత్యేకంగా తీర్తిదిద్దే పనికి శ్రీకారం చుట్టబోతోంది.…
Read MorePawan Kalyan | సోషల్ మీడియా నియంత్రణకు చట్టం | Eeroju news
సోషల్ మీడియా నియంత్రణకు చట్టం విజయవాడ, నవంబర్ 18, (న్యూస్ పల్స్) Pawan Kalyan ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు సోషల్మీడియా చుట్టే తిరుగుతున్నాయ్. హద్దులు దాటి పోస్టులు చేస్తూ.. బూతులతో టార్గెట్ చేస్తూ.. కుటుంబాలను లాగుతున్న సోషల్ మీడియా జాదూలకు.. ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇక అటు వైసీపీకి చెందిన కొందరు నేతలను కూడా అరెస్ట్ చేశారు. డైరెక్టర్ రాంగోపాల్వర్మతో పాటు.. వైసీపీ నేత పోసాని, సానుభూతిపరురాలు శ్రీరెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు.చంద్రబాబు, పవన్, లోకేశ్తో పాటు.. హోంమంత్రి అనితపై.. సోషల్మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని వీరిపై కేసులు నమోదు కాగా.. వీరి అరెస్ట్కు దాదాపు రంగం సిద్ధం అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఐతే సోషల్మీడియా అరాచకాలకు చెక్ పెట్టేలా ఏపీ సర్కార్ కొత్త చట్టం తీసుకొచ్చేందుకు రెడీ కావడం.. సరికొత్త సంచలనానికి…
Read MoreAP Schools | ఇక ఏపీలో ప్రైమరీ స్కూల్స్ లో మార్పులు | Eeroju news
ఇక ఏపీలో ప్రైమరీ స్కూల్స్ లో మార్పులు విజయవాడ, నవంబర్ 18, (న్యూస్ పల్స్) AP Schools ఏపీలో ఇకపై రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా స్కూళ్ల టైమింగ్స్ మార్పుపై కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు నడపాలని నిర్ణయించింది. అలాగే స్కూల్ టైమింగ్స్ మార్పుపై కూడా నిర్ణయిం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. రెండు రకాలుగా ప్రాథమిక పాఠశాలలు 1. బేసిక్ ప్రైమరీ స్కూల్ 2. మోడల్ ప్రైమరీ స్కూల్ 1. బేసిక్ ప్రైమరీ స్కూల్…
Read More